నిండా మునిగినా.. రైతుకు తప్పని నిరీక్షణ
తమది రైతు ప్రభుత్వమని జగన్ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు విభిన్నంగా ఉంది. భూగర్భ జలాలు పెంచాలనే లక్ష్యంతో 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం ఉమ్మడి అనంత జిల్లాలోనే అతిపెద్దదైన బుక్కపట్నం చెరువును హంద్రీనీవా నీటితో నింపింది.
ఐదేళ్లుగా బుక్కపట్నం చెరువు ముంపు గ్రామాల గోడు పట్టని ప్రభుత్వం
392 మంది రైతులకు రూ.158 కోట్లతో ప్రతిపాదనలకే పరిమితం
పుట్టపర్తి, బుక్కపట్నం, న్యూస్టుడే: తమది రైతు ప్రభుత్వమని జగన్ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు విభిన్నంగా ఉంది. భూగర్భ జలాలు పెంచాలనే లక్ష్యంతో 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం ఉమ్మడి అనంత జిల్లాలోనే అతిపెద్దదైన బుక్కపట్నం చెరువును హంద్రీనీవా నీటితో నింపింది. భారీ చెరువు కావడం, పూర్తిస్థాయిలో నింపడంతో అప్పటి వరకు సాగులో ఉన్న పరిసర మూడు మండలాల్లోని వ్యవసాయ బోరుబావులు, పండ్లతోటలు, పంటలు మునిగిపోయాయి. దీంతో తమకు పరిహారం అందించాలని రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. 2019 ఎన్నికల సమయంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముంపునకు గురైన ప్రతి ఎకరాకు పరిహారం అందిస్తామని, ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నికైన వెంటనే తగు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి హామీ ఇచ్చారు. ఐదేళ్లు అవుతున్నా.. సంబంధిత అధికారులు పరిశీలించడం.. నివేదికలు రూపొందించడం తప్ప క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చింది లేదు.
బుక్కపట్నం చెరువు ప్రాంతంలో పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాలకు చెందిన 392 మంది రైతులకు చెందిన 465.57 ఎకరాలు సాగు భూమి ఉంది. భూముల్లో వరి, మొక్కజొన్న, మామిడిచెట్లు, కూరగాయలు సాగు చేసి జీవనం సాగించేవారు. 2018లో హంద్రీనీవా నీటితో చెరువును నింపడంతో 392 మంది రైతులు వ్యవసాయ సాగు భూములు కోల్పోయారు. దీంతో అధికారులు పరిశీలించి 465.57 ఎకరాల భూములకు సంబంధించి రూ.158 కోట్ల పరిహారం అందించాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. పరిహారం అందుతుందనే ఆశతో రైతులు ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ముంపు భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు ఉపాధి కోల్పోయి వీధినపడ్డారు.
నయాపైసా విదల్చలేదు..
రైతులు ఉమ్మడి కలెక్టరేట్, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్లో 30 సార్లు స్పందన కార్యక్రమంలో పరిహారం అందించాలని అర్జీలు అందజేశారు. సాగు భూములు కోల్పోయి, ఉపాధి లేక కుటుంబపోషణకు కూలీ పనులకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. పరిహారం అందక, ఉపాధి లేక దిక్కుతోచని పరిస్థితిలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు పరిహారం అందిస్తామని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ఓట్లు వేయించుకున్నారు. తర్వాత మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ముంపు భూములను పరిశీలించారు. నివేదికలు ప్రభుత్వానికి పంపడం జరిగిందని, త్వరలో రైతులకు పరిహారం అందిస్తామని రెండోసారి హామీ ఇచ్చారు. ఐడేళ్లు గడిచినా నయా పైసా కూడా పరిహారం అందలేదు.
నమ్మించి మోసం చేశారు
- రాఘవ, పుట్టపర్తి
పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ ఐడేళ్లుగా ప్రదక్షిణ చేస్తున్నా. సాగు భూమి, బోరుబావి కోల్పోయాను. వైకాపా అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఐడేళ్లు గడిచినా నయా పైసా కూడా పరిహారం అందలేదు. పొలంలోకి వెళ్లే పరిస్థితి లేదు. పరిహారం ఇవ్వాలని ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంది. నమ్మించి మోసం చేశారు.
ఉన్న భూమిని కోల్పోయా
- నాగభూషణ, జానకంపల్లి
దశాబ్దాలు కాలంగా సాగు చేస్తున్నా. వ్యవసాయ భూమి ముంపునకు గురికావడంతో ఉపాధిలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా, 1.70 ఎకరాలు భూమిని కోల్పోయా, ప్రతి ఏటా వరి, మొక్కజొన్న పంట సాగు చేసి కుటుంబాన్ని పోషించేవాడిని. ఐదేళ్లుగా ముంపు గురికావడంతో సాగు చేసే అవకాశం లేకుండాపోయింది. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నా, పరిహారం అందించి ఆదుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనంత మనవడినంటావు..గేట్లు గ్రీజుకూ డబ్బుల్లేవంటావు!
[ 07-05-2024]
మా అమ్మ వాళ్లది పెద్దపప్పూరు మండలం.. అనంతపురం జిల్లా మనవడిని అన్నావు.. సెంటుమెంట్తో ఓట్లు వేయించుకున్నావు. అదే పెద్దపప్పూరు మండలంలోని ప్రాజెక్టులను గాలికి వదిలేశావు. -
9 గంటల విద్యుత్తు.. ఎక్కడ జగన్?
[ 07-05-2024]
మాట తప్పను.. మడమ తిప్పను అన్నాడు.. సీఎం అయ్యాక మాట తప్పాడు.. హామీలను మడత పెట్టేశాడు. -
కలిసి పనిచేయండి.. విజయం సాధించండి
[ 07-05-2024]
అనంత నగరం ఆర్.కన్వెన్షన్ హాలులో సోమవారం ఉదయం తెదేపా అధినేత చంద్రబాబును కలిసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. -
బహిరంగంగా డబ్బు పంపిణీ
[ 07-05-2024]
అధికార వైకాపాకు ఓటమి భయం పట్టుకుంది. ఎలాగైనా ఓట్లను కొనేసి గెలవడానికి అడ్డదారులను ఎంచుకుంటోంది. -
నిధులు, నీళ్లు ఇవ్వకుండా.. ఊళ్లెలా నిర్మిస్తావు జగన్
[ 07-05-2024]
ఇళ్లుకాదు.. ఊర్లే నిర్మిస్తున్నామంటూ పదేపదే గొప్పలు చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన పేరుపై నిర్మిస్తున్న కాలనీల్లో సమస్యలు తాండవం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. -
చెరువులపై వైకాపా నాయకుల పంజా
[ 07-05-2024]
కరవునేల కదిరి ప్రాంతంలో అధికారపార్టీకి చెందిన కొందరు కబ్జా రాయుళ్ల కళ్లు చెరువులపై పడ్డాయి. -
‘సీఎం జగన్ ఓ పిచ్చోడు’
[ 07-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఓ పిచ్చోడని హిందూపురం ఎమ్మెల్యే, ప్రస్తుతం తెదేపా అభ్యర్థి బాలకృష్ణ ఆరోపించారు. -
ఎన్నికల ముందు అధికారిక తాయిలాలు
[ 07-05-2024]
ఎన్నికల ముందు గ్రామాల్లోని వైకాపా నాయకులకు జగన్ ప్రభుత్వం అధికారిక తాయిలాలు గుమ్మరిస్తోంది. -
తెదేపా ప్రచారంలో తప్పెట కొట్టాడని..
[ 07-05-2024]
తెదేపా ఎన్నికల ప్రచారంలో తప్పెట కొట్టాడని ఓ దళితుడిని వైకాపా సర్పంచి మరిది చితకబాదాడు. -
తాగునీరు కలుషితం.. 25 మందికి అస్వస్థత
[ 07-05-2024]
గుంతకల్లు మండలంలోని నెలగొండ గ్రామానికి చెందిన 25 మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురై ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరారు. -
వైకాపా ప్రచారానికి వెళ్లలేదని మాజీ వాలంటీరుపై దాడి
[ 07-05-2024]
వైకాపా ప్రచారానికి వెళ్లలేదని పట్టణంలోని 19 వార్డు కౌన్సిలర్ భాగ్యమ్మ, ఆమె కుమారుడు మారుతి పరుష పదజాలంతో దుర్భాషలాడి దాడికి పాల్పడ్డారని మాజీ వాలంటీరు నళిని ఆరోపించారు. -
వైకాపా ఓటమి తథ్యం : పరిటాల సునీత
[ 07-05-2024]
రాప్తాడులో ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి ఓటమి కోసం వైకాపా నాయకులంతా ఎదురుచూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ఓటమి తప్పదని మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి : మందకృష్ణమాదిగ
[ 07-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు, దేశ ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సారథ్యంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటైంది. -
అసమర్థ ప్రభుత్వాన్ని సాగనంపండి: కేశవ్
[ 07-05-2024]
తాగు, సాగు నీరు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. -
సాగు, తాగునీరు అందిస్తాం: అమిలినేని
[ 07-05-2024]
కుందుర్పి బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణాజలాలు తీసుకొచ్చి రైతులకు సాగు నీరు, అన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తామని తెదేపా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. -
శింగనమలలో సుర్రుమన్న సూరీడు
[ 07-05-2024]
ఉమ్మడి అనంత జిల్లాలో సోమవారం శింగనమల మండలంలో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.