అనంత రైతులకు జగన్ నవమోసాలు
రైతు పక్షపాతి..బాంధవుడినంటూ గొప్పలు చెప్పుకొనే సీఎం జగన్...అనంత అన్నదాతలకు చేసిందేమీ లేదు. 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేపట్టి.. కనపడిన వారందరికీ ముద్దులు పెట్టిన జగన్.. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుప్పిస్తున్నారు.
ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన వైకాపా సర్కారు
ఈనాడు డిజిటల్, అనంతపురం: రైతు పక్షపాతి..బాంధవుడినంటూ గొప్పలు చెప్పుకొనే సీఎం జగన్...అనంత అన్నదాతలకు చేసిందేమీ లేదు. 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేపట్టి.. కనపడిన వారందరికీ ముద్దులు పెట్టిన జగన్.. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుప్పిస్తున్నారు. పాదయాత్ర, ఎన్నికల ప్రచారంలో ఊరికో హామీ ఇచ్చారు. ప్రధానంగా రైతులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకపోగా.. 99 శాతం హామీలు నెరవేర్చామంటూ పచ్చిగా అబద్ధాలు వల్లె వేస్తున్నారు. కొన్నింటిని అరకొరగా అమలు చేసి రైతులను నట్టేటా ముంచారు. భరోసా కింద ఏటా రూ.12,500 అని చెప్పి రూ.7,500 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. కరవు ప్రాంతమైన ఉమ్మడి అనంతపురం జిల్లా రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారు. అతివృష్టి, అనావృష్టితో కర్షకులు నష్టపోయినా కనీసం ఆదుకునే ప్రయత్నం చేయలేదు. మాట తప్పను.. మడమ తిప్పను అంటూనే ఇచ్చిన హామీలను పెన్నా నదిలో కలిపేశాడు జగన్. అసమర్థ, విధ్వంస పాలనకు ఓటుతో స్వస్తి పలికితేనే అనంత రైతులకు మంచి రోజులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆహారశుద్ధి కేంద్రాలు ఉత్తుత్తినే..
ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని 2019 ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారు. కళ్యాణదుర్గం, ఆత్మకూరు, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి, రామగిరి, కదిరి ముదిగుబ్బ, బత్తలపల్లి, తనకల్లు ప్రాంతాల్లో టమాటా సాగుచేస్తున్నారు. ప్రాసెసింగ్ యూనిట్ల చాలా అవసరం. తనకల్లు వద్ద రూ.3.86 కోట్లతో టమాటా కోల్డ్స్టోరేజ్ నిర్మాణానికి భూమి సేకరించి.. గాలికి వదిలేశారు.
ఎన్ని ఏర్పాటు చేశారు వడ్డీలేని రుణాలు ఎక్కడ?
రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని 2019 ఎన్నికల ముందు జగన్.. ప్రతి సభలో ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక రూ.లక్ష లోపు రుణం ఉన్నవారికి మాత్రమే సున్నావడ్డీ డబ్బులు జమ చేశారు. రెండు జిల్లాల్లో 9,88,395 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు. జిల్లా రైతులకు వైకాపా ప్రభుత్వం బకాయి పడింది. ఇంతలా అన్యాయం చేసి సున్నావడ్డీ గతంలో ఎవ్వరూ ఇవ్వలేదని జగన్ దుష్ప్రచారం చేయడం గమనార్హం.
ఆత్మహత్యలపై తప్పుడు లెక్కలు
రైతులు వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. బాధిత రైతు కుటుంబానికి రూ.7 లక్షలు పరిహారం అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. నిబంధనలు పేరు చెప్పి 25 శాతం మందికి కూడా సాయం చేయలేదు. కనీసం పెట్టుబడి దక్కక.. అప్పుల భారం తాళలేక ఉమ్మడి జిల్లాలో వందలాది రైతులు బలవన్మరణం చెందారు. ప్రభుత్వం 50 మందికి మించి పరిహారం ఇవ్వలేదు. వ్యక్తిగత కారణాలతో చనిపోయారంటూ నివేదికలు తయారుచేసి పరిహారం ఎగ్గొట్టారు.
నిరంతరాయంగా అందని విద్యుత్తు
వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్తు అందిస్తానని..అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా నిరంతరాయంగా ఇచ్చిన పాపాన పోలేదు. రెండేళ్ల నుంచి రాత్రీ పగలు ఇష్టారాజ్యంగా సరఫరా చేస్తున్నారు. ఈ వేసవిలో విపరీతమైన కోతలు విధించడంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ సర్వీసులు అందిస్తున్న ఫీడర్లు 823 ఉన్నాయి. ఏ ఒక్క ఫీడర్లోనూ పగటిపూట9 గంటలు ఇవ్వడం లేదు.
ప్రకృతి విపత్తుల సహాయనిధి ఎటుపోయె
పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రకృతి విపత్తుల సహాయనిధి ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అనంత జిల్లాలో 2021లో నివార్ తుపాను కారణంగా వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆ ఏడాదితోటు 2022లో అతివృష్టితో టమాటా, చీనీ, దానిమ్మ, అరటి, ఆముదం పంటలు దెబ్బతిని దిగుబడి చేతికందలేదు. వేరుసెనగలో పశుగ్రాసం కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయారు. జగనన్న ప్రభుత్వం 2022లో మాత్రమే కొన్ని పంటలకు పరిహారం చెల్లించింది.
కొందరికే ఉచిత బోర్లు
వైఎస్సార్ జలకళ పేరిట రైతులకు ఉచిత బోర్లు వేయిస్తామని ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కారు. బోర్ల కాంట్రాక్టును వైకాపా ప్రజాప్రతినిధులకు అప్పగించి అవినీతిమయం చేశారు. ఉమ్మడి జిల్లాలో 50 వేలకు పైగా దరఖాస్తు చేసుకోగా కేవలం 3,356 బోర్లు వేశారు.విద్యుత్తు కనెక్షన్ భారాన్ని రైతులపైనే వేశారు. ఆర్థిక భారంతో చాలామంది రైతులు దరఖాస్తు చేసుకోలేదు.
జాడ లేని గోదాములు
ప్రతి నియోజకవర్గంలో కోల్డ్స్టోరేజీ, గోదాములు నిర్మిస్తామని గత ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఒక్కటీ నిర్మించలేదు. ఉమ్మడి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో టమాటా, 1.20 లక్షల ఎకరాల్లో మిరప సాగుచేస్తున్నారు. కోల్డ్స్టోరేజీ లేక తక్కువ ధరలకు విక్రయిస్తూ నష్టాలు మూటకట్టుకుంటున్నారు. ఉరవకొండ, రాయదుర్గం, గుంతకల్లు ప్రాంతాల రైతులు కొందరు కర్ణాటకకు తీసుకెళ్లి పంటను నిల్వ చేసుకుంటున్నారు.
రూ.13 వేల కోట్ల బకాయి
పెట్టుబడి సాయం కింద ఏటా రూ.12,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్.. కేంద్రం సాయంతో కలిపి రూ.13,500 ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.7,500. ఒక్కో రైతుకు ఏటా రూ.5 వేలు ఎగ్గొట్టారు.ఇరుజిల్లాల్లో ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం రూ.13,900 కోట్ల బకాయి పడింది. ఏడాదిలో మొదటి విడత రూ.5,500, రెండో విడతలో రూ.2 వేలు ఇస్తూ జగన్ గొప్పలు చెప్పుకొంటున్నారు. ఇది ఏమాత్రం సరిపోవడం లేదని కర్షకులు వాపోతున్నారు.
ధరల స్థిరీకరణ నిధి ఏదీ?
రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని అనంత జిల్లా ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని వరి, వేరుసెనగ రైతులు తక్కువ ధరకు పంటను అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. తెదేపా హయాంలో వరి, వేరుసెనగ పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసేది. జగన్ అధికారంలోకి వచ్చాక వేరుసెనగ విత్తనాలు అరకొరగా అందించారు. ఐదేళ్లలో ఒక్క ఏడాది పప్పుశగనకు ధరల స్థిరీకరణ నిధి వినియోగించినట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఇచ్చేది: 6 నుంచి 7 గంటల్లోపే..
ఎన్ని విడతల్లో: మూడు
రైతు భరోసా లబ్ధిదారులు: 5.56 లక్షలు
ఐదేళ్లలో ఒక్కో రైతు నష్టపోయింది: రూ.25,000
అతివృష్టి వచ్చింది: 2021, 2022లో
నష్టపోయిన పెట్టుబడి: రూ.10 వేల కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మొదలైన వజ్రాల వేట
[ 19-05-2024]
వజ్రకరూరులో వజ్రాల వేట మొదలైంది. శుక్రవారం రాత్రి వర్షం కురవడంతో శనివారం ఉదయం పొలాలన్ని వజ్రాలు వెతికే వారితో నిండిపోయాయి. ఇక్కడ దొరికే చిన్న రాయి(వజ్రానికి)కి పెద్ద మొత్తంలో నగదు లభిస్తుంది. -
ఉదయాన్నే ‘కారు’ చీకట్లు
[ 19-05-2024]
ఆ ఇంట మరో 8 రోజుల్లో పెళ్లి సంబరం జరగాల్సి ఉంది. వేడుక పనులు చకచకా జరుగుతున్నాయి. వరుడు, వధువు ఇళ్లు ముస్తాబు చేసే పనిలో అందరూ నిమగ్నమయ్యారు. ఇంతలో అనుకోని విషాదం కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో విధి వెంటాడింది. -
జగనన్న పాపం.. రైతులకు శాపం
[ 19-05-2024]
ప్రభుత్వ ప్రచార పిచ్చి.. అధికారుల నిర్లక్ష్యంతో రీసర్వేలో జరిగిన పొరపాట్లు రైతులకు శాపంగా మారుతున్నాయి. కొత్త పాసుపుస్తకాల్లో తప్పుల కారణంగా పంట రుణాల నవీకరణకు రైతులు అవస్థలు పడుతున్నారు. -
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
[ 19-05-2024]
జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కోసం నిర్దేశిత ఏర్పాట్లు వేగంగా చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. శనివారం జేసీ కేతన్ గార్గ్తో కలిసి ఆయన అనంత జేఎన్టీయూ భవన సముదాయంలో ఏర్పాటు చేసే ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగు రూంలు, రిసెప్షన్ కేంద్రాలను నిశితంగా పరిశీలించారు. -
జిల్లా నూతన ఎస్పీగా గౌతమిశాలి
[ 19-05-2024]
అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా గౌతమి శాలి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతం పెద్దకన్నెళ్లి గ్రామానికి చెందినవారు. -
తెలంగాణ ఈఏపీసెట్లో అనంత ఆణిముత్యాలు
[ 19-05-2024]
ఉమ్మడి అనంత జిల్లా విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ఈఏపీసెట్లో మెరిశారు. కుశాల్కుమార్ ఆరో ర్యాంకు సాధించి సత్తా చాటగా, కదిరికి చెందిన దివ్యతేజ పదో ర్యాంకు సాధించారు. మరో ఇద్దరు విద్యార్థులు వందలోపే ర్యాంకులు దక్కించుకున్నారు. -
అర్జున్ తెందూల్కర్ వీర విహారం..
[ 19-05-2024]
-
సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణ అస్తవ్యస్తం
[ 19-05-2024]
భూగర్భ జలాలు అడుగంటిపోవడం, సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేయడంతో శ్రీసత్యసాయి జిల్లా ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. -
49 పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్
[ 19-05-2024]
జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన 49 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే సీబీఎస్సీఈ సిలబస్ అమలు చేయనున్నట్లు కడప విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకుడు రాఘవరెడ్డి పేర్కొన్నారు. -
జూనియర్ ఇంటర్లో మిగులు సీట్లకు ప్రత్యేక కౌన్సెలింగ్
[ 19-05-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి బాలబాలికలకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆ విద్యాలయాల జిల్లా సమన్వయకర్త ఎ.మురళీకృష్ణ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీపై వ్యతిరేక ప్రచారం.. జైలుపాలైన ఉపాధ్యాయుడు
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు