హత్యచేసి రైలు పట్టాలపై పడేశారు
మతాంతర వివాహం నేపథ్యంలో బాలిక బంధువులే తమ కుమారుడ్ని చంపేసి రైలు పట్టాలపై పడేశారని బాధిత తల్లిదండ్రులు మునస్వామి, పార్వతి ఆరోపించారు.
పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ధర్నా
ధర్నా చేస్తున్న మృతుని బంధువులు
పాకాల, న్యూస్టుడే: మతాంతర వివాహం నేపథ్యంలో బాలిక బంధువులే తమ కుమారుడ్ని చంపేసి రైలు పట్టాలపై పడేశారని బాధిత తల్లిదండ్రులు మునస్వామి, పార్వతి ఆరోపించారు. బుధవారం వారు, బంధువులతో కలిసి పాకాల పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. మండలంలోని ఇరంగారిపల్లి పంచాయతీ తలారిపల్లికి చింతకాయల మురళి(29)ని ఫకీరుపేటకు చెందిన పీలేరు కర్ణ, రఫీ, బంధువులు హత్యచేసి రైల్వే ట్రాక్పై పడేశారని సీఐ రాజగోపాల్కు ఫిర్యాదు చేశారు. ఫకీరుపేటకు చెందిన బాలికను మురళి మతాంతర వివాహం చేసుకున్నాడన్నారు. దీనిపై బాలిక తండ్రి చాన్బాషా ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని పిలిపించి బాలికను తల్లిదండ్రులకు అప్పగించారని వివరించారు. ఆ సమయంలో సెల్ఫోన్ను బాలిక బంధువులు తీసుకున్నారని, ఇదేమని అడిగితే ఫోన్ చూశాక తిరిగి ఇస్తామని చెప్పారని, దాని కోసం వెళ్లి శావమై వచ్చారని ఆరోపించారు. దీనిపై విచారించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుమల ప్రక్షాళనకు వేళాయె..!
[ 16-06-2024]
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పలు సమస్యలు తిష్ఠవేశాయి. దర్శనానికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుండగా గత ప్రభుత్వ హయాంలో సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత సంక్లిష్టంగా మారినట్లు ఆరోపణలున్నాయి. -
విలువల పుస్తకం.. బతుకు సంతకం
[ 16-06-2024]
బతుకు బండిని లాగే శ్రామికుడు అప్పుల తెడ్డులతో ఒడ్డుకు చేర్చే నావికుడు సుఖ సౌధాల అధిరోహణకు సోపానాలు నిర్మించిన కార్మికుడు కష్టాల చీకట్లలో సంతోషాల వెలుగులు పంచిన రేడు జీవన చెట్టును శాఖోపశాఖలుగా విస్తరింపజేసిన బాంధవుడు -
తోతాపురి మామిడి కాయల ధర పతనం
[ 16-06-2024]
మామిడిలో సింహభాగం వాణిజ్య పంట తోతాపురి మామిడికాయలు ధరలు మార్కెట్లో రోజురోజుకు పతనమవుతున్నాయి. -
నేడు తితిదే ఈవోగా శ్యామలరావు బాధ్యతల స్వీకారం
[ 16-06-2024]
తితిదే కార్యనిర్వహణాధికారిగా జె.శ్యామలరావు బాధ్యతలు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ముగిసిన తిరుపడి సిరి సంత
[ 16-06-2024]
మహతి ఆడిటోరియంలో మూడురోజుల పాటు జరిగిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు శనివారంతో ముగిశాయి. -
నెరవేరని ప్రభుత్వ ఆశయం
[ 16-06-2024]
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సాగు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతో నిర్మించిన హంద్రీనీవా కాలువలో నీరు పారలేదు. -
హామీలు అమలుతో ప్రజలకు చేరువ చేస్తాం
[ 16-06-2024]
దేశ చరిత్రలో మొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు పథకాలను అమలు చేస్తూ సంతకాలు చేయడం చరిత్రాత్మకమని చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలుగా గెలిచిన జగన్మోహన్, మురళీమోహన్ పేర్కొన్నారు. -
శతాధిక వృద్ధురాలి మృతి
[ 16-06-2024]
మండలంలోని వీరప్పల్లె పంచాయతీ మంగప్పల్లె గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు మృతి చెందింది.