logo

తెలుగు సంస్కృతి కాపాడుకుందాం

తెలుగుజాతి సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగువారిపై ఉందని ప్రముఖ రచయిత చంద్రశేఖర్‌ అన్నారు.

Published : 21 Mar 2023 04:10 IST

మాట్లాడుతున్న రచయిత చంద్రశేఖర్‌

చిత్తూరు (క్రీడలు): తెలుగుజాతి సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగువారిపై ఉందని ప్రముఖ రచయిత చంద్రశేఖర్‌ అన్నారు. హరివిల్లు లలిత కళావేదిక ఆధ్వర్యంలో శోభకృత్‌ ఉగాది నామ సంవత్సర వేడుకల్ని ముందస్తుగా సోమవారం చిత్తూరు రెవెన్యూ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఉగాది కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. పలువురికి ఉగాది పురస్కారాలు అందజేశారు. ఎస్పీడీసీఎల్‌ డీఈఈ పద్మనాభపిళ్లై, ప్రముఖులు పార్థసారథినాయుడు, బాలరాజు, హరినాయుడు, మునస్వామి, శ్యామల, నాగిరెడ్డి, మొగిలయ్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని