దోచుకునే ఎమ్మెల్యేలు కావాలా..?
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటకు చెందిన వైకాపా నేతలు రాష్ట్ర సాహితీ అకాడమీ డైరెక్టర్ దొడ్ల గౌరీ, పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్ల కరుణాకర్రెడ్డి, నరసింహమూర్తి, రేవంత్ తదితరులు చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు.
ప్రజాగళం బహిరంగ సభల్లో ధ్వజమెత్తిన తెదేపా అధినేత చంద్రబాబు
వెంకటేగౌడ వైరస్కు మందు అమరనాథరెడ్డి
నగరి నియోజకవర్గం అంతటా అరాచకం
పలమనేరులో ప్రసంగిస్తున్న చంద్రబాబు
ఎమ్మెల్యే చెవిరెడ్డి గ్రామస్థుల చేరిక
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటకు చెందిన వైకాపా నేతలు రాష్ట్ర సాహితీ అకాడమీ డైరెక్టర్ దొడ్ల గౌరీ, పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్ల కరుణాకర్రెడ్డి, నరసింహమూర్తి, రేవంత్ తదితరులు చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు.
‘పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ ప్రజలకు సేవ చేయకున్నా బాగా దండుకున్నారు. ఇసుక తవ్వి బెంగళూరు పంపారు. ఏ పని చేయాలన్నా 15శాతం కమీషన్లు తీసుకున్నారు. రూ.5 కోట్ల విలువ చేసే శివాలయం భూమి మాయం చేశారు. మసీదులూ కొట్టేసే ప్రబుద్ధుడు. విలువైన భూములు వైకాపా నేతలు కొట్టేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే మీ ఇల్లు కబ్జా చేసి విద్యుత్తు బిల్లు మీకే పంపిస్తారు.
పుత్తూరులో..
పలమనేరు, న్యూస్టుడే: పలమనేరు నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కావాలంటే అమరనాథరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వెంకటేగౌడ వైరస్కు మందు అమరనాథరెడ్డి అని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అమరనాథరెడ్డి కుటుంబం రాజీలేని పోరాటం చేసిందని.. అందుకే రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ పలమనేరులో రావాలని ఆకాంక్షించారు. పలమనేరులో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ‘అమరనాథరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే 33 ఎకరాల్లో మోడల్ మార్కెట్ పూర్తి చేస్తామన్నారు. ఏనుగుల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తెదేపా హయాంలో వి.కోటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళా ఉర్దూ కళాశాల మంజూరు చేస్తూ జీవోలు, నిధులు ఇచ్చినా వైకాపా ప్రభుత్వం పూర్తి చేయలేదని ఆక్షేపించారు. కౌండిన్య నదిపై చెక్డ్యామ్లు నిర్మిస్తే భూగర్భజలాలు పెరుగుతాయని 11 ఇవ్వగా.. వాటికి కూడా అధికార పార్టీ నేతలు అడ్డుపడ్డారన్నారు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఈనాడు-తిరుపతి: నగరి నియోజకవర్గం అంతటా అరాచకం చేస్తున్నారని మంత్రి రోజాను ఉద్దేశించి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. బుధవారం పుత్తూరులో ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా తన వద్ద రూ.40 లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపించిన బాధితురాలు భువనేశ్వరితో చంద్రబాబు మాట్లాడారు.
‘పవర్లూమ్స్ కార్మికులకు ఉచితంగా విద్యుత్తు ఇస్తామని ఇదే వేదిక నుంచి జగన్మోహన్రెడ్డి మాట ఇచ్చి నిలబెట్టుకోలేదు. మాట తప్పిన సీఎం తొమ్మిదిసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచారు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా. చేనేత కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తా. గతంలోనూ రాయితీ ఇచ్చి నేనే ఆదుకున్నా. నా మాట నిలబెట్టుకుంటా. చేనేత కార్మికులను ఆదుకుంటా’ అని వెల్లడించారు. పారిశ్రామికంగా వడమాలపేట అభివృద్ధికి 150 ఎకరాలు ఇచ్చామని తెలిపారు. నగరిలోని ప్రతి ఎకరాకు నీరు అందిస్తాం. నగరి, పుత్తూరుల్లోని వేసవి నీటి ట్యాంకులకు నీళ్లు రావడం లేదు. వీటిని పూర్తి చేస్తా’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం: దగ్గుమళ్ల
రాష్ట్రాభివృద్ధి కోసం తెదేపా అధినేత చంద్రబాబు పరిపాలనా అనుభవం అవసరమని తెదేపా-భాజపా-జనసేన ఉమ్మడి చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక పరిస్థితులు బాగోలేవన్నారు. అప్పులతో ఏపీ అభివృద్ధి వెనుకంజలో పయనిస్తోందని, రౌడీయిజం పెరగడంతో శాంతియుత పరిస్థితులు కనిపించడం లేదన్నారు. పలమనేరులో పట్టు పరిశ్రమ ఏర్పాటుకు కృషిచేస్తానని, కైగల్ నుంచి తాగునీటి సరఫరా కోసం చర్యలు చేపడతానని పేర్కొన్నారు.
పరిశ్రమలు తెస్తాం..
‘నిండ్ర నేటమ్స్ చక్కెర కర్మాగారం బకాయిలు చెల్లిస్తామని జగన్ మోసం చేశారు. వారికి న్యాయం చేసి చక్కెర కర్మాగారాన్ని ఎలా పునరుద్ధరించాలో పరిశీలిస్తాం. విజయపురం మండలంలో ఏపీఐఐసీ కోసం 1,500 ఎకరాలు భూమి ఇచ్చాం. ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ, ఉద్యోగం రాలేదు. చెన్నైకి 60 కి.మీ.ల దూరంలో పారిశ్రామికవాడ ఉంది. టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసి యువత చెన్నై పోకుండా ఇక్కడే ఉపాధి కల్పిస్తాం’ అని చంద్రబాబు భరోసా కల్పించారు.
‘నగరిలో ఒక జబర్దస్త్ ఎమ్మెల్యే ఉంది. నియోజకవర్గానికి ఏమీ చేయలేదు. మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇస్తామని భువనేశ్వరి అనే మహిళ వద్ద రూ.40 లక్షలు తీసుకున్న ఆమెకు మళ్లీ ఓట్లు వేస్తారా? నగరి, తిరుపతి ఎమ్మెల్యేలు పాదిరేడు అరణ్యాన్ని దోచుకున్నారు. ‘వేణుగోపాల్సాగర్ ఆగిపోయింది. హంద్రీ-నీవా నిలిచిపోయింది. దాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
[ 27-04-2024]
జగనన్న ఎడాపెడా బాదుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. -
ఆయన ‘చె’ప్పింది ‘వి’నాల్సిందే
[ 27-04-2024]
చంద్రగిరి దుర్గానికి చెందిన కీలక వైకాపా నేత దౌర్జన్యాలు, దోపిడీలకు అంతే లేదు. నుదుటిపై బొట్టుతో నవ్వుతూ గంగి గోవులా కనిపించే ఈ నేతను చూస్తే నియోజకవర్గ ప్రజలు వణికిపోయే పరిస్థితికి వచ్చారు. -
‘ఇసుఖ’శాంతులన్నీ వైకాపా మేతలకే
[ 27-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రకృతి సంపద సర్వనాశనమైంది. సామాన్యులు ఇళ్లు కట్టుకోవడానికి అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచడానికి బదులు ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు యథేచ్ఛగా దోచేశారు. -
అటవీశాఖ మంత్రి.. ‘పెద్ద’ మనసు లేని వైచిత్రి
[ 27-04-2024]
అడవుల్లో స్వేచ్ఛగా విహరించాల్సిన వన్యప్రాణులు దాహం.. ఆకలి బాధలు తట్టుకోలేక జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆహారం, నీటి అన్వేషణలో.. జనావాసాల వైపు వస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. -
జగన్ జమానా.. ఖర్మ నాయనా..!
[ 27-04-2024]
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు అప్పు అడిగితే వెతుక్కుని మరీవచ్చి ఇచ్చేవారు.. ఎందుకంటే ప్రతినెలా ఒకటో తేదీన జీతం వస్తుంది కాబట్టి.. ప్రతి నెలా తేదీ తప్పకుండా నగదు వాయిదా పద్ధతిలో చెల్లిస్తారనే నమ్మకంతో.. కానీ వైకాపా హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి తారుమారైంది.. -
నిజాలు చెబితే తాఖీదులు
[ 27-04-2024]
‘ఎప్పుడూ సత్యం పలుకవలెను, అబద్ధాలు చెప్పరాదు’ అంటూ విద్యార్థులకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజాలు అప్లోడ్ చేస్తే షోకాజ్ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. -
వైకాపాకే వంతపాడిన యంత్రాంగం
[ 27-04-2024]
నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఊదరగొడుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం వైకాపాకే వంత పాడుతున్నారు. -
‘వైకాపా పాలనలో అత్యాచారాల్లో ఏపీకి అగ్రస్థానం’
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే మహిళా సాధికారత సాధ్యమని ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. -
నిన్న అనుమతించలేదు.. నేడు తిరస్కరించారు..
[ 27-04-2024]
నామినేషన్ల చివరి రోజు గురువారం చిత్తూరు ఎంపీ అభ్యర్థినిగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీకి చెందిన భూలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. -
ఇసుకలో దోచేసి..మట్టితో దండుకుని
[ 27-04-2024]
వైకాపా నేతలకు ఇసుక, మట్టి ఆదాయ వనరులుగా మారాయి.. ఇసుక, చెరువులు, గుట్టల నుంచి మట్టిని దర్జాగా తరలించి జేబులు నింపుకొంటున్నారు.. -
‘తెదేపాను గెలిపించండి.. రాష్ట్రాన్ని రక్షించండి’
[ 27-04-2024]
తెదేపా కూటమిని గెలిపించి రాష్ట్రాన్ని రక్షించాలని తెదేపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ సతీమణి ప్రతిమ అన్నారు. -
ఎస్బీ కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోండి
[ 27-04-2024]
స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ)లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్ దాము.. చిత్తూరు వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ -
ముగిసిన పరిశీలన.. మిగిలింది ఉపసంహరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఆమోదం 177.. తిరస్కారం 50
[ 27-04-2024]
నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శుక్రవారం పూర్తయింది. -
తిరస్కరణ భయం.. బరిలో భార్యలు, వారసులు
[ 27-04-2024]
సార్వత్రిక సమరం 2024లో కీలకమైన నామపత్రాల స్వీకరణ పర్వం ముగిసింది. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
[ 27-04-2024]
చిత్తూరు పలమనేరు జాతీయ రహదారిలోని గుండ్లకట్టమంచి వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మహిళ మృతి చెందిందని ఏఎస్సై రామచంద్రారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు