నిజాలు చెబితే తాఖీదులు
‘ఎప్పుడూ సత్యం పలుకవలెను, అబద్ధాలు చెప్పరాదు’ అంటూ విద్యార్థులకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజాలు అప్లోడ్ చేస్తే షోకాజ్ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది.
26 మంది ఎంఈవోలు, 214 మంది హెచ్ఎంలకు నోటీసులు
ఉన్నతాధికారి తీరుపై సంఘాల ఆగ్రహం
డీఈవో దేవరాజుకు వినతి పత్రం అందజేస్తున్న ఫ్యాప్టో ప్రతినిధులు
చిత్తూరు విద్య, న్యూస్టుడే: ‘ఎప్పుడూ సత్యం పలుకవలెను, అబద్ధాలు చెప్పరాదు’ అంటూ విద్యార్థులకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజాలు అప్లోడ్ చేస్తే షోకాజ్ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ఐటీఐ సెల్లోని ఓ అధికారి వ్యవహార శైలిపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యూడైస్ అప్లోడ్లో జాతీయ స్థాయిలో రాష్ట్ర ర్యాంకు దిగజారిపోవడంతో సంబంధిత ఉన్నతాధికారుల కడుపుమంటకు క్షేత్రస్థాయిలో ఎంఈవోలు, హెచ్ఎంలను బలి చేస్తున్నారు. చివరికి ఉపాధ్యాయులతో అబద్ధాలు చెప్పించాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లాలో ఉన్న 31 మంది ఎంఈవో-1, 2లలో.. 26 మంది ఎంఈవోలు-2, 214మంది హెచ్ఎంలకు డీఈవో దేవరాజు షోకాజ్ నోటీసులు జారీ చేసి 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించడం కలకలం రేపింది.
ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోయినా అన్ని మౌలిక సౌకర్యాలు ఉన్నాయని ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ(యూడైస్)లో అప్లోడ్ చేయని ఉపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖ చర్యలకు ఉపక్రమించింది. మొదట షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ సమాధానాలపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పాఠశాలల్లో ఇంటర్నెట్, మరుగుదొడ్లు, కుళాయిలు తదితర సౌకర్యాలు లేవని యూడైస్లో నమోదు చేసినందుకే నోటీసు అందుకోవాల్సి వచ్చింది. అక్కడ లేకపోయినా ఉన్నట్లు ఎందుకు నమోదు చేయలేదని జిల్లా విద్యాశాఖ వివరణ కోరింది. ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో విద్యార్థుల ప్రవేశాలు పూర్తిచేశాక వారి సంఖ్య, సౌకర్యాల కల్పన తదితర వివరాలతో సంబంధిత హెచ్ఎం యూడైస్లో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ డిసెంబరులోనే పూర్తయినా వాటిని పరిశీలించి లోపాలు చెప్పని విద్యాశాఖ.. తాజాగా నోటీసులు జారీ చేయడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. యూడైస్లో క్రిటికల్ ఇండికేటర్స్ తప్పుగా నమోదు చేసినందుకు ఎంఈవో-2లు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల హెచ్ంఎలకు తాఖీదులు జారీ చేశారు. నిజాలు దాచిపెట్టి అబద్ధాల వివరాలు అప్లోడ్ చేయని వారిపై చర్యలు తీసుకోండి లేకుంటే.. జిల్లా అధికారులపై చర్యలు తప్పవని ఐటీసెల్లోని రాష్ట్ర అధికారి పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే తమకు ప్రయోజనాలు ఇవ్వడం లేదని ఉపాధ్యాయులు పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల వేళ వారిని తమవైపు తిప్పుకొనేందుకే ఇలా నోటీసుల జారీ ఎత్తుగడ అని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
వారిని బాధ్యులను చేస్తారా..?
ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలపై ఉన్నది ఉన్నట్లు యూడైస్లో నమోదుచేసిన ఎంఈవోలు, హెచ్ఎంలను ఎలా బాధ్యులు చేస్తారని ఉపాధ్యాయ సంఘ నాయకులు మండిపడుతున్నాయి. శుక్రవారం డీఈవో దేవరాజుకు ఎస్టీయూ, ఎంఈవో-2ల, ఫ్యాప్టో సంఘం నాయకులు వినతి పత్రాలు అందజేశారు. బేషరతుగా జారీ చేసిన షోకాజ్ నోటీసులు ఉపసంహరించుకోకుంటే ఆందోళనకు సిద్ధమవుతామని నాయకులు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెంచిన మద్యం ధరల్లో జగన్, పెద్దిరెడ్డి వాటా ఎంత?: చంద్రబాబు
[ 07-05-2024]
పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూ స్థాపితం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. -
సైకిల్పై ప్రచారం చేస్తున్న కార్యకర్తపై వైకాపా మూకదాడి
[ 07-05-2024]
కుప్పం మండలం కొట్టాలూరు పంచాయతీ సిద్ధప్పనూరు గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త స్వామినాథన్పై సోమవారం సాయంత్రం వైకాపా మూకలు దాడికి పాల్పడ్డాయి. -
ఓటమిని జగన్ ముందే ఒప్పుకొన్నారు
[ 07-05-2024]
అంతర్జాతీయ స్థాయిలో అవినీతిలో పురస్కారాలు ఇవ్వదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఆయన మంత్రివర్గానికి ఇవ్వాలని సినీనటుడు, జనసేన నాయకుడు పృథ్వీరాజ్ ఎద్దేవా చేశారు. -
బాబు భరోసా.. జగన్ రుసురుస
[ 07-05-2024]
ప్రభుత్వాన్ని అనుసరించి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుంటారు. జిల్లా పరిధిలో పరిశీలిస్తే చంద్రబాబు హయాంలో భారీ పరిశ్రమలు క్యూ కట్టగా.. జగన్ ప్రభుత్వం కొత్తగా భారీ పరిశ్రమలు తెచ్చింది ఏమీ లేదు. -
నా అంటూ వల్లించి.. వంచించి
[ 07-05-2024]
నా ఎస్సీలు, నా ఎస్టీలని సీఎం జగన్ బహిరంగ సభల్లో గొప్పగా ఊదరగొడుతుంటారు. అయితే అదంతా ధృతరాష్ట్ర ప్రేమ అని ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు చేసిన ఘనకార్యాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. -
ఏది కుట్ర.. ఎవరిది అరాచకం
[ 07-05-2024]
ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై ఎన్టీఆర్ మొదలు ఎందరో నేతలు తమదైన అభివృద్ధి ముద్ర వేశారు. -
మురిపించి.. విస్మరించి..
[ 07-05-2024]
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనే బండికి వ్యవసాయం, పాడి.. జోడుచక్రాలు. ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో వ్యవసాయ రంగం కుదేలైంది. -
అసంపూర్తి భవనాలే.. అభివృద్ధి కలే
[ 07-05-2024]
ప్రతి పంచాయతీలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టి మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అవి అందుబాటులోకి రాలేదు. -
ఇదేం జగన్.. ఇలా చేశావ్
[ 07-05-2024]
చేతికందినా.. నోటికందలేదన్న సామెత పింఛన్ల లబ్ధిదారులకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. -
‘రాక్షస పాలనకు అంతం పలకండి’
[ 07-05-2024]
మంచి చేసేవారికి ఓటేసి అరాచక పాలనకు అంతం పలకాలని తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. -
నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాక
[ 07-05-2024]
తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు తిరుపతి నగరంలో పర్యటించనున్నారు. -
కుప్పంలో నేడు, రేపు.. నారా భువనేశ్వరి పర్యటన
[ 07-05-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి మంగళ, బుధవారాల్లో కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. -
మా పేర్లెక్కడ సారూ..!
[ 07-05-2024]
ఎన్నికల విధుల్లోని సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగ ప్రక్రియ రెండో రోజైన సోమవారమూ కొనసాగింది. -
వైకాపాకు నిబంధనలు వర్తించవా..
[ 07-05-2024]
కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేకుండా గుడుపల్లె వైకాపా ఎంపీపీ వరలక్ష్మి వెళ్లారు. -
ముస్లింలకు ప్రత్యేక వ్యాక్సినేషన్
[ 07-05-2024]
హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ అందిస్తున్నామని.. ఈ యాత్రకు వెళ్లే ప్రతిఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని డీఎంహెచ్వో ప్రభావతిదేవి తెలిపారు. -
సీఈసీ స్పందన హర్షణీయం
[ 07-05-2024]
అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడం హర్షణీయమని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు రామచంద్రయాదవ్ ఓ ప్రకటనలో సోమవారం పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి