logo

ఆమోదం 177.. తిరస్కారం 50

నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శుక్రవారం పూర్తయింది.

Published : 27 Apr 2024 02:23 IST

నామినేషన్ల పరిశీలన పూర్తి

తిరుపతి (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శుక్రవారం పూర్తయింది. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ముందుగా సమావేశం నిర్వహించి పరిశీలన ప్రక్రియకు సంబంధించిన అంశాలను ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఒక ఎంపీ, ఏడు శాసనసభ స్థానాలకు 227 దాఖలైనట్లు వెల్లడించారు. వాటిలో తిరుపతి లోక్‌సభ స్థానానికి 27 దాఖలు చేయగా... అందులో మూడింటిని తిరస్కరించినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. జిల్లాలోని ఏడు శాసనసభ స్థానాలకు 200 దాఖలు చేయగా వాటిలో 153 ఆమోదించి 47 తిరస్కరించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని