ఎస్బీ కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోండి
స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ)లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్ దాము.. చిత్తూరు వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి చిత్తూరు తెదేపా అభ్యర్థి ఫిర్యాదు
ఈనాడు, చిత్తూరు: స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ)లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్ దాము.. చిత్తూరు వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేష్కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ఎస్ఆర్పురం మండలం కొత్తపల్లిమిట్టకు చెందిన వీరిద్దరూ ఐదేళ్లుగా ఎస్బీలో పనిచేస్తున్నారని అందులో పేర్కొన్నారు. హెడ్ కానిస్టేబుల్ కన్నా పైస్థాయి అధికారులనే స్పెషల్ బ్రాంచ్లో నియమించాల్సి ఉండగా.. నిబంధనలకు విరుద్ధంగా కానిస్టేబుళ్లను నియమించారన్నారు. రామకృష్ణ, దాము తన ఫోన్తోపాటు పార్టీ శ్రేణుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని గురజాల అందులో వివరించారు. ఇళ్లలో తనిఖీలు చేసి భయపెడుతున్నారని తెలిపారు. తన కదలికలను విజయానందరెడ్డికి తెలియజేస్తున్నందున వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైకిల్పై ప్రచారం చేస్తున్న కార్యకర్తపై వైకాపా మూకదాడి
[ 07-05-2024]
కుప్పం మండలం కొట్టాలూరు పంచాయతీ సిద్ధప్పనూరు గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త స్వామినాథన్పై సోమవారం సాయంత్రం వైకాపా మూకలు దాడికి పాల్పడ్డాయి. -
ఓటమిని జగన్ ముందే ఒప్పుకొన్నారు
[ 07-05-2024]
అంతర్జాతీయ స్థాయిలో అవినీతిలో పురస్కారాలు ఇవ్వదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఆయన మంత్రివర్గానికి ఇవ్వాలని సినీనటుడు, జనసేన నాయకుడు పృథ్వీరాజ్ ఎద్దేవా చేశారు. -
బాబు భరోసా.. జగన్ రుసురుస
[ 07-05-2024]
ప్రభుత్వాన్ని అనుసరించి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుంటారు. జిల్లా పరిధిలో పరిశీలిస్తే చంద్రబాబు హయాంలో భారీ పరిశ్రమలు క్యూ కట్టగా.. జగన్ ప్రభుత్వం కొత్తగా భారీ పరిశ్రమలు తెచ్చింది ఏమీ లేదు. -
నా అంటూ వల్లించి.. వంచించి
[ 07-05-2024]
నా ఎస్సీలు, నా ఎస్టీలని సీఎం జగన్ బహిరంగ సభల్లో గొప్పగా ఊదరగొడుతుంటారు. అయితే అదంతా ధృతరాష్ట్ర ప్రేమ అని ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు చేసిన ఘనకార్యాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. -
ఏది కుట్ర.. ఎవరిది అరాచకం
[ 07-05-2024]
ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై ఎన్టీఆర్ మొదలు ఎందరో నేతలు తమదైన అభివృద్ధి ముద్ర వేశారు. -
మురిపించి.. విస్మరించి..
[ 07-05-2024]
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనే బండికి వ్యవసాయం, పాడి.. జోడుచక్రాలు. ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో వ్యవసాయ రంగం కుదేలైంది. -
అసంపూర్తి భవనాలే.. అభివృద్ధి కలే
[ 07-05-2024]
ప్రతి పంచాయతీలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టి మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అవి అందుబాటులోకి రాలేదు. -
ఇదేం జగన్.. ఇలా చేశావ్
[ 07-05-2024]
చేతికందినా.. నోటికందలేదన్న సామెత పింఛన్ల లబ్ధిదారులకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. -
‘రాక్షస పాలనకు అంతం పలకండి’
[ 07-05-2024]
మంచి చేసేవారికి ఓటేసి అరాచక పాలనకు అంతం పలకాలని తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. -
నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాక
[ 07-05-2024]
తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు తిరుపతి నగరంలో పర్యటించనున్నారు. -
కుప్పంలో నేడు, రేపు.. నారా భువనేశ్వరి పర్యటన
[ 07-05-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి మంగళ, బుధవారాల్లో కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. -
మా పేర్లెక్కడ సారూ..!
[ 07-05-2024]
ఎన్నికల విధుల్లోని సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగ ప్రక్రియ రెండో రోజైన సోమవారమూ కొనసాగింది. -
వైకాపాకు నిబంధనలు వర్తించవా..
[ 07-05-2024]
కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేకుండా గుడుపల్లె వైకాపా ఎంపీపీ వరలక్ష్మి వెళ్లారు. -
ముస్లింలకు ప్రత్యేక వ్యాక్సినేషన్
[ 07-05-2024]
హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ అందిస్తున్నామని.. ఈ యాత్రకు వెళ్లే ప్రతిఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని డీఎంహెచ్వో ప్రభావతిదేవి తెలిపారు. -
సీఈసీ స్పందన హర్షణీయం
[ 07-05-2024]
అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడం హర్షణీయమని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు రామచంద్రయాదవ్ ఓ ప్రకటనలో సోమవారం పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
-
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
-
మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్.. టాప్లో ఫోన్పే, గూగుల్పే
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి