logo

సైకిల్‌పై ప్రచారం చేస్తున్న కార్యకర్తపై వైకాపా మూకదాడి

కుప్పం మండలం కొట్టాలూరు పంచాయతీ సిద్ధప్పనూరు గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త స్వామినాథన్‌పై సోమవారం సాయంత్రం వైకాపా మూకలు దాడికి పాల్పడ్డాయి.

Published : 07 May 2024 08:11 IST

తెదేపా కార్యకర్త స్వామినాథన్‌

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: కుప్పం మండలం కొట్టాలూరు పంచాయతీ సిద్ధప్పనూరు గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త స్వామినాథన్‌పై సోమవారం సాయంత్రం వైకాపా మూకలు దాడికి పాల్పడ్డాయి. బాధితుడి కథనం మేరకు.. స్వామినాథన్‌ సైకిల్‌పై చిన్న మైకు పెట్టుకుని గ్రామాల్లో తెదేపాకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం మేస్త్రినాయనూరు గ్రామానికి వెళ్తుండగా కొటాలూరు పంచాయతీకి చెందిన వైకాపా నాయకులు నాగరాజు, పన్నీర్‌, సంపత్‌, కేశవులు అడ్డగించి మైకు, అందులోని చిప్‌, చరవాణి లాక్కున్నారు. దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డట్లు బాధితుడు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని