ఈ ఏడాదీ అత్తెసరు వసతులేనా..!
గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు ఆయా గ్రామాల్లో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్గా మార్పు చేసి అక్కడే ఇంటర్మీడియట్ విద్యను అందించేందుకు చర్యలు చేపట్టామని గొప్పలు చెప్పిన వైకాపా సర్కార్ వాటిలో కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది.
హైస్కూల్ ప్లస్లో ఫలితాలు మైనస్
అల్లవరం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నత్తనడకన సాగుతున్న జూనియర్ కళాశాల తరగతి గదుల నిర్మాణం
అమలాపురం కలెక్టరేట్, న్యూస్టుడే: గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు ఆయా గ్రామాల్లో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్గా మార్పు చేసి అక్కడే ఇంటర్మీడియట్ విద్యను అందించేందుకు చర్యలు చేపట్టామని గొప్పలు చెప్పిన వైకాపా సర్కార్ వాటిలో కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది. దీంతో ఈ పాఠశాలల్లో ఇంటర్మీడియట్లో చేరిన విద్యార్థినుల భవిష్యత్తు ప్రశ్నాô్థÛకంగా మారిందని తల్లిదండ్రులు వాపోతున్నారు
డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 21 మండలాల పరిధిలో జడ్పీ ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్గా మార్పు చేశారు. వీటిలో రెండేళ్ల క్రితం బాలికల జూనియర్ కళాశాలలను ప్రారంభించారు. ప్రారంభంలో ఎంపీసీ, బైపీసీ కోర్సులు ప్రారంభించి, వీటి నిర్వహణను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. దీంతో వారు విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చి కళాశాలల్లో ప్రవేశాలు కల్పించారు. కాని వారికి కావాల్సిన వసతులు కల్పించలేదు.
సౌకర్యాలు శూన్యం
హైస్కూల్ ప్లస్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ప్రయోగాల్లో సాధన చేసేందుకు ల్యాబ్లు ఏర్పాటు చేయలేదు. సమీపంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో సాధన చేయించారు. ప్రయోగ పరీక్షలను సుదూర ప్రాంతాల్లో ఉన్న ఇతర కళాశాలల్లో నిర్వహించారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. బోధనకు సరిపడా నిపుణులైన అధ్యాపకులు లేకపోవడం, అందుబాటులో ఉన్న పీజీటీ ఉపాధ్యాయులతోనే హైస్కూల్ ప్లస్లో విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు. ఇవన్నీ వీరి ఉత్తీర్ణతపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఈ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం చతికలపడింది.
ఉన్నవాటిని పట్టించుకోలేదు.. మళ్లీ కొత్తవి
జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 21 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్గా చేసి బాలికల జూనియర్ కళాశాలలుగా మార్పు చేశారు. వీటిలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించలేక పోయారు. ఇవి చాలవన్నట్లు కో-ఎడ్యుకేషన్ అందించేందుకు మరో 10 కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కనీసం ఈ విద్యా సంవత్సరం అయినా పూర్తి స్థాయి వసతులు కల్పిస్తారని ఆశగా ఎదురు చూసిన విద్యార్థుల తల్లిదండ్రులకు వైకాపా సర్కార్ మళ్లీ మొండి చేయే చూపనుంది. ఇప్పటి వరకు బాలికల కళాశాలల్లో వస్తున్న ఘోరమైన ఫలితాలను చూసి ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటి కైనా ప్రభుత్వం హైస్కూల్ ప్లస్లో పూర్తి స్థాయి వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు.
లోపిస్తున్న ప్రణాళిక
హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో ఇంటర్లో ప్రవేశాలు పొందిన బాలికల విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పరీక్షల వరకు గందరగోళ పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఇంటర్ బోర్డు పరిధిలో ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలకు జూన్ 1వ తేదీ నుంచి అకడమిక్ క్యాలెండర్ ప్రారంభం అవుతుంది. ఈలోపే ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టి తరగతులు ప్రారంభిస్తారు. త్రైమాసిక పరీక్షలు, దసరా సెలవులు, అర్ద సంవత్సర పరీక్షలు, సంక్రాతి సెలవులు, ప్రీ ఫైనల్స్, ప్రాక్టికల్స్, పబ్లిక్ పరీక్షల అనంతరం మార్చి 31తో విద్యా సంవత్సరం ముగుస్తుంది.ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి. కాని హైస్కూల్ ప్లస్లో ఉన్న బాలికల జూనియర్ కళాశాలల్లో అకడమిక్ క్యాలెండర్ అమలు కాని పరిస్థితి నెలకొంది. తరగతులు ప్రారంభం నుంచి దసరా సంక్రాంతి సెలవుల్లో వ్యత్యాసం ఉంటోంది. జూన్1 తర్వాత ప్రవేశాలు చేపట్టి ఆలస్యంగా తరగతులు ప్రారంభిస్తున్నారు. విద్యా సంవత్సరంలో పాఠశాలలకు సెలవులు ఉన్న అన్ని రోజులు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా అమలు చేస్తున్నారు.దీంతో పాఠ్యాంశాలు సకాలంలో పూర్తి కావడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటనకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
[ 16-06-2024]
సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి అధికారులను ఆదేశించారు. -
కూటమి ప్రభుత్వ సహకారంతో ఎతిపోతల అభివృద్ధి
[ 16-06-2024]
పార్టీలకు అతీతంగా రైతులంతా ఎత్తిపోతల అభివృద్ధికి కృషి చేయాలని చాగల్లు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అల్లూరి విక్రమాదిత్య తెలిపారు. -
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
[ 16-06-2024]
అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు దర్శించుకున్నారు. -
మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఫాదర్స్ డే వేడుకలు
[ 16-06-2024]
రోటరీ క్లబ్ నిడవోలు అధ్యక్షుడు కీర్తి ఆంజనేయులు ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఫాదర్స్డే వేడుకలు నిర్వహించారు. -
శ్రీకోట సత్తెమ్మ అమ్మవారిని దర్శించుకున్న జిల్లా సూపరింటెండెంట్
[ 16-06-2024]
మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంంలో కొలువై ఉన్న శ్రీకోటసత్తెమ్మ అమ్మవారిని తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ పి.జగదీశ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. -
నాన్నంటే నాన్నే
[ 16-06-2024]
నాన్నంటే ఇష్టంగా మోసే బాధ్యత.. వెన్నంటి నడిచే ధైర్యం.. ఊహకందని త్యాగం.. నడత నేర్పే గురువు.. తన జీవితాన్నే మనకోసం ధారబోసే మహోన్నతుడు. -
మానసిక సంఘర్షణ.. మృత్యుమార్గాన..
[ 16-06-2024]
ఆ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నత చదువులు చదివారు. మహానగరాల్లో ఉద్యోగాలు చేశారు. పదేళ్ల క్రితం తండ్రి చనిపోవడం.. తల్లి అనారోగ్యం బారిన పడటంతో ఇంటికొచ్చేశారు. -
అమ్మా.. నన్ను క్షమించు
[ 16-06-2024]
‘అమ్మా.. నన్ను క్షమించు. నా స్నేహితుడు శ్రీను.. వాళ్ల మావయ్య మోసం చేశాడు. రూ.35 లక్షలు ఇవ్వాలి. -
కొమ్మనాపల్లిలో అదుపులోకి రాని అతిసారం
[ 16-06-2024]
కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో ప్రబలిన (అతిసారం) మూడోరోజుకూ పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. గ్రామంలోని మరో 28 మంది శనివారం కూడా అస్వస్థత బారిన పడ్డారు. -
వెంకన్న వేడుక చూద్దాం రండి
[ 16-06-2024]
పవిత్ర వైనతేయ నదీ తీరంలో కొలువైన అప్పనపల్లి బాలబాలాజీస్వామివారి ఆలయం ఉత్సవ శోభను సంతరించుకుంది. -
అన్నదాత ఆత్మ సంకల్పానికి దెబ్బ
[ 16-06-2024]
పుడమి తల్లిని నమ్ముకుని ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అడుగడుగునా సమస్యలే. విత్తు వేసింది మొదలు.. దిగుబడి వచ్చే వరకు, ఆ తర్వాత కూడా అనేక సవాళ్లు. -
అక్కడ కూలినా.. ఇక్కడ వేళ్లూనేలా..
[ 16-06-2024]
దశాబ్దాల క్రితం నాటి ఓ రావిచెట్టు కాకినాడ బాలాత్రిపుర సుందరి దేవాలయం రహదారిలో గురువారం కూలిపోయిన విషయం తెలిసిందే. -
పూలబాట పరిచిన పాదాలకు పుష్పాభిషేకం
[ 16-06-2024]
కాకినాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో శనివారం ఫాదర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ తండ్రులపై చిన్నారులు పూలు చల్లి ఆశీర్వచనం తీసుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అల్లర్ల గురించి పిల్లలకు బోధించడం ఎందుకు?: ఎన్సీఈఆర్టీ చీఫ్
-
స్మృతి మంధాన సెంచరీ.. దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన భారత్
-
ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనపై తొలి ట్రయల్ రన్.. వీడియో
-
పేటీఎం - జొమాటో రూ.1,500 కోట్ల డీల్?
-
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
-
కొత్తదనం, ప్రయోగాలకు రామోజీరావు చిరునామా.. బెంగళూరులో జర్నలిస్టుల ఘన నివాళి