బహిరంగ మార్కెట్కు తరలిన ధాన్యం
జిల్లాలో రబీ సీజన్లో పండిన ధాన్యం బహిరంగ మార్కెట్కు తరలిపోయింది. ఎన్నికల వేళ కావడంతో పౌరసరఫరాల సంస్థకు ధాన్యాన్ని విక్రయిస్తే.. డబ్బులు త్వరగా వస్తాయో.. రావోనని.. భావించిన రైతులు పండిన ధాన్యాన్ని మిల్లర్లు, మధ్యవర్తులకు అమ్మేశారు.
పౌరసరఫరాల సంస్థ కొన్నది 25,842 టన్నులే
మే 31తో మూతపడనున్న కొనుగోలు కేంద్రాలు
న్యూస్టుడే, కాకినాడ కలెక్టరేట్
ధాన్యాన్ని కళ్లం నుంచి సేకరిస్తున్న సిబ్బంది
జిల్లాలో రబీ సీజన్లో పండిన ధాన్యం బహిరంగ మార్కెట్కు తరలిపోయింది. ఎన్నికల వేళ కావడంతో పౌరసరఫరాల సంస్థకు ధాన్యాన్ని విక్రయిస్తే.. డబ్బులు త్వరగా వస్తాయో.. రావోనని.. భావించిన రైతులు పండిన ధాన్యాన్ని మిల్లర్లు, మధ్యవర్తులకు అమ్మేశారు. బహిరంగ మార్కెట్లో ధర ఆశాజనకంగా ఉండటం, సేకరించిన వెంటనే సొమ్ము చెల్లిస్తుండటంతో ప్రైవేటు వ్యక్తులకే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు విక్రయిస్తే.. రవాణా, గోనె సంచుల కొరత, తేమ శాతం వంటి కొర్రీలతో ఇబ్బంది పడలేక రైతులు బహిరంగ మార్కెట్ వైపు మొగ్గు చూపారు. రబీలో 75 శాతానికి పైగా సాధారణ రకం వరి విత్తనాలు సాగు చేశారు. దీనిలో బొండాలు రకం ఎక్కువ విస్తీర్ణంలో పండించారు.
ప్రభుత్వం కొన్నది చాలా తక్కువ..
కాకినాడ జిల్లాలో ఏప్రిల్ 6 నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 214 ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో రబీలో 5 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దీనిలో 1.92 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా చేసుకున్నారు. బుధవారం నాటికి 14 మండలాల పరిధిలో 79 కేంద్రాల ద్వారా 25,843 టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. దీంతో కేంద్రాలన్నీ ఖాళీగా దర్శమిస్తున్నాయి.
అరకొర చెల్లింపులు..
జిల్లాలో ఇప్పటికి 3,068 మంది రైతుల నుంచి రూ.56.44 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు ద్వారా సేకరించారు. ఇప్పటికి రూ.17.25 కోట్లు మాత్రమే రైతులకు చెల్లించారు. చాలాచోట్ల ధాన్యం సేకరించి 21 రోజులు గడిచినా ఇప్పటికీ రైతుల ఖాతాలకు సొమ్ము జమ కాలేదు. గత ఖరీఫ్లో ధాన్యం సేకరించిన నాలుగు, అయిదు రోజుల వ్యవధిలోనే చెల్లింపులు చేశారు. రబీలో మాత్రం చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. వచ్చేనెల 1 నుంచి ఖరీఫ్నకు సన్నద్ధం కావాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీ, బీమా, పంట నష్టపరిహారం వంటి సాయం విడుదలలో తీవ్ర జాప్యం చేసింది. ఇప్పుడు రబీ ధాన్యాన్ని సేకరించినా, సొమ్ము చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
అక్కడి మార్కెట్పైనే ఆసక్తి..
సాధారణ రకం ధాన్యం 75 కేజీల బస్తాకు ప్రభుత్వం రూ.1,637 చొప్పన చెల్లిస్తోంది. బహిరంగ మార్కెట్లో 75 కేజీల బస్తా రూ.1,650 పలకడంతో, వారికే విక్రయించడానికి మొగ్గు చూపారు. బొండాలు రకం ధాన్యం ప్రస్తుతం మంచి డిమాండ్ ఉండటంతో మిల్లర్లు, మధ్యవర్తులు వీటిని పెద్ద ఎత్తున సేకరిస్తున్నారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు ఆగిపోయినా, నూకలు రవాణా చేస్తున్నారు. దీంతో బొండాలు రకం ధాన్యాన్ని మరపట్టించి, నూకలు తయారు చేస్తూ ఎగుమతి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బొండాలు రకం ధాన్యానికి మంచి డిమాండ్ ఉంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు బొండాలు రకం ధాన్యాం ద్వారా ఉత్పత్తి అయ్యే బాయిల్డ్ రైస్ను ఎగుమతి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో రబీలో పండిన ధాన్యానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు కన్నా, బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర ఉండటంతో రైతులు వీరికి ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. గొల్లప్రోలు, గండేపల్లి, జగ్గంపేట, ప్రత్తిపాడు, శంఖవరం, తొండంగి మండలల్లో సన్న రకాలు రబీలో ఎక్కువగా సాగు చేశారు. వీటికీ మార్కెట్లో మంచి ధర రావడంతో రైతులు బహిరంగ మార్కెట్లో ధాన్యాన్ని విక్రయిస్తున్నారు.
నెలాఖరు వరకు కొనుగోళ్లు
-ఎం. బాలసరస్వతి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, కాకినాడ
జిల్లాలో ఈనెలాఖరు వరకు కొనుగోలు కేంద్రాలు ద్వారా ధాన్యాన్ని సేకరిస్తాం. ప్రతి గింజా కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా ధాన్యం నిల్వలు ఉంటే సంప్రదించాలి. జిల్లా పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో 886903111 ఫోను నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. బహిరంగ మార్కెట్లో మంచి ధర ఉండటంతో రైతులు అక్కడ ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. కనీస మద్ధతు ధర కన్నా ఎక్కువకు కొంటున్నారు. రైతులకు కనీస మద్ధతు ధర కల్పనకే కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నాం. సేకరించిన ధాన్యానికి వీలైనంత త్వరగా సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటనకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
[ 16-06-2024]
సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి అధికారులను ఆదేశించారు. -
కూటమి ప్రభుత్వ సహకారంతో ఎతిపోతల అభివృద్ధి
[ 16-06-2024]
పార్టీలకు అతీతంగా రైతులంతా ఎత్తిపోతల అభివృద్ధికి కృషి చేయాలని చాగల్లు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అల్లూరి విక్రమాదిత్య తెలిపారు. -
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
[ 16-06-2024]
అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు దర్శించుకున్నారు. -
మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఫాదర్స్ డే వేడుకలు
[ 16-06-2024]
రోటరీ క్లబ్ నిడవోలు అధ్యక్షుడు కీర్తి ఆంజనేయులు ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఫాదర్స్డే వేడుకలు నిర్వహించారు. -
శ్రీకోట సత్తెమ్మ అమ్మవారిని దర్శించుకున్న జిల్లా సూపరింటెండెంట్
[ 16-06-2024]
మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంంలో కొలువై ఉన్న శ్రీకోటసత్తెమ్మ అమ్మవారిని తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ పి.జగదీశ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. -
నాన్నంటే నాన్నే
[ 16-06-2024]
నాన్నంటే ఇష్టంగా మోసే బాధ్యత.. వెన్నంటి నడిచే ధైర్యం.. ఊహకందని త్యాగం.. నడత నేర్పే గురువు.. తన జీవితాన్నే మనకోసం ధారబోసే మహోన్నతుడు. -
మానసిక సంఘర్షణ.. మృత్యుమార్గాన..
[ 16-06-2024]
ఆ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నత చదువులు చదివారు. మహానగరాల్లో ఉద్యోగాలు చేశారు. పదేళ్ల క్రితం తండ్రి చనిపోవడం.. తల్లి అనారోగ్యం బారిన పడటంతో ఇంటికొచ్చేశారు. -
అమ్మా.. నన్ను క్షమించు
[ 16-06-2024]
‘అమ్మా.. నన్ను క్షమించు. నా స్నేహితుడు శ్రీను.. వాళ్ల మావయ్య మోసం చేశాడు. రూ.35 లక్షలు ఇవ్వాలి. -
కొమ్మనాపల్లిలో అదుపులోకి రాని అతిసారం
[ 16-06-2024]
కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో ప్రబలిన (అతిసారం) మూడోరోజుకూ పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. గ్రామంలోని మరో 28 మంది శనివారం కూడా అస్వస్థత బారిన పడ్డారు. -
వెంకన్న వేడుక చూద్దాం రండి
[ 16-06-2024]
పవిత్ర వైనతేయ నదీ తీరంలో కొలువైన అప్పనపల్లి బాలబాలాజీస్వామివారి ఆలయం ఉత్సవ శోభను సంతరించుకుంది. -
అన్నదాత ఆత్మ సంకల్పానికి దెబ్బ
[ 16-06-2024]
పుడమి తల్లిని నమ్ముకుని ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అడుగడుగునా సమస్యలే. విత్తు వేసింది మొదలు.. దిగుబడి వచ్చే వరకు, ఆ తర్వాత కూడా అనేక సవాళ్లు. -
అక్కడ కూలినా.. ఇక్కడ వేళ్లూనేలా..
[ 16-06-2024]
దశాబ్దాల క్రితం నాటి ఓ రావిచెట్టు కాకినాడ బాలాత్రిపుర సుందరి దేవాలయం రహదారిలో గురువారం కూలిపోయిన విషయం తెలిసిందే. -
పూలబాట పరిచిన పాదాలకు పుష్పాభిషేకం
[ 16-06-2024]
కాకినాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో శనివారం ఫాదర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ తండ్రులపై చిన్నారులు పూలు చల్లి ఆశీర్వచనం తీసుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అల్లర్ల గురించి పిల్లలకు బోధించడం ఎందుకు?: ఎన్సీఈఆర్టీ చీఫ్
-
స్మృతి మంధాన సెంచరీ.. దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన భారత్
-
ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనపై తొలి ట్రయల్ రన్.. వీడియో
-
పేటీఎం - జొమాటో రూ.1,500 కోట్ల డీల్?
-
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
-
కొత్తదనం, ప్రయోగాలకు రామోజీరావు చిరునామా.. బెంగళూరులో జర్నలిస్టుల ఘన నివాళి