ఇల్లూ లేదు.. సొమ్మూ రాదు..!
అద్దె భారం నుంచి తప్పించుకునేందుకు కష్టమైనా శ్రమపడి కూడబెట్టి.. బంధువుల దగ్గర అధిక వడ్డీలకు అప్పుతెచ్చి మరీ.. సొంత గూడు సమకూరుతుందనే కొండంత ఆశతో ప్రభుత్వానికి ముందస్తుగా డబ్బుకట్టారు.
అల్లవరం మండలం బోడసకుర్రు వద్ద నిర్మించిన టిడ్కో గృహ సముదాయం
అద్దె భారం నుంచి తప్పించుకునేందుకు కష్టమైనా శ్రమపడి కూడబెట్టి.. బంధువుల దగ్గర అధిక వడ్డీలకు అప్పుతెచ్చి మరీ.. సొంత గూడు సమకూరుతుందనే కొండంత ఆశతో ప్రభుత్వానికి ముందస్తుగా డబ్బుకట్టారు. అలాంటి వారికోసం ఇళ్లు నిర్మించి ఇప్పటికే ఏళ్లవుతున్నా.. లబ్ధిదారులకు అప్పగించకపోగా కట్టిన సొమ్ము కూడా తిరిగివ్వలేదు. ఇళ్లు ఎప్పుడిస్తారో తెలియని దుస్థితి.
న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్, మండపేట, రామచంద్రపురం
జిల్లాలో ఇలా..
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పట్టణ పేదలకు అల్లవరం, రామచంద్రపురం, మండపేట గ్రామాల్లోని టిడ్కో గృహ సముదాయంలో మొత్తం 9,808 ఇళ్లు నిర్మించారు. వీరికి గత ప్రభుత్వ హయాంలో కేటాయించి 365 చ.అడుగులకు రూ.50 వేలు, 430 చ.అ. రూ.లక్ష వరకు కట్టించుకున్నారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఇళ్లను అప్పగించే సమయానికి సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తరువాత రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి రావడంతో వాటి నిర్మాణం గాలికొదిలేశారు. అప్పట్నుంచి కేవలం అమలాపురం పురపాలిక పరిధిలో నిర్మించిన ఇళ్లను మాత్రమే పూర్తిగా లబ్ధిదారులకు అందించారు. రామచంద్రపురం, మండపేట గ్రామాల్లో ఇప్పటికీ పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు ఇవ్వనేలేదు.
మూడు పట్టణాలు.. 9,808 ఇళ్లు
కేంద్రంలో భాజపా ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం హయాంలో ఎన్టీఆర్ ఇళ్ల పథకం కింద టిడ్కో(పట్టణ మౌలిక సదుపాయల కల్పన సంస్థ) ద్వారా షేర్వాల్ సాంకేతికతతో ఇళ్లకు అంకురార్పణ జరిగింది. వీటి నిర్మాణాలను గత ప్రభుత్వ హయాంలోనే 80 శాతం వరకు పూర్తిచేశారు. మరికొద్ది రోజుల్లో పూర్తిచేసి పంపిణీ చేద్దామనుకునే సమయానికి ప్రభుత్వం మారడంతో లబ్ధిదారులకు ఇప్పటికీ అందనేలేదు. జిల్లావ్యాప్తంగా 9,808 ఇళ్లు నిర్మించారు. వారిలో ఇప్పటివరకు 5,020 గృహాలు మాత్రమే లబ్ధిదారులకు అప్పగించారు.
చెల్లించాల్సింది రూ.15.10 కోట్లు
జిల్లావ్యాప్తంగా టిడ్కో గృహాలకు ముందస్తుగా సొమ్ము కట్టిన వాళ్లలో ఇళ్లు అప్పగించనివారికి సుమారు రూ.15.10 కోట్లు తిరిగి చెల్లించాల్సిఉంది. వీరిలో అత్యధికంగా రామచంద్రపురం పట్టణలోనే 1,088 మంది ఉన్నారు. వీరిలో అనేక మందికి పలు కారణాలతో ఇళ్ల మంజూరు నిలిపేశారు. వీరందరికీ సుమారు రూ.9.90 కోట్లు తిరిగి చెల్లించాల్సిఉంది. మండపేటలో 960 మంది లబ్ధిదారులకు గృహాల మంజూరు ఆగింది. వారికి రూ.4.80 కోట్లు తిరిగి చెల్లించాలి. అమలాపురం పురపాలిక పరిధిలో 72 మందికి రూ.42లక్షలు తిరిగి ఇవ్వాల్సిఉంది.
2,120 మంది ఎదురుచూపులు..
జిల్లాలోని మూడు పురపాలికల పరిధిలో ఇళ్లకోసం తాము చెల్లించిన డబ్బులు కూడా ఇప్పటికీ తిరిగిరాని లబ్ధిదారులు 2,120 మంది ఉన్నారు. వీరు చెల్లించిన రూ.15 కోట్లకుపైగా సొమ్ము ఈ మూడు పురపాలికల నుంచి తిరిగి చెల్లించాలి. వీరెవరికీ టిడ్కో ఇళ్లు రావని ఇప్పటికే తేల్చేశారు. తాము డబ్బులు కట్టినా ఎందుకు ఇవ్వరని అడుగుతున్నా.. కనీసం సమాధానం చెప్పేవారే కరవయ్యారని వాపోతున్నారు. పురపాలికల్లో అడిగితే తమకు సంబంధం లేదని, టిడ్కో అధికారులను అడగాలని అక్కడి అధికారులు చెబుతున్నారని వాపోతున్నారు. లబ్ధిదారులు చెల్లించిన డబ్బును టిడ్కోకు చెల్లించామని, వాళ్లనుంచి వెనక్కిస్తానని చెబుతున్నారు.
మారిన లబ్ధిదారులు..
గత ప్రభుత్వ హయాంలోనే టిడ్కో గృహాలకు అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి వారి నుంచి ముందస్తుగా కొంత మొత్తం డబ్బు కట్టించుకున్నారు. వీరికి ఇళ్లప్పగించే సమయానికి ప్రభుత్వం మారడంతో అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగి లబ్ధిదారుల జాబితాను తారుమారు చేశారని.. డబ్బులు చెల్లించినవారు ఆరోపిస్తున్నారు. ఈ మూడు పురపాలికల పరిధిలో నాయకులకు అనుకూలంగా ఉన్నవారి పేర్లు జాబితాలో చేర్చారనే ఆరోపణలున్నాయి. పాత ప్రభుత్వంలో ఉన్న లబ్ధిదారులను అనేక సాంకేతిక, రాజకీయ కారణాలను సాకుగా చూపి తప్పించారు. ఇప్పటివరకు వారు కట్టిన సొమ్ము మాత్రం వెనక్కివ్వడం లేదు. ఓపక్క ఇళ్లు దక్కలేదనే అవేదన.. మరోపక్క అప్పుచేసి కట్టిన సొమ్ముకు వడ్డీలు కట్టలేక, ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇళ్లకు అద్దె చెల్లించలేక నానాపాట్లు పడుతున్నామని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా తమ సొమ్ము తక్షణం చెల్లించాలని, లేదంటే ఉద్యమబాట పట్టాల్సివస్తుందని హెచ్చరిస్తున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నాం
అమలాపురం పురపాలిక పరిధిలో 72 మంది టిడ్కో లబ్ధిదారులకు రూ.42 లక్షల చెల్లించాల్సిఉంది. సమస్యను మంత్రి విశ్వరూప్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికిసైతం తీసుకువెళ్లాం. త్వరలోనే ఆ నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చెల్లించే ఆలోచన కూడా చేస్తున్నాం. త్వరలోనే ఇచ్చేలా చర్యలు చేపడతాం.
అయ్యప్పనాయుడు, పురపాలిక కమిషనర్, అమలాపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
[ 17-05-2024]
‘పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి కూటమి నేతలు ప్రజలకు మద్యం ఇవ్వలేదు. డబ్బు పంచలేదు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రూ.45లక్షలు మాత్రమే ఖర్చు చేశాం. -
కదిలారు కడదాక నిలిచారు
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు నగరాల్లో ఓటు చైతన్యంలో కాకినాడ ముందుంది. రాజమహేంద్రవరం నగరంలో 67.57 శాతం పోలైతే.. కాకినాడలో అత్యధికంగా 72.16 పోలయ్యింది. -
నడుం బిగిస్తారా.. నిద్ర నటిస్తారా!
[ 17-05-2024]
నదీ పరిరక్షణ, వాల్టా ప్రకారం నదుల్లో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. ఉపరితలానికి మీటరు లోతుకు మించి వెళ్లకూడదు. -
ఈనెల రేషన్ సరుకులు ఇంకా అందలే
[ 17-05-2024]
జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి మొత్తం 5,74,907 రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెల 1 నుంచి 17వ తేదీ వరకు 364 ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు రేషన్ సరకుల పంపిణీ జరుగుతుంది. -
క్రీడా శిబిరాలు ఇంకెప్పుడు?
[ 17-05-2024]
వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం కాకపోవటంతో నగరంలోని క్రీడాకారుల్లో నిస్తేజం అలముకుంది. -
ఈదురుగాలులకు అరటి రైతు దిగాలు
[ 17-05-2024]
ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు అరటి రైతులు కుదేలయ్యారు. జిల్లాలో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో అరటి ఎక్కువగా సాగు చేస్తారు. -
అయిదు దీవులు.. పర్యాటక సొబగులు
[ 17-05-2024]
యానాం తీర ప్రాంతానికి సహజ రక్షణ కవచంగా ఉన్న మడ అడవుల్ని సంప్రదాయ పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మార్చాలని పుదుచ్చేరి ప్రభుత్వం యోచిస్తోంది. -
అవినీతికి నాయకుల అండ
[ 17-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయమన్నారు... వారికి రుణాల అందించే క్రమంలో ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకును(డీసీసీబీ) సంరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామంటూ ప్రకటనలు గుప్పించారు. -
ఎమ్మెల్సీ తోట, అనుచరులపై అట్రాసిటీ కేసు
[ 17-05-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరులో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి ఎమ్మెల్సీ, వైకాపా మండపేట నియోజకవర్గ అభ్యర్థి తోట త్రిమూర్తులు -
సచివాలయం ఎదుట స్తంభాలు పాతి నిరసన
[ 17-05-2024]
గ్రామ సచివాలయం ఎదుట సిమెంటు స్తంభాలతో ఫెన్సింగ్ వేసి స్థానికులు ఆందోళనకు దిగిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. -
ఖరీఫ్ ఎరువుల ప్రణాళిక ఖరారు..!
[ 17-05-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా ప్రస్తుత రబీ సీజన్లో 1,69,397 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. రానున్న ఖరీఫ్ సీజన్లో సుమారు 1,68,780 ఎకరాల్లో వరి సాగు చేపట్టే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఉన్న రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ తెలిపారు. -
అక్షరాలా రూ.కోటి.. అక్రమంలో పోటీ!
[ 17-05-2024]
అక్రమంలో పోటీపడ్డారు.. అక్షరాలా కోటి రూపాయల నిధులను హాంఫట్ చేశారు.. అడిగేవారు లేరన్న ధైర్యం, అడిగినా ఏమవుతుందిలే అన్న బరితెగింపు.. కారణాలు ఏవైనా అడ్డదారిలో కథ నడిపించారు. -
రక్తపోటు.. ఆరోగ్యంపై వేటు
[ 17-05-2024]
ఉరుకుల పరుగుల జీవనశైలి కారణంగా చాలా మంది ఒత్తిడికి చిత్తవుతున్నారు. దీని కారణంగా ఆరోగ్యం గతి తప్పుతోంది. రక్తపోటు(బీపీ), మధుమేహం, ఇతర వ్యాధులబారిన పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు