ఈనెల రేషన్ సరుకులు ఇంకా అందలే
జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి మొత్తం 5,74,907 రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెల 1 నుంచి 17వ తేదీ వరకు 364 ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు రేషన్ సరకుల పంపిణీ జరుగుతుంది.
నేటితో గడువు ముగుస్తున్నా మందకొడిగా పంపిణీ
రేషన్ సరకుల పంపిణీ
(దాచిన చిత్రం)
జిల్లాలో ప్రస్తుత నెలకు సంబంధించి రేషన్ సరకుల పంపిణీ కొన్ని మండలాల్లో వేగంగా జరగడం లేదు. ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీకి నేటితో(శుక్రవారం) గడువు ముగుస్తున్నప్పటికీ సరకులు అందించాల్సిన కార్డులు ఇంకా వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ ఒక్క రోజులో లబ్ధిదారులందరికీ రేషన్ అందే పరిస్థితి లేదు. పలు మండలాల్లో పంపిణీ ఇంకా రెడ్, ఆరెంజ్ జోన్లలోనూ ఉంది.
న్యూస్టుడే, రాజమహేంద్రవరం కలెక్టరేట్: జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి మొత్తం 5,74,907 రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెల 1 నుంచి 17వ తేదీ వరకు 364 ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు రేషన్ సరకుల పంపిణీ జరుగుతుంది. ప్రస్తుత నెలలో మాత్రం పంపిణీ ప్రక్రియ ముందు నుంచి మందకొడిగానే సాగుతూ వచ్చింది. గురువారం ఉదయం నాటికి 5,13,532 కార్డులకు సంబంధించి సరకుల పంపిణీ జరగగా.. ఇంకా 61,375 కార్డులు మిగిలి ఉన్నాయి. ప్రతి నెలా 1 నుంచి 10 తేదీ వరకు రోజుకు 8 నుంచి 9 శాతం మేరకు సరకుల పంపిణీ జరుగుతుండగా.. చివరి వారం రోజులు రోజుకు నాలుగు శాతంలోపు జరుగుతుంది. ప్రస్తుత నెలలో అధిక ఉష్ణోగ్రతలు.. మరోపక్క ఎన్నికలు.. కొన్నిసార్లు సర్వర్లు సరిగ్గా పనిచేయకపోవడం తదితర కారణాలతో అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. దీనికితోడు ప్రక్రియను మండల స్థాయిలో పర్యవేక్షించే పౌరసరఫరాల అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటంతో చాలామంది ఎండీయూ ఆపరేటర్లు సరకుల పంపిణీలో నిర్లక్ష్యం చేశారు. కొందరు ఆపరేటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో సక్రమంగా సరకులు ఇవ్వలేదని పలువురు చెబుతున్నారు. ఈ నెల 13న పోలింగ్ కారణంగా ఆ రోజు సరకుల పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. ఇక ఒక రోజే గడువు ఉండటంతో మిగతా కార్డుదారులందరికీ సరకు అందే పరిస్థితి లేనందున గడువు పెంచాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు.
రెడ్, ఆరెంజ్ జోన్లలో 12 మండలాలు
జిల్లాలో గురువారం ఉదయం నాటికి సగటున 89.32 శాతం మాత్రమే రేషన్ సరకుల పంపిణీ జరిగింది. 19 మండలాలకుగాను 12 చోట్ల తక్కువ శాతం జరిగింది. గోపాలపురం మండలంలో 21,529 కార్డులకుగాను 18,089 కార్డులకు ఇవ్వగా.. ఇంకా 3,440 కార్డులకు అందించాల్సి ఉంది. ఇక్కడ 84.02 శాతమే పంపిణీ జరిగి రెడ్జోన్లో ఉంది. కొవ్వూరు మండలంలో 86.29 శాతం, బిక్కవోలు 86.66, గోకవరం 86.75, కోరుకొండ 86.79, పెరవలి 87.14, రాజానగరం 87.58, సీతానగరం 87.63, కడియం 88.24, అనపర్తి 88.30, దేవరపల్లి 88.90, చాగల్లు మండలంలో 89.16 శాతం చొప్పున సరకుల పంపిణీ జరిగి ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్న మండలాల్లో ఒక్కరోజులో మిగతా రేషన్ కార్డులన్నింటికీ సరకులు ఇచ్చే పరిస్థితి లేనందున గడువు పొడిగించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. లబ్ధిదారులందరికీ సరకులు అందేలా గడువు పెంచే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రన్న సంతకం.. జనమంత సంబరం
[ 14-06-2024]
అన్నార్తుల ఆకలి తీర్చేలా.. అవ్వాతాతల మోములో ఆనందం రెట్టింపు అయ్యేలా.. అవకాశాలు యువత అందిపుచ్చుకునేలా.. ఆందోళన కలిగించిన భూ హక్కు చట్టం నుంచి ఊపిరి పీల్చుకునేలా.. సీఎం చంద్రబాబు చేసిన అయిదు సంతకాలతో ఉమ్మడి జిల్లావాసుల్లో కొత్త ఆశలు చిగురించాయి. -
ఆశల ద్వీపంలో..అడుగు ఇంకెప్పుడు?
[ 14-06-2024]
గోదావరి వరదలకు సముద్రంలో కొట్టుకొచ్చే ఇసుక మేటలతో సహజ సిద్ధంగా 200 ఏళ్ల క్రితం ఏర్పాటైన ద్వీపం.. హోప్ ఐలాండ్. తాళ్లరేవు మండలం కోరింగ పంచాయతీ పరిధి అభయారణ్యంలో ఇదో భాగం.. -
మీ సహకారం ఇక చాలు!
[ 14-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులు రద్దు చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొందరు తమ పదవుల నుంచి తప్పుకోగా మిగిలిన వారు మిన్నకుండిపోయారు. -
కువైట్ అగ్నిప్రమాదం.. జిల్లావాసులు ఇద్దరి మృతి
[ 14-06-2024]
మంచి వేతనం లభిస్తుందని.. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవచ్చని.. కోటి ఆశలతో కువైట్ వెళ్లారు. నా అనే వాళ్లందర్నీ వదిలి ఎడారి దేశానికి వెళ్తే.. అక్కడే అసువులు బాయడంతో వారి కుటుంబాల్లో అంతులేని ఆవేదన మిగిలింది. -
పుస్తకాలు లేకుండానే తరగతులు.. పస్తులతోనే పాఠాలు
[ 14-06-2024]
విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు అందించి వారికి అధ్యాపకులతో బోధన చేయిస్తేనే మంచి ఫలితాలు రాబట్టగలం. అంతర్జాతీయ ప్రమాణాలంటూ గడిచిన అయిదేళ్లుగా ఊదరగొట్టేసిన వైకాపా ప్రభుత్వం -
ఇక చేపల వేట షురూ..!
[ 14-06-2024]
బంగాళాఖాతం తూర్పు తీరంలో వేట సాగించేందుకు మత్స్యకారులు సన్నద్ధమవుతున్నారు. 61 రోజుల నిషేధ సమయం నేటి అర్ధరాత్రితో ముగియనుంది. -
ఇదో రకం గోల్మాల్
[ 14-06-2024]
తమకు తెలియకుండా తమ భూములపై వీఆర్వో ఇచ్చిన కౌలుకార్డులతో నర్సిపూడి చైతన్యగోదావరి గ్రామీణ బ్యాంకులో కొందరు వ్యక్తులు రైతు రుణాలు పొందడంపై గురువారం స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. -
మార్కెట్ కమిటీల కుర్చీలు ఖాళీ
[ 14-06-2024]
గత ప్రభుత్వ హయాంలో మార్కెటింగ్ కమిటీలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. ఎక్కడా రైతులకు సరైన సౌకర్యాలు కల్పించలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. వీటి పదవీకాలం ముగిసిన తర్వాత త్రిమెన్ కమిటీలను నియమించారు. -
అన్నివర్గాలకు మేలు చేసేందుకు పవన్ కల్యాణ్ కృషి
[ 14-06-2024]
రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. -
యథాస్థానంలో మోరంపూడి పైవంతెన శిలాఫలకం
[ 14-06-2024]
రాజమహేంద్రవరం గ్రామీణంలోని మోరంపూడి పైవంతెనకు సంబంధించిన పాత శిలాఫలకాలను మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నేతృత్వంలో గురువారం యథాస్థానంలో ఏర్పాటు చేశారు.