logo

అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్‌ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు.

Published : 26 Apr 2024 06:19 IST

29న పి.గన్నవరంలో జగన్‌, షర్మిల పర్యటన

ఈనాడు, కాకినాడ: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్‌ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు ఆయన సోదరి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ న్యాయయాత్ర పేరుతో పి.గన్నవరంలోనే ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 29న ఉదయం 10 గంటలకు పి.గన్నవరంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఒకే రోజు.. ఒకే నియోజకవర్గంలో వైకాపా అధ్యక్షుడు, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సభలు ఉండడం.. అన్నాచెల్లెలు అయిన వీరిద్దరు ప్రత్యర్థి పార్టీల తరఫున ప్రచారంలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని