పోలీసులపైనా కపట ప్రేమే
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ పోలీసు సంక్షేమాన్ని అటకెక్కించారు. నిత్యం పోలీసు బందోబస్తు మధ్య తిరిగే ఆయన వారి కష్టాన్ని పట్టించుకోలేదు.
రక్షకుల సంక్షేమాన్ని అటకెక్కించిన జగన్ సర్కారు
రానున్నది మన ప్రభుత్వమే. వచ్చిన వెంటనే పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం. మీకు రావాల్సిన బకాయిలన్నీ మొత్తంగా చెల్లిస్తాం. వారంతపు సెలవు అమలు చేస్తాం.
ప్రతిపక్ష నేతగా 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ పోలీసు సంక్షేమాన్ని అటకెక్కించారు. నిత్యం పోలీసు బందోబస్తు మధ్య తిరిగే ఆయన వారి కష్టాన్ని పట్టించుకోలేదు. కాన్వాయ్ వెంట పోలీసులును పరుగులు పెట్టించి.. తన భద్రత పేరుతో రూ.కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేశారు. కాని వారికి రావాల్సిన బకాయిలు చెల్లించడంలో మాత్రం అనేక కొర్రీలు పెడుతున్నారు. జగన్ పాలనలో అన్నివిధాలా నష్టపోయామని, ఆరోగ్యం సైతం దెబ్బతిందని పలువురు పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్టుడే, దానవాయిపేట: జిల్లాలోని మొత్తం 1,785 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా జనాభా పరిధిని బట్టి మరో 250 నుంచి 350 మంది వరకు సిబ్బంది అవసరమని ఆ శాఖ ఉన్నతాధికారుల అంచనా. ఆ క్రమంలో ఉన్న యంత్రాంగంతోనే నడిపించాల్సి వస్తోంది. సిబ్బంది కొరతతో నిత్యం విధుల్లో ఉండాల్సి రావడం.. రాత్రి విధులు నిర్వర్తించాల్సిన వారు పగటి పూట కూడా విధులకు రావాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. రాష్ట్రంలో ఎక్కడ బహిరంగ సభలు జరిగిన జిల్లా పోలీసులను అక్కడికి విధులకు పంపడం ఈ ప్రభుత్వంలో అలవాటుగా మారింది. కనీసం వారాంతపు సెలవు కూడా లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురువుతున్నారు. సిబ్బందిలో 25 శాతం మంది అనారోగ్యానికి గురై అనేక సమస్యలతో బాధపడుతూ మెడికల్ లీవ్లు పెడుతున్నారు.
ప్రజా ఉద్యమాలకు.. బందోబస్తులకు
రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి పాలన మొదలు పోలీసులుకు తీవ్ర అవస్థలు మొదలయ్యాయి. ప్రజల నుంచి వైకాపా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో అన్ని పాంత్రాల్లో ఉద్యమాలు ఉద్ధృతమయ్యాయి. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడ ఉద్యమం జరిగినా మన జిల్లా నుంచి అక్కడికి పోలీసులు వెళ్లి విధులు నిర్వహించాల్సిన పరిస్థితి. అత్యవసర సెలవులూ తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
వారాంతపు సెలవు ముణ్నాళ్ల ముచ్చట
అన్ని పభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరి పోలీసులుకు వారాంతపు సెలవు అవసరమని, కచ్చితంగా తాను అమలు చేస్తానని ఎన్నికల ముందు జగన్ ఘనంగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాది పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా పోలీసులుకు వారాంతపు సెలవును ప్రకటించారు. రాష్ట్రంలో వివిధ పోలీసు స్టేషన్లలో ఒకటి రెండు నెలలు ఇది సక్రమంగానే అమలు జరిగింది. సిబ్బంది ఆనందం మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. మూడో నెలకే అదికాస్త అటకెక్కింది.
మర్చిపోయిన ఆరోగ్య భద్రత..
- పోలీసుల ఆరోగ్య భద్రతకు గాను జిల్లాలో ఆరు ఆసుపత్రుల్లో సిబ్బంది చికిత్స పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆయా ఆసుపతులకు పాత బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ప్రస్తుతం వారు పోలీసులుకు వైద్య సేవలు అందించేందుకు నిరాకరిస్తున్నారు. అనుమతి ఉన్న కొన్నింటిలో అవసరమైన చికిత్స పొందే సౌకర్యం లేకపోవడంతో ఇతర ఆసుపత్రులలో నగదు చెల్లించి వైద్యం చేయించుకుంటున్నారు.
- జీపీఎఫ్, భద్రతా రుణాలు సకాలంలో మంజూరు కావడంలేదు. వాటికి దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాకపోవడంతో పలువురు ఉద్యోగులు అప్పులు చేయాల్సిన పరిస్థితి.
- ఏసీబీ, ఏజెన్సీ, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసులుకు ఇచ్చే అదనపు చెల్లింపులు, ప్రోత్సాహకాల్లో కోత విధించడంతో ఆయా ప్రాంతాల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- పెండింగ్లో ఉన్న డీఏలు, బోనస్లు కోసం ఎదురుచూపులే మిగిలాయి. పీఆర్సీ పెంచినా అమలు నోచుకోలేదు. పాత పీఆర్సీలో కోత విధించారు.
ఎన్నికల వేళ ఎర..
రాష్ట్రంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న పోలీసులకు ఎన్నికల నేపథ్యంలో జగన్ ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోంది. అయిదేళ్లుగా పోలీసు అధికారుల సంక్షేమాన్ని పట్టించుకోని జగన్ ఎన్నికల సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉంచిన సరెండర్ లీవ్లకు సంబంధించిన కొంత మొత్తాన్ని ఇటీవలే వారి ఖాతాలకు ప్రభుత్వం జమ చేసింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోలీసులకు వారి ఖాతాల్లో నగదు జమ కావడంతో ఆశ్చర్యపోయారు. జిల్లా పోలీసు అధికార, సిబ్బందిలో కొందరికి ఒకటి, మరికొందరికి రెండు సరెండర్ లీవులకు సంబంధించి మొత్తాలు జమ చేశారు. మరి కొందరికి పెండింగ్లో ఉంచడంతో వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మ ఆరోగ్యం బాలేదు..!
[ 20-05-2024]
జిల్లాలో రక్తహీనత కేసులు కొన్నాళ్లుగా అధికంగా నమోదవుతున్నాయి. ప్రధానంగా గర్భిణుల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటోంది. పౌష్టికాహార లోపం, అనారోగ్య సమస్యల కారణంగా ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. -
అంతులేని ఆక్రమణలు
[ 20-05-2024]
ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్న ప్రబుద్ధుల కళ్లు ఇప్పుడు కాలువల గర్భాలపై పడింది. కాలువల్లోనే రెండంతస్తుల శాశ్వత భవనాలను సైతం నిర్మించేస్తున్నారు. ఇప్పటివరకు కాలువ గట్లను ఆక్రమించి దుకాణాలు నిర్మించుకోవడం వంటి చర్యలకు పాల్పడేవారు. -
పరిణయం.. పరమానందం
[ 20-05-2024]
పురుషోత్తముడు... మీసాలరాయుడు.. త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన అన్నవరం సత్యదేవుడు... పెళ్లికుమారుడిగా సౌభాగ్యదాయిని... సంతోషకారిణి.. అనంతలక్ష్మీ అమ్మవారు పెళ్లికుమార్తెగా.. ఆశీనులైన వేళ.. ఆ కల్యాణ వేడుక కనులారా వీక్షించిన భక్తజనం పులకించిపోయారు. -
కూటమి జట్టులో జోష్
[ 20-05-2024]
సార్వత్రిక సమరంలో ఓటు చైతన్యం కూటమి అభ్యర్థుల్లో కొత్త జోష్ నింపింది. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదవ్వడంతో తమకు కలిసివస్తుందనే ధీమా అందరిలో వ్యక్తమవుతోంది. వైకాపా అయిదేళ్ల పాలనలో వైఫల్యాలకు ప్రజలు విసిగిపోయారని.. -
ఈసారీ నాణ్యతకు పరీక్షే!
[ 20-05-2024]
జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో సమీకృత వ్యవసాయ ప్రయోగశాలలు (ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్) నేటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రతి వ్యవసాయ సీజన్లోనూ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలకు ఇబ్బందులు తప్పడం లేదు. -
వంతెనల సమీపంలో తవ్వకాలే లేవట!
[ 20-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయట.. వంతెనలకు 500 మీటర్ల దూరంలో తవ్వకాలే లేవట.. ఇవీ జిల్లా యంత్రాగమంతా ఆదివారం రేవుల్లో పర్యటించి తేల్చిన విషయం. -
నిరీక్షించి.. నీరసించి..
[ 20-05-2024]
రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో వైద్యసేవలు అందాలంటే రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ఓపీ చీటీ రాయించుకోవడం మొదలు.. వైద్యుడికి చూపించుకోవడం, వైద్య పరీక్షలు, అవసరమైన స్కానింగులు, -
పిఠాపురం, కాకినాడ నగర నియోజకవర్గాలపై నిఘా..?
[ 20-05-2024]
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పలు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. -
పొగాకు పంటకు పండగ
[ 20-05-2024]
ఎన్నో ఆటుపోట్లు మధ్య పండించిన వర్జీనియా పొగాకు పంట అమ్మకాలు జోరందుకున్నాయి. రోజురోజుకూ ధర పెరగడంతో పొగాకు రైతులు వేలం కేంద్రానికి బేళ్లను తరలిస్తున్నారు. -
థాయిలాండ్లో కోనసీమ కుర్రోడి జోష్
[ 20-05-2024]
థాయ్లాండ్లో ఆదివారం ఉదయం జరిగిన ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో భారత డబుల్స్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిల జోడీ విజయం సాధించింది. -
శాశ్వత పరిష్కారం ఎన్నటికో?
[ 20-05-2024]
బ్యాంక్ కెనాల్ ఎగదన్నడం, భారీ వర్షాల వల్ల ప్రతి సార్వా(ఖరీఫ్) సమయంలో లొల్ల, వాడపల్లి ఆయకట్టు పంట పొలాలు ఏటా ముంపుబారిన పడుతున్నాయి. ఏళ్లతరబడి అదే పరిస్థితి ఉంటున్నా పట్టించుకునే నాధుడు లేడు. -
బస్సు దగ్ధం
[ 20-05-2024]
నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం లోయలో పడి 17 మంది మృతి
-
ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. ఇజ్రాయెల్ ప్రమేయం ఉందా?
-
హెచ్డీఎఫ్సీ నుంచి పిక్సెల్ పే క్రెడిట్ కార్డు.. రివార్డులు మీకు నచ్చినట్టుగా..
-
ప్రపంచంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదాలివే..
-
కోహ్లీని మించిన స్ఫూర్తి ఎవరు.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
-
ఏపీలో 33 చోట్ల హింసాత్మక ఘటనలు.. డీజీపీకి సిట్ నివేదిక అందజేత!