మాదిగ జాతి ద్రోహి జగన్
మాదిగ జాతి ద్రోహి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎన్నికల్లో ఓడించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.
ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు
కరపత్రాలను ఆవిష్కరిస్తున్న వెంకటేశ్వరరావు, నాయకులు
దేవీచౌక్, న్యూస్టుడే: మాదిగ జాతి ద్రోహి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎన్నికల్లో ఓడించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ అయిదేళ్లలో మాదిగల సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే భవిష్యత్తు ఉండదన్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తేనే మాదిగలకు న్యాయం జరుగుతుందన్నారు. తానేటి వనిత హోం మంత్రిగా ఉన్నా కనీసం ఒక్క హోంగార్డును కూడా నియమించలేని దుస్థితిలో ఉన్నారన్నారు. వైకాపా హయాంలో దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగినా నోరు విప్పలేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న కూటమికే తమ మద్దతు అని స్పష్టం చేశారు. దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెట్టే రాజు మాట్లాడుతూ దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును పక్కన కూర్చోబెట్టుకుంటున్నారని ఆరోపించారు. సీతానగరంలో ప్రసాద్కు శిరోముండనం జరిగితే ఇంతవరకు దోషులపై చర్యలు లేవన్నారు. అంబేడ్కర్ విదేశీ విద్య పథకానికి జగన్ తన పేరు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ప్రస్తావనలేని జగన్కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. చంద్రబాబుకు మద్దతుగా ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. నవ్యమాదిగ చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేజెండ్ల సుబ్బారావు, బేడబుడగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు వనం నాగేశ్వరరావు, చెట్టే సుజన్రావు, కావూరి వరలక్ష్మి, దిగమర్తి బెంజుమన్, పల్లాబత్తుల సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెలుగులన్నారు.. చీకట్లోకి నెట్టేస్తున్నారు!
[ 22-05-2024]
ఒడ్డు దాటేదాక ఓడ మల్లయ్య.. దాటిన తర్వాత బోడి మల్లయ్య... ఈ సామెతను ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్తు వినియోగదారుల విషయంలో వైకాపా సర్కారు నిజం చేస్తోంది. -
భూసార పరీక్షలు లేనట్టేనా?
[ 22-05-2024]
పంటల దిగుబడికి భూసారమే కీలకం. భూసార పరీక్షలు నిర్వహించే విషయంలో జాప్యం చోటు చేసుకుంటోంది. -
సేవలు నిలిచిపోతే సమస్యలే
[ 22-05-2024]
ఆరోగ్యశ్రీ పథకం కష్టాల్లో కూరుకుపోయింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆయా ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు యాజమాన్యాలు ఇప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారులకు సమాచారమివ్వడంతో రోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. -
బాణసంచా విక్రయాలపై నిషేధం: కలెక్టర్
[ 22-05-2024]
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేవరకు జిల్లాలో బాణసంచా విక్రయాలపై నిషేధం విధించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
నియంత్రికల్లో రాగితీగలు దొంగిలిస్తున్న ముఠా అరెస్టు
[ 22-05-2024]
విద్యుత్తు నియంత్రికల్లో రాగి తీగలను చోరీ చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నామని కొవ్వూరు డీఎస్పీ కె.సీహెచ్.రామారావు, సీఐ పి.బాలసురేష్ తెలిపారు. -
వంద శాతం ఉత్తీర్ణత సాధించేనా..
[ 22-05-2024]
పదో తరగతి తప్పిన విద్యార్థులు అనుబంధ పరీక్షల్లో అయినా వంద శాతం ఉత్తీర్ణులయ్యేలా చేయాలని నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు గాడి తప్పుతున్నాయి... -
సరదా శ్రుతిమించితే... మృత్యు ఒడికి..!
[ 22-05-2024]
పాఠశాలలు, కళాశాలకు వేసవి సెలవులు ఇచ్చారంటే పిల్లలు, యువత ఇంటి వద్ద ఉండకుండా ఆడుకునేందుకు బయటకు వెళ్లిపోతుంటారు. -
మూగబోయిన దొమ్మేరు
[ 22-05-2024]
నిస్వార్థ రాజకీయ నేతగా పెండ్యాల వెంకట కృష్ణారావు(కృష్ణబాబు) సుదీర్ఘ కాలం సేవలందించారు. రాజకీయ దురంధురునిగానే కాక పారిశ్రామిక వేత్తగానూ రాణించారు. -
నోటాకు నొక్కేస్తున్నారు..
[ 22-05-2024]
ఈవీఎం బ్యాలెట్ చివరలో నిక్షిప్తమై ఉండే మీట ‘నోటా’. ఎన్నికల బరిలో పోటీపడిన అభ్యర్థుల్లో ఎవరికీ ఓటు వేయడానికి ఇష్టం లేకపోతే ‘నోటా’ మీటను నొక్కడానికి భారత ఎన్నికల సంఘం 2014 నుంచి ఓటర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. -
నేడు సత్యదేవుడి రథోత్సవం
[ 22-05-2024]
సత్యదేవుని సన్నిధి రత్నగిరిపై కల్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు గ్రామంలోని తొలి పావంచాల నుంచి సత్యదేవుని రథోత్సవం ప్రారంభమవుతుంది. -
పిఠాపురంలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
[ 22-05-2024]
పిఠాపురంలో అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం ధ్వంసం చేశారు. -
ఎన్నికల రోజు పనిచేశాం.. పారితోషికం ఇప్పించండి సారూ..!
[ 22-05-2024]
ఎన్నికల రోజు ఆశా వర్కర్లు మెడికల్ క్యాంపులు, బూత్ల వద్ద విధులు నిర్వహించిన సంగతి విదితమే. అందుకుగాను ఆశాలకు పారితోషికం ఇప్పటివరకు చెల్లించలేదని తెలిసింది.
తాజా వార్తలు (Latest News)
-
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..