వైకాపా ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు
ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ.. కొన్నిచోట్ల యథేచ్ఛగా ఉల్లంఘన జరుగుతోంది.
కన్నబాబుకు మద్దతుగా బరితెగింపు
కాకినాడ గ్రామీణ వైకాపా అభ్యర్ధి కురసాల కన్నబాబు తరఫున ప్రచారం చేస్తున్న జేఎన్టీయూకే అవుట్ సోర్సింగ్, కాకినాడ జడ్పీ కార్యాలయ ఉద్యోగులు
కాకినాడ గ్రామీణం (సర్పవరం జంక్షన్), కరప, న్యూస్టుడే: ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ.. కొన్నిచోట్ల యథేచ్ఛగా ఉల్లంఘన జరుగుతోంది. కాకినాడ గ్రామీణ నియోజకవర్గ వైకాపా అభ్యర్ధి, ప్రస్తుత ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కోసం కాకినాడ జేఎన్టీయూకే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇద్దరు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం విమర్శలకు తావిచ్చింది. కాకినాడ గ్రామీణ ప్రాంతానికి చెందిన కొప్పిశెట్టి రమణ, సుబ్బారావులు జేఎన్టీయూకేలో అవుట్ సోర్సింగ్ కింద గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. కాకినాడ కార్యాలయంలో జరిగిన వైకాపా ఎన్నికల ప్రచార సమావేశంలో సుబ్బారావు, 1వ డివిజన్ రమణయ్యపేటలో జరిగిన ప్రచారంలో రమణ హాజరై కరపత్రాలు పంచి ఓట్లు అభ్యర్థించారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో జేఎన్టీయూకే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే, కాకినాడ జడ్పీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న రెడ్డిపల్లి వెంకటవీర రమేష్ అధికార పార్టీ నాయకుడిగా చలామణి అవుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కురసాల కన్నబాబుకు ప్రధాన అనుచరుల్లో ఒకరిగానూ పేరొందారు. ఏపీ పంచాయతీరాజ్శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర సహ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈయన.. రెండురోజుల క్రితం వైకాపా కార్యకర్తలతో కలిసి గ్రామంలో కన్నబాబు చేసిన అభివృద్ధి పనులు వివరిస్తూ వైకాపా కోసం ప్రచారం చేశారు. ఈయన భార్య రెడ్డిపల్లి వెంకటమాధవి గ్రామ సర్పంచి. రెండునెలల క్రితం గ్రామదేవత ఆలయ ప్రారంభోత్సవ సమయంలో మాటలను ప్రతిపక్ష పార్టీ నాయకులు వక్రీకరించి చెబుతున్నారని.. తాను ఎక్కడా వైకాపా జెండా పట్టుకుని ప్రచారం చేపట్టలేదని రమేష్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మ ఆరోగ్యం బాలేదు..!
[ 20-05-2024]
జిల్లాలో రక్తహీనత కేసులు కొన్నాళ్లుగా అధికంగా నమోదవుతున్నాయి. ప్రధానంగా గర్భిణుల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటోంది. పౌష్టికాహార లోపం, అనారోగ్య సమస్యల కారణంగా ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. -
అంతులేని ఆక్రమణలు
[ 20-05-2024]
ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్న ప్రబుద్ధుల కళ్లు ఇప్పుడు కాలువల గర్భాలపై పడింది. కాలువల్లోనే రెండంతస్తుల శాశ్వత భవనాలను సైతం నిర్మించేస్తున్నారు. ఇప్పటివరకు కాలువ గట్లను ఆక్రమించి దుకాణాలు నిర్మించుకోవడం వంటి చర్యలకు పాల్పడేవారు. -
పరిణయం.. పరమానందం
[ 20-05-2024]
పురుషోత్తముడు... మీసాలరాయుడు.. త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన అన్నవరం సత్యదేవుడు... పెళ్లికుమారుడిగా సౌభాగ్యదాయిని... సంతోషకారిణి.. అనంతలక్ష్మీ అమ్మవారు పెళ్లికుమార్తెగా.. ఆశీనులైన వేళ.. ఆ కల్యాణ వేడుక కనులారా వీక్షించిన భక్తజనం పులకించిపోయారు. -
కూటమి జట్టులో జోష్
[ 20-05-2024]
సార్వత్రిక సమరంలో ఓటు చైతన్యం కూటమి అభ్యర్థుల్లో కొత్త జోష్ నింపింది. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదవ్వడంతో తమకు కలిసివస్తుందనే ధీమా అందరిలో వ్యక్తమవుతోంది. వైకాపా అయిదేళ్ల పాలనలో వైఫల్యాలకు ప్రజలు విసిగిపోయారని.. -
ఈసారీ నాణ్యతకు పరీక్షే!
[ 20-05-2024]
జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో సమీకృత వ్యవసాయ ప్రయోగశాలలు (ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్) నేటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రతి వ్యవసాయ సీజన్లోనూ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలకు ఇబ్బందులు తప్పడం లేదు. -
వంతెనల సమీపంలో తవ్వకాలే లేవట!
[ 20-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయట.. వంతెనలకు 500 మీటర్ల దూరంలో తవ్వకాలే లేవట.. ఇవీ జిల్లా యంత్రాగమంతా ఆదివారం రేవుల్లో పర్యటించి తేల్చిన విషయం. -
నిరీక్షించి.. నీరసించి..
[ 20-05-2024]
రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో వైద్యసేవలు అందాలంటే రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ఓపీ చీటీ రాయించుకోవడం మొదలు.. వైద్యుడికి చూపించుకోవడం, వైద్య పరీక్షలు, అవసరమైన స్కానింగులు, -
పిఠాపురం, కాకినాడ నగర నియోజకవర్గాలపై నిఘా..?
[ 20-05-2024]
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పలు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. -
పొగాకు పంటకు పండగ
[ 20-05-2024]
ఎన్నో ఆటుపోట్లు మధ్య పండించిన వర్జీనియా పొగాకు పంట అమ్మకాలు జోరందుకున్నాయి. రోజురోజుకూ ధర పెరగడంతో పొగాకు రైతులు వేలం కేంద్రానికి బేళ్లను తరలిస్తున్నారు. -
థాయిలాండ్లో కోనసీమ కుర్రోడి జోష్
[ 20-05-2024]
థాయ్లాండ్లో ఆదివారం ఉదయం జరిగిన ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో భారత డబుల్స్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిల జోడీ విజయం సాధించింది. -
శాశ్వత పరిష్కారం ఎన్నటికో?
[ 20-05-2024]
బ్యాంక్ కెనాల్ ఎగదన్నడం, భారీ వర్షాల వల్ల ప్రతి సార్వా(ఖరీఫ్) సమయంలో లొల్ల, వాడపల్లి ఆయకట్టు పంట పొలాలు ఏటా ముంపుబారిన పడుతున్నాయి. ఏళ్లతరబడి అదే పరిస్థితి ఉంటున్నా పట్టించుకునే నాధుడు లేడు. -
బస్సు దగ్ధం
[ 20-05-2024]
నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!