మాట తప్పావ్.. మడం తిప్పావ్..
వైకాపా పాలనలో అంగన్వాడీ సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి సమస్యలు పరిష్కారంకాక అయిదేళ్లు నానాఅవస్థలు ఎదుర్కొన్నారు. ఎన్నోసార్లు తమ గోడును ప్రభుత్వానికి వినిపించినా పట్టించుకున్న పాపానపోలేదు.
హామీలు నెరవేర్చలేదని జగన్పై అంగన్వాడీల మండిపాటు
న్యూస్టుడే, వి.ఎల్.పురం
వైకాపా పాలనలో అంగన్వాడీ సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి సమస్యలు పరిష్కారంకాక అయిదేళ్లు నానాఅవస్థలు ఎదుర్కొన్నారు. ఎన్నోసార్లు తమ గోడును ప్రభుత్వానికి వినిపించినా పట్టించుకున్న పాపానపోలేదు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కారించాలంటూ అనేక రూపాల్లో ఆందోళనలు చేసినా కనికరించలేదు. విసిగిపోయి చివరకు కేంద్రాలకు తాళాలు వేసి రోడ్డెక్కే పరిస్థితిని కల్పించారు. నేటికీ తమ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజమహేంద్రవరం నగరంలోనే 150 వరకు అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో టీచర్లు, సహాయకులు కలిసి 300 మంది ఉన్నారు. గత ఎన్నికల సమయంలో జగన్మోహన్రెడ్డి తెలంగాణలో ఇచ్చే వేతనం కంటే అంగన్వాడీలకు అదనంగా రూ.వెయ్యి పెంచుతామని వాగ్దానం చేసినప్పటికీ అమలు జరపలేదు. తెలంగాణలో అంగన్వాడీ టీచర్కు రూ.13,600, సహాయకురాలికి రూ.9 వేలు వేతనం చెల్లిస్తుండగా ఇక్కడ మాత్రం రూ.11,500, రూ.7 వేలు మాత్రమే ఇస్తున్నారు.
వి.ఎల్.పురంలోని ఎంపీ భరత్రామ్ కార్యాలయ ఆవరణలో నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలు (పాత చిత్రం)
ఉద్యోగ విరమణ చేసినవారి పరిస్థితి దుర్భరం
చాలా రాష్ట్రాల్లో అంగన్వాడీ సిబ్బంది 80 ఏళ్లయినా ఉద్యోగ విరమణ లేకుండా కొనసాగుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం లేదు. 60 ఏళ్లకు ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది రాజమహేంద్రవరం నగరంలోనే 250 మంది వరకు ఉండగా ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధిలేదు. ఉద్యోగ విరమణ సమయంలో కార్యకర్తలకు రూ.50 వేలు, సహాయకురాలికి రూ.20 వేలు చొప్పున ఇచ్చారే తప్ప ఇతర ప్రయోజనాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక భారం, రాజకీయ ఒత్తిళ్లు
ఒకపక్క నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటాయి. మరోవైపు అద్దె బిల్లులు, ఇతర బకాయిలు సకాలంలో రాక కేంద్రాల నిర్వహణ భారంగా మారింది. వీటికితోడు పనిఒత్తిడి పెరిగినప్పటికీ సౌకర్యాలు కల్పించకపోవడం.. రాజకీయ జోక్యం తదితర వాటితో చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారు.
సమ్మెబాట పట్టినా..
తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఏళ్లుగా కోరుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని.. చివరికి ఇటీవల 42 రోజుల పాటు సమ్మె చేపట్టారు. చర్చల అనంతరం సమ్మె కాలంలో వేతనాలు ఇచ్చేందుకు, ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచేందుకు, సర్వీసులో ఉండగా ప్రమాదవశాత్తూ మృతిచెందితే ఇచ్చే పరిహారాన్ని పెంచేందుకు ఇలా కొన్ని అంగీకరించినప్పటికీ వేతనాలు పెంచే విషయంలో స్పష్టమైన హామీ ఏమీ ఇవ్వలేదు. పెండింగ్లో ఉన్న టీఏ బకాయిలు, ఇతర బిల్లులు ఇవ్వలేదు. ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేసి అన్ని యాప్స్లను ఒకే యాప్గా మార్చాలని కోరినా అదీ జరగలేదు.
ప్రభుత్వపరంగా సహాయం లేదు
- సి.హెచ్.సత్యభామ, విశ్రాంత అంగన్వాడీ కార్యకర్త
రూ.4,200 వేతనంలో ఉద్యోగ విరమణ చేశాం. కనీసం సర్వీసు పింఛను అయినా ఇప్పించాలని కోరుతూ అనేకసార్లు స్పందన కార్యక్రమాల్లో అర్జీలు అందించినా ఫలితంలేదు. మానసికంగా, శారీరకంగా అలసిపోయి ప్రభుత్వపరంగా ఎటువంటి సహాయం లేక ఇబ్బందులు పడుతున్నాం.
అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం
- ఎం.ఎస్.మణి
ఏన్నో ఏళ్లు సేవలందించినా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారంలేక ఇబ్బంది పడుతున్నాం. ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్నవారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రిటైర్డు అయిన వారికి ప్రతినెలా వృద్ధాప్య పింఛను ఇచ్చి ఆదుకోవాలని కోరినప్పటికీ ఇప్పటివరకు మాకు ఎటువంటి సహాయం అందటంలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మ ఆరోగ్యం బాలేదు..!
[ 20-05-2024]
జిల్లాలో రక్తహీనత కేసులు కొన్నాళ్లుగా అధికంగా నమోదవుతున్నాయి. ప్రధానంగా గర్భిణుల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటోంది. పౌష్టికాహార లోపం, అనారోగ్య సమస్యల కారణంగా ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. -
అంతులేని ఆక్రమణలు
[ 20-05-2024]
ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్న ప్రబుద్ధుల కళ్లు ఇప్పుడు కాలువల గర్భాలపై పడింది. కాలువల్లోనే రెండంతస్తుల శాశ్వత భవనాలను సైతం నిర్మించేస్తున్నారు. ఇప్పటివరకు కాలువ గట్లను ఆక్రమించి దుకాణాలు నిర్మించుకోవడం వంటి చర్యలకు పాల్పడేవారు. -
పరిణయం.. పరమానందం
[ 20-05-2024]
పురుషోత్తముడు... మీసాలరాయుడు.. త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన అన్నవరం సత్యదేవుడు... పెళ్లికుమారుడిగా సౌభాగ్యదాయిని... సంతోషకారిణి.. అనంతలక్ష్మీ అమ్మవారు పెళ్లికుమార్తెగా.. ఆశీనులైన వేళ.. ఆ కల్యాణ వేడుక కనులారా వీక్షించిన భక్తజనం పులకించిపోయారు. -
కూటమి జట్టులో జోష్
[ 20-05-2024]
సార్వత్రిక సమరంలో ఓటు చైతన్యం కూటమి అభ్యర్థుల్లో కొత్త జోష్ నింపింది. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదవ్వడంతో తమకు కలిసివస్తుందనే ధీమా అందరిలో వ్యక్తమవుతోంది. వైకాపా అయిదేళ్ల పాలనలో వైఫల్యాలకు ప్రజలు విసిగిపోయారని.. -
ఈసారీ నాణ్యతకు పరీక్షే!
[ 20-05-2024]
జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో సమీకృత వ్యవసాయ ప్రయోగశాలలు (ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్) నేటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రతి వ్యవసాయ సీజన్లోనూ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలకు ఇబ్బందులు తప్పడం లేదు. -
వంతెనల సమీపంలో తవ్వకాలే లేవట!
[ 20-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయట.. వంతెనలకు 500 మీటర్ల దూరంలో తవ్వకాలే లేవట.. ఇవీ జిల్లా యంత్రాగమంతా ఆదివారం రేవుల్లో పర్యటించి తేల్చిన విషయం. -
నిరీక్షించి.. నీరసించి..
[ 20-05-2024]
రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో వైద్యసేవలు అందాలంటే రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ఓపీ చీటీ రాయించుకోవడం మొదలు.. వైద్యుడికి చూపించుకోవడం, వైద్య పరీక్షలు, అవసరమైన స్కానింగులు, -
పిఠాపురం, కాకినాడ నగర నియోజకవర్గాలపై నిఘా..?
[ 20-05-2024]
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పలు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. -
పొగాకు పంటకు పండగ
[ 20-05-2024]
ఎన్నో ఆటుపోట్లు మధ్య పండించిన వర్జీనియా పొగాకు పంట అమ్మకాలు జోరందుకున్నాయి. రోజురోజుకూ ధర పెరగడంతో పొగాకు రైతులు వేలం కేంద్రానికి బేళ్లను తరలిస్తున్నారు. -
థాయిలాండ్లో కోనసీమ కుర్రోడి జోష్
[ 20-05-2024]
థాయ్లాండ్లో ఆదివారం ఉదయం జరిగిన ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో భారత డబుల్స్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిల జోడీ విజయం సాధించింది. -
శాశ్వత పరిష్కారం ఎన్నటికో?
[ 20-05-2024]
బ్యాంక్ కెనాల్ ఎగదన్నడం, భారీ వర్షాల వల్ల ప్రతి సార్వా(ఖరీఫ్) సమయంలో లొల్ల, వాడపల్లి ఆయకట్టు పంట పొలాలు ఏటా ముంపుబారిన పడుతున్నాయి. ఏళ్లతరబడి అదే పరిస్థితి ఉంటున్నా పట్టించుకునే నాధుడు లేడు. -
బస్సు దగ్ధం
[ 20-05-2024]
నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!