భావ వ్యక్తీకరణ భేష్!
చదువుకుంటే.. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఆత్మస్థైర్యంతో ఎదుర్కోగలం. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటే.. సంతోషంగా ఉండగలం. మానసిక దృఢత్వం పెంపొందించుకుంటే.. బయట రకరకాల వేధింపులు అధిగమించగలం. ఇలా.. రకరకాల భావాలను వివిధ రీతుల్లో వ్యక్తం
చెక్కు అందుకున్న కార్తీక్..
పిట్టలవానిపాలెం, న్యూస్టుడే చదువుకుంటే.. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఆత్మస్థైర్యంతో ఎదుర్కోగలం. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటే.. సంతోషంగా ఉండగలం. మానసిక దృఢత్వం పెంపొందించుకుంటే.. బయట రకరకాల వేధింపులు అధిగమించగలం. ఇలా.. రకరకాల భావాలను వివిధ రీతుల్లో వ్యక్తం చేసిన విద్యార్థులకు నగదు పురస్కారాలు లభించాయి. సామాజిక పరిస్థితులు, ఆరోగ్యంపై తీసుకోవాల్సిన శ్రద్ధ, బాలికావిద్య ఆవశ్యకత, బాలిక సంరక్షణ తదితర అంశాలపై విద్యార్థులకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ‘సేవ్ * గర్ల్ చైల్డ్’ పేరిట జిల్లా విద్యాశాఖ పాఠశాల, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం విభాగాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించింది. జిల్లాలో వివిధ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు పోటీపడి తమ భావాలు వ్యక్తం చేశారు. పిట్టలవానిపాలెం మండలానికి చెందిన విద్యార్థులు జిల్లాస్థాయిలో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి రూ.5 వేలు, రూ.3 వేల నగదు బహుమతి, పురస్కారాలు అందుకున్నారు.
న్యాయ నిర్ణేతల మన్ననలు..: పర్వదినాల విశిష్టత.. పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై పిట్టలవానిపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కార్తీక్ రాసిన వ్యాసం న్యాయ నిర్ణేతల మన్ననలు అందుకుంది. జిల్లాస్థాయి పోటీలో అతడు తృతీయ స్థానం సాధించాడు. ‘సేవ్ ది గర్ల్ చైల్డ్’ అంశంపై కార్తీక్ గీసిన చిత్రం ప్రత్యేక బహుమతికి ఎంపికైంది. రూ.వెయ్యి చెక్కును జాయింట్ కలెక్టర్ రాజకుమారి అందజేశారు. జిల్లాస్థాయిలో బహుమతి సాధిస్తానన్న తన నమ్మకం వమ్ముకాలేదని అతడు ఆనందం వ్యక్తం చేశాడు.
వ్యాసరచన.. వక్తృత్వంలో ప్రతిభ: అల్లూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నల్లూరి లిఖిత వ్యాసరచన, వక్తృత్వంలో ప్రతిభ చాటుతోంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మెలకువలు నేర్చుకొంటూ సాధన చేస్తోంది. ఇటీవల జిల్లాస్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం సాధించింది. బాలికా సంరక్షణ, బాలికా విద్య ఆవశ్యకత, తల్లిదండ్రుల నుంచి కావాల్సిన ప్రోత్సాహం తదితర అంశాలపై ఆమె వివరించిన తీరు న్యాయనిర్ణేతలను ఆకట్టుకొంది. మరోవైపు క్రీడలు, చిత్రలేఖనం తదితర పోటీల్లోనూ లిఖిత రాణిస్తోంది. కొవిడ్ పరిణామాలపై నిర్వహించిన ఆన్లైన్ పోటీల్లో వ్యాసరచనలో ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లా సంయుక్త కలెక్టర్ రాజకుమారి చేతుల మీదుగా బహుమతులు అందుకోవటం తనకెంతో సంతోషంగా ఉందని తెలిపింది.
జేసీ రాజకుమారి నుంచి బహుమతి అందుకొంటున్న లిఖిత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.