అంతా మా ఇష్టం!
ఇరవై వేల ఎకరాలకు సాగు నీరందించే కీలకమైన ఎత్తిపోతల పథకం అది. ఇటీవల బడ్జెట్లో నిధుల కేటాయింపు జరగడంతో పూర్తిస్థాయిలో పని చేసి తమ సాగు నీటి కష్టాలు తీరతాయని ఇక్కడి రైతులంతా భావించారు.
ఎత్తిపోతల పథకం పంప్హౌస్ కాలువ పూడ్చివేత
గుండ్లకమ్మ రిజర్వాయరు వద్ద గుత్తేదారులదే రాజ్యం
మేదరమెట్ల, న్యూస్టుడే
ఎత్తిపోతల పథకం పంప్హౌస్లోకి నీరు వెళ్లే కాలువను పూడ్చిన దారిపై వెళ్తున్న టిప్పరు
ఇరవై వేల ఎకరాలకు సాగు నీరందించే కీలకమైన ఎత్తిపోతల పథకం అది. ఇటీవల బడ్జెట్లో నిధుల కేటాయింపు జరగడంతో పూర్తిస్థాయిలో పని చేసి తమ సాగు నీటి కష్టాలు తీరతాయని ఇక్కడి రైతులంతా భావించారు. కాసులే పరమావధిగా ఇసుకను తవ్వుకుపోయే గుత్తేదారు అన్నదాతల కష్టాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఎత్తిపోతల పథకం కాలువను పూడ్చేశారు. పట్టించుకోవాల్సిన అధికారులు చోద్యం చూడటంతో అంతా మా ఇష్టం అన్నట్లు ఇక్కడ వ్యవహారం సాగుతోంది.
గుండ్లకమ్మ రిజర్వాయరులో డ్రెడ్జర్లతో ఇసుక తవ్వకాలకు గుత్తేదారులకు కొద్దిరోజుల క్రితం అనుమతులు ఇచ్చారు. వారు కొరిశపాడు మండలం తమ్మవరం గ్రామం సమీపంలో రిజర్వాయరులో మూడు డ్రెడ్జర్లను నదిలోకి దించారు. రాత్రి పగలు తేడా లేకుండా పెద్దమొత్తంలో ఇసుకను నది నుంచి తవ్వుతున్నారు. నదిలో తవ్విన ఇసుకను తరలించేందుకు రిజర్వాయరు పక్కనే దారి ఏర్పాటు చేసుకున్నారు. గుత్తేదారులు ఏర్పాటు చేసుకున్న దారి మధ్యలో రిజర్వాయరు నుంచి యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పంప్హౌస్కు నీరు చేరవేసే కాలువ ఉంది. గుత్తేదారులు ఆ కాలువ మధ్యలో పెద్ద పెద్ద రాళ్లతో పూడ్చి దారి ఏర్పాటు చేశారు. దీంతో పంప్హౌస్కు నీరు చేరే అవకాశం లేకుండా పోయింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించిన బడ్జెట్లో ఈ ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించారు. ఈ ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించడంతో రైతులకు ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఆశ పడ్డారు. కానీ పంప్హౌస్కు నీరందించే కాలువ పూడ్చేందుకు పెద్ద రాళ్లు వేయడంతో కాలువ ఎక్కువ శాతం పాడయ్యే అవకాశం ఉంది. 20 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు రూపొందించిన ప్రాజెక్ట్ కాలువ పూడ్చి వేస్తున్న సంబంధిత అధికారులకు ఎటువంటి సమాచారం లేకపోవడం గమనార్హం. కాలువ పూడ్చే వరకు కూడా అధికారులు నిద్ర నటిస్తున్నారు. 40 టన్నుల ఇసుక టిప్పరు ఈ కాలువపై ఏర్పాటు చేసిన దారిపై వెళ్తే కాలువ దెబ్బతినే అవకాశం ఉంది.
మరమ్మతులు చేయాలని గుత్తేదారులను అడుగుతాం.. రహదారి పూడ్చేయడంపై ఎత్తిపోతల పథకం డీఈ దివాకర్ను వివరణ అడగగా.. కాలువపై మట్టి వేసి దారి ఏర్పాటు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆ ప్రదేశాన్ని పరిశీలించామన్నారు. ఇసుక తవ్వకాలు పూర్తయిన తరువాత కాలువకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని గుత్తేదారులకు తెలియజేశామన్నారు. వారి నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.