‘విశాఖ ఉక్కు కోసం దీక్ష చేపడతా’
విశాఖ ఉక్కును కాపాడేందుకు దీక్ష చేపడతానని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కె.ఎ.పాల్ తెలిపారు.
మాట్లాడుతున్న కె.ఎ.పాల్
బ్రాడీపేట(గుంటూరు), న్యూస్టుడే: విశాఖ ఉక్కును కాపాడేందుకు దీక్ష చేపడతానని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కె.ఎ.పాల్ తెలిపారు. గుంటూరులో పార్టీ జిల్లా కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా డాక్టర్ కె.ఎ.పాల్ పాల్గొని మాట్లాడుతూ ఇప్పటికే విశాఖను కాపాడేందుకు తన వంతు సహాయంగా రూ.4 వేల కోట్లు ఇస్తానని చెప్పానని, కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే విదేశాల నుంచి తాను డబ్బులు తీసుకొస్తానని తెలిపారు. ప్రజాశాంతి పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీకి ప్రజల ఆదరణ మెండుగా ఉందని చెప్పారు. భాజపా తీరుతో దేశ ప్రజలు విసిగిపోయారన్నారు. దేశంలో అవినీతి లేని రాజ్యాన్ని స్థాపించాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని పాలకులు అప్పుల ఊబిలోకి తీసుకువెళ్లారని విమర్శించారు. తనకు అవకాశం కల్పిస్తే రెండు తెలుగు రాష్ట్రాల అప్పులు తీర్చి, రెండు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. ప్రజాశాంతి పార్టీలో చేరేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారని తెలిపారు. తమ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ప్రతి గ్రామానికి రూ.కోటి నిధిని కేటాయిస్తానన్నారు. పార్టీని ప్రజలే నడిపించాలని, అందుకే తాను ప్రజలను విరాళం అడుగుతున్నానని వివరించారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా చుక్కా వాల్టర్, దాసరి ప్రభుదాస్, కార్యదర్శిగా బూసి ప్రసాద్, కోశాధికారిగా పి.పోతురాజు, సభ్యులుగా ఆనంద్, రామంజనేయులు, దత్తు, అక్బర్, జార్జ్ విల్సన్, ప్రవీణ్, మ్యాథ్యూస్, సోనులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉపాధ్యక్షుడు డాక్టర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
[ 17-05-2024]
పల్నాడులో ఘర్షణలకు కారణమైన పిన్నెల్లి సోదరుల్ని జైలుకు పంపి శాంతి, భద్రతలు కాపాడాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. -
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
అత్తెసరు బోధన.. అరణ్య రోదన..
[ 17-05-2024]
జిల్లాలో 17 చోట్ల హైస్కూల్ ప్లస్ టూ బాలికల జూనియర్ కళాశాలలను ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రారంభించింది. -
తలొగ్గారని తప్పించారు
[ 17-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా 14 సమస్యాత్మక నియోజకవర్గాలుంటే అందులో నాలుగు పల్నాడు జిల్లాలో ఉన్నాయంటేనే ఆలోచించాలి. -
ఎన్నికల రుసుముల్లో కోత!
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు (పీఓ, ఏపీఓ), అదర్ పోలింగ్ ఆఫీసర్ల(ఓపీఓ)కు చెల్లించే రెమ్యునరేషన్లోనూ కొందరు రిటర్నింగ్ అధికారులు కోత విధించారు. -
మిగ్జాంతోనైనా కళ్లు తెరవరా?
[ 17-05-2024]
మిగ్జాం తుపానుతో గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా పంట కాల్వల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో లక్షల ఎకరాల్లో చేతికందొచ్చిన పంట నీటిపాలైంది. -
టిప్పర్ డీజిల్ ట్యాంకు పగలడం వల్లే బస్సు దహనం
[ 17-05-2024]
చిలకలూరిపేట మండలం పసుమర్రు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి అగ్నిమాపక అధికారులు పరిశీలన చేశారు. -
మార్కెట్ల తరలింపు ఎప్పుడో..?
[ 17-05-2024]
నగరాభివృద్ధి, సదుపాయాల కల్పన విషయంలో గత అయిదేళ్లుగా వైకాపా పాలకులు పట్టించుకున్నది లేదు. -
సర్పంచులకు నిధులు, విధులు లేకుండా చేసిన ప్రభుత్వం
[ 17-05-2024]
కేంద్రం నుంచి విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులు రూ.998.84 కోట్లను పంచాయతీలకు జమ చేయాలని ఏపీ పంచాయతీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు కోరారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాటు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆర్వోలకు సూచించారు. -
సర్పంచి ఇంటిపై వైకాపా రౌడీమూక దాడి
[ 17-05-2024]
బెల్లంకొండ మండలంలో వైకాపా రౌడీ మూక ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. -
అద్దంకి నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలి
[ 17-05-2024]
అద్దంకి నియోజకవర్గంలో ఈ నెల 13న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం దక్కలేదని నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పాణెం హనిమిరెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. -
18 మందిపై కేసుల నమోదు
[ 17-05-2024]
వట్టిచెరుకూరు మండలంలోని కారంపూడిపాడులో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనలపై 15న గ్రామంలోని 18 మందిపై డిప్యూటీ తహసీల్దారు డి.వెంకటరావు కేసులు నమోదు చేశారు. -
అందరికీ థాంక్స్.. సినీ కుటుంబ సభ్యుల ప్రేమ కదిలించింది: పవన్ లేఖ
[ 17-05-2024]
ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ