logo

‘రైతుల పేరుతో వైకాపా నాయకులకే ట్రాక్టర్లు’

రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేశామని పైకి గొప్పలు చెప్పుకుంటూ.. వైకాపా నాయకులకు మాత్రమే ట్రాక్టర్లు పంపిణీ చేశారని తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు కళ్లం రాజశేఖరరెడ్డి విమర్శించారు.

Published : 06 Jun 2023 05:14 IST

మాట్లాడుతున్న కళ్లం రాజశేఖరరెడ్డి

పట్టాభిపురం(గుంటూరు): రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేశామని పైకి గొప్పలు చెప్పుకుంటూ.. వైకాపా నాయకులకు మాత్రమే ట్రాక్టర్లు పంపిణీ చేశారని తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు కళ్లం రాజశేఖరరెడ్డి విమర్శించారు. గుంటూరులోని తెదేపా జిల్లా కార్యాలయంలో తెలుగు రైతు కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ ‘జగన్‌ ఆర్భాటంగా రైతులకు ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేశామని హడావుడి చేశారు. నిజమైన రైతులకు వాటిని ఇవ్వలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సూచించిన వారి అనుచరులకు మాత్రమే ఇచ్చారు. ఏరువాక ప్రారంభమైనప్పటికీ రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నకిలీ విత్తనాల బారిన పడి అన్నదాతలు నష్టపోతున్నారు. విత్తన కంపెనీలపై ఉక్కుపాదం మోపి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయాలి. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించిన పరిహారం ఇప్పటి వరకు అందజేయలేదు’.. అని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో తెలుగు రైతు నాయకులు బొర్రు రామారావు, తాతిరెడ్డి లక్ష్మారెడ్డి, కుర్రి సుబ్బారెడ్డి, శంకరావు, సుబ్బారావు, సాంబశివరావు, వెంకటరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని