Palnadu: కళ్ల ముందే.. కనుపాప సజీవ దహనం
ఆ దంపతులకు వివాహమైన ఏడేళ్ల తరువాత కూతురు జన్మించింది. ఎన్నో ప్రార్థనల ఫలితంగా పుట్టిన ఒక్కగానొక్క బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు.
ఇంటికి నిప్పంటుకొని పసిబిడ్డ దుర్మరణం
కాపాడే ప్రయత్నంలో తల్లి, అమ్మమ్మకు గాయాలు
అచ్చంపేట మండలం పెదపాలెంలో విషాదం
పల్లవి (పాతచిత్రం)
ఆ దంపతులకు వివాహమైన ఏడేళ్ల తరువాత కూతురు జన్మించింది. ఎన్నో ప్రార్థనల ఫలితంగా పుట్టిన ఒక్కగానొక్క బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. కుమార్తె పుట్టిందన్న ఆనందం ఏడాదిలోనే ఆవిరైంది. వారుంటున్న ఇంటిని అగ్ని కీలలు చుట్టుముట్టడంతో ఏడాది వయసున్న ఆ పసిగుడ్డు మంటల్లో చిక్కుకొంది. ఆపదలో ఉన్న తన బిడ్డను కాపాడుకునేందుకు ఆ తల్లి సర్వశక్తులు ఒడ్డింది. కానీ కళ్ల ముందే పసికూన మంటల్లో సజీవ దహనమైంది. తల్లి పొత్తిళ్లలో ఆటాలాడాల్సిన చిన్నారి ముద్దలా మారడం చూసి కాలనీ వాసులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటన బుధవారం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పెదపాలెంలో చోటుచేసుకుంది.
గాయపడిన చిన్నారి అమ్మమ్మ మేరి
పెదపాలెం(అచ్చంపేట), న్యూస్టుడే: అచ్చంపేట మండలం పెదపాలెం ఎస్సీకాలనీకి చెందిన వెంకట్రావు, అదే కాలనీకి చెందిన అనితను వివాహం చేసుకున్నాడు. వీరికి వివాహమైన ఏడేళ్ల తర్వాత బిడ్డ జన్మించింది. ప్రసవం అనంతరం అనిత బిడ్డతోపాటు పుట్టింటిలో ఉంటోంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం కాలనీకి పడమర వైపున ఉన్న భూముల్లో ఎండిన పిచ్చి మొక్కలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఆ మంటలు వ్యాపించి సమీపంలోని కాలనీని చుట్టుముట్టాయి. అనిత ఉంటున్న ఇంటికి మంటలు అంటుకున్నాయి. దీంతో ఇంట్లోని సిలిండర్ పేలింది. ఆ ధాటికి ఊయలలో ఉన్న చిన్నారి పల్లవి(ఏడాది రెండు నెలల వయసు) మంచం మీద పడిపోయింది. మంటల్లో చిక్కుకొని ముద్దగా మారింది. బిడ్డను కాపాడే ప్రయత్నంలో అమ్మమ్మ మేరి, తల్లి అనిత మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఓవైపు ఎండ వేడిమి, మరోవైపు ఈదురుగాలుల కారణంగా మంటలు కాలనీని తాకినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 12 పూరిళ్లు, పాకలు, వసారాలు దెబ్బతిన్నాయి. 5 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. నిత్యావసరాలు, వంట పాత్రలు బూడిదయ్యాయి. అందరూ నిరాశ్రయులయ్యారు. మిగతా వారంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే రెండు అగ్నిమాపక యంత్రాలు గ్రామానికి చేరుకొని మంటలను అదుపుచేశాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్, సత్తెనపల్లి ఆర్డీవో బి.ఎల్.రాజకుమారి, తహసీల్దార్ సి.పద్మాదేవి సహాయక చర్యలు చేపట్టారు.
అగ్ని ప్రమాదంలో దగ్గమైన ఇల్లు
రోదిస్తున్న కుటుంబ సభ్యులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
[ 19-05-2024]
పోలింగ్ రోజు, ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక దాడులు, ఘర్షణలపై పల్నాడు జిల్లాలో సిట్ దర్యాప్తు రెండో రోజు కొనసాగుతోంది. -
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన దాడులు, ప్రతిదాడులకు సంబంధించి పోలీసులు పెద్దఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. అదనపు బలగాలు రావడంతో జిల్లా మొత్తం పోలీసులు అధీనంలోకి తీసుకోవడంతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. -
దేవుడి భూమి.. సమర్పయామి
[ 19-05-2024]
దేవుడికి సేవ చేయాల్సిన అర్చకులు ఆలయ భూమినే అమ్మేశారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని అమ్మేసి నిత్య కైంకర్యాలు నిలిపేశారు. వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు. -
పల్నాడును చూసైనా.. కళ్లు తెరవలేదు..
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్కు ముందు రోజు, ఎన్నిక రోజున పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనల్లో కూటమి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వైకాపా దాడులకు తెగబడటంతో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
క్షణక్షణం ఉత్కంఠ!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన, ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా పలు గ్రామాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. -
మద్యం దుకాణాలకు 144 సెక్షన్ వర్తించదా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన దాడులు, ఘర్షణల కారణంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా అయిదురోజులుగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పట్టణంలోని దుకాణాలను పూర్తిగా మూయిస్తున్నారు. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్
[ 19-05-2024]
పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్ నియమితులయ్యారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చెలరేగిన హింసను నియంత్రించడంలో విఫలమయ్యారన్న కారణంగా జిల్లా కలెక్టర్గా ఉన్న శివశంకర్ను ఎన్నికల కమిషన్ బదిలీ చేయగా ఎస్పీ బిందుమాధవ్పై సస్పెన్షన్ వేటు వేసింది. -
ఎట్టకేలకు కదిలిన అధికారులు
[ 19-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు అధికారులు కదిలారు. అక్రమ తవ్వకాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. -
ఉపాధ్యాయులకు బోధన మెలకువలపై శిక్షణ
[ 19-05-2024]
సీబీఎస్ఈ పాఠశాలల్లో పని చేస్తున్న ఆంగ్లం, సైన్స్(జీవశాస్త్రం), సోషల్ ఉపాధ్యాయులు.. తాము బోధించే పాఠ్యాంశాలపై పూర్తి అవగాహనతో ఉండాలని డీఈవో పి.శైలజ తెలిపారు. -
కరిగిన ఆశలు
[ 19-05-2024]
సాధారణంగా ఉప్పు పంటలకు ఎండలు అనుకూలం. ఉప్పు పంటను ఎండా కాలం పంటగా చెప్పాలి. ఎండల తీవ్రత బాగుంటే ఉప్పు దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం కురిసిన అకాల వర్షాలతో ఉప్పు రైతుకు తీరని నష్టం ఎదురైంది. -
ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులే లక్ష్యం
[ 19-05-2024]
మాతృభూమిపై మమకారంతో ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలు పడి ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులు సొంతూర్లకు వచ్చారు. -
మెట్ట ప్రాంతంలో తీరిన దాహం
[ 19-05-2024]
చుక్క నీటి కోసం విలవిల్లాడిన బొల్లాపల్లి మండలంలోని అయిదు గ్రామాలకు దాహం తీరింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో ఊరచెరువు వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. -
రైతులకు నికర ఆదాయమే లక్ష్యం
[ 19-05-2024]
కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించే కేంద్రాలుగా పని చేయడంతో పాటు నికర ఆదాయం సాధించేలా మార్గదర్శకం చేయాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి అటారి పదో జోన్ సంచాలకుడు డాక్టర్ షేక్ ఎన్.మీరా అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ అసంతృప్తి
-
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్