జగనన్నా.. ఎలా అడుగు పెట్టాలన్నా?
జిల్లాలో జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రెండున్నరేళ్లుగా అంతర్గత రహదారుల నిర్మాణ విషయాన్ని పట్టించుకోలేదు.
కాలనీల్లో తటాకాల్లా అంతర్గత రోడ్లు.. రాకపోకలకు నరకయాతన
మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం
ముంపు బారిన రేపల్లెలో జగనన్న కాలనీ
బాపట్ల, రేపల్లె అర్బన్ న్యూస్టుడే: జిల్లాలో జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రెండున్నరేళ్లుగా అంతర్గత రహదారుల నిర్మాణ విషయాన్ని పట్టించుకోలేదు. పేద లబ్ధిదారుల గొంతుపై కత్తి పెట్టి ఇళ్ల నిర్మాణం చేయాలని తీవ్ర ఒత్తిడి తెచ్చిన వైకాపా పాలకులు కనీస వసతుల కల్పనలో ఘోరంగా విఫలమయ్యారు. రోడ్ల నిర్మాణానికి రూ.70 కోట్లకుపైగా నిధులు కావాల్సి ఉండగా రూపాయి విడుదల చేయలేదు. మూడ్రోజులుగా కురిసిన వర్షాలకు జగనన్న కాలనీలు తటాకాల్లాగా మారిపోయాయి. మట్టి రోడ్లు చిత్తడిగా తయారై జగనన్న కాలనీల్లోకి పేదలు వెళ్లలేని దుస్థితి నెలకొని ఉంది. జిల్లా కేంద్రం బాపట్లలో నాలుగు జగనన్న కాలనీల్లో 3408 గృహాలు మంజూరు చేశారు. కాలనీల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి రూ.18 కోట్ల వరకు నిధులు కావాలి. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పురపాలక అధికారులు ప్రతిపాదనలు పంపించారు. నిధులు విడుదల కాలేదు. మైనింగ్ నిధి నుంచి కేటాయించాలని భావించినా నిబంధనల మేరకు సాధ్యపడలేదు. లబ్ధిదారులు నిర్మాణ సామాగ్రి తరలించడానికి తాత్కాలికంగా మట్టి రోడ్లు వేశారు.
* జిల్లాలో మొత్తం జగనన్న కాలనీలు: 298
* తొలి విడతలో మంజూరు చేసిన గృహాలు: 31,086
* పునాది దశలో ఉన్న ఇళ్లు: 10,850
* పునాది దశ దాటి గోడలు నిర్మించిన ఇళ్లు: 8067
* శ్లాబ్ దశలో ఉన్న ఇళ్లు: 1378
* శ్లాబ్ నిర్మించిన ఇళ్లు: 538
* నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లు: 9968
* నిర్మించని ఇళ్లు: 285
పేదలకు ఎన్ని కష్టాలో..
వ్యవసాయ భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు. లబ్ధిదారులు అప్పులు చేసి మెరకలు వేసుకొని ఇంటి నిర్మాణం చేపట్టారు. మూడ్రోజులుగా కురిసిన వర్షాలకు రహదారులన్నీ చిత్తడి, చిత్తడిగా మారాయి. అడుగు తీసి అడుగు వేయలేనంత దారుణంగా ఉన్నాయి. మురుగు కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో ఇళ్ల చుట్టూ రెండు నుంచి మూడు అడుగుల లోతున నీరు నిలిచింది. ఎక్కడికక్కడ ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇసుక, సిమెంటు, ఇటుక రాళ్లు తరలిస్తున్న వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. గుంతలు పడి బురదమయంగా మారిన రోడ్లలో నిర్మాణ సామాగ్రి తరలించడానికి ప్రైవేటు వాహనదారులు రావడం లేదు. జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు కనీస వసతులు కల్పించకపోవడంతో స్థానికంగా నివాసం ఉండలేకపోతున్నారు. నీరు నిల్వ ఉండి దుర్వాసన వస్తూ దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. రేపల్లె పట్టణంలోని జగన్న కాలనీ ముంపు బారినపడింది. అంతర్గత రహదారులు చిన్నపాటి చెరువులుగా కనిపిస్తున్నాయి.
పర్యటనలకే అధికారులు పరిమితం
డెల్టా ప్రాంతంలో అన్నిచోట్లా కాలనీల్లో నీరు నిలిచి సమస్య తీవ్రంగా ఉంది. కొల్లూరు, వేమూరు, అమృతలూరు, చుండూరు, భట్టిప్రోలు మండలాల్లో జగనన్న కాలనీల్లో కనీస వసతులు లేవు. లోతట్టు ప్రాంతాల్లో మెరకలు వేయకుండా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంపై లబ్ధిదారులు వైకాపా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగనన్న కాలనీల్లో కనీస వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలమైన వైకాపా ప్రభుత్వం ఆగస్టు 15లోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలంటూ పేదలపై అధికారుల ద్వారా తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది. అప్పులు తెచ్చి నిర్మించినా కాలనీల్లో ఉండలేని దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని వాపోతున్నారు. అంతర్గత రహదారులు, మురుగు కాలువలు నిర్మించనిదే నిర్మాణ పనులు ముందుకు సాగేలా లేవు. జిల్లా ఉన్నతాధికారులు జగనన్న కాలనీలు సందర్శించి హడావుడి చేసి వెళ్లిపోతున్నారని మౌలిక వసతుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని లబ్ధిదారుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. డెల్టా ప్రాంతంలో పూర్తిగా వర్షాకాలం ముగిసే వరకు(డిసెంబరు) ఇళ్ల నిర్మాణ పనులు సాగే పరిస్థితి కనిపించడం లేదు.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం
జగనన్న కాలనీల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు విడుదల కాగానే రోడ్ల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపడతాం.
రంజిత్బాషా, కలెక్టర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
[ 17-05-2024]
పల్నాడులో ఘర్షణలకు కారణమైన పిన్నెల్లి సోదరుల్ని జైలుకు పంపి శాంతి, భద్రతలు కాపాడాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. -
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
అత్తెసరు బోధన.. అరణ్య రోదన..
[ 17-05-2024]
జిల్లాలో 17 చోట్ల హైస్కూల్ ప్లస్ టూ బాలికల జూనియర్ కళాశాలలను ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రారంభించింది. -
తలొగ్గారని తప్పించారు
[ 17-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా 14 సమస్యాత్మక నియోజకవర్గాలుంటే అందులో నాలుగు పల్నాడు జిల్లాలో ఉన్నాయంటేనే ఆలోచించాలి. -
ఎన్నికల రుసుముల్లో కోత!
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు (పీఓ, ఏపీఓ), అదర్ పోలింగ్ ఆఫీసర్ల(ఓపీఓ)కు చెల్లించే రెమ్యునరేషన్లోనూ కొందరు రిటర్నింగ్ అధికారులు కోత విధించారు. -
మిగ్జాంతోనైనా కళ్లు తెరవరా?
[ 17-05-2024]
మిగ్జాం తుపానుతో గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా పంట కాల్వల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో లక్షల ఎకరాల్లో చేతికందొచ్చిన పంట నీటిపాలైంది. -
టిప్పర్ డీజిల్ ట్యాంకు పగలడం వల్లే బస్సు దహనం
[ 17-05-2024]
చిలకలూరిపేట మండలం పసుమర్రు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి అగ్నిమాపక అధికారులు పరిశీలన చేశారు. -
మార్కెట్ల తరలింపు ఎప్పుడో..?
[ 17-05-2024]
నగరాభివృద్ధి, సదుపాయాల కల్పన విషయంలో గత అయిదేళ్లుగా వైకాపా పాలకులు పట్టించుకున్నది లేదు. -
సర్పంచులకు నిధులు, విధులు లేకుండా చేసిన ప్రభుత్వం
[ 17-05-2024]
కేంద్రం నుంచి విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులు రూ.998.84 కోట్లను పంచాయతీలకు జమ చేయాలని ఏపీ పంచాయతీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు కోరారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాటు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆర్వోలకు సూచించారు. -
సర్పంచి ఇంటిపై వైకాపా రౌడీమూక దాడి
[ 17-05-2024]
బెల్లంకొండ మండలంలో వైకాపా రౌడీ మూక ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. -
అద్దంకి నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలి
[ 17-05-2024]
అద్దంకి నియోజకవర్గంలో ఈ నెల 13న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం దక్కలేదని నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పాణెం హనిమిరెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. -
18 మందిపై కేసుల నమోదు
[ 17-05-2024]
వట్టిచెరుకూరు మండలంలోని కారంపూడిపాడులో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనలపై 15న గ్రామంలోని 18 మందిపై డిప్యూటీ తహసీల్దారు డి.వెంకటరావు కేసులు నమోదు చేశారు. -
అందరికీ థాంక్స్.. సినీ కుటుంబ సభ్యుల ప్రేమ కదిలించింది: పవన్ లేఖ
[ 17-05-2024]
ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ