Fishing: కరెంటుతో చేపల వేట!
పల్నాడు జిల్లాలో మాచవరం మండలం మారుమూల ప్రాంతం. ఇక్కడ అక్రమాలకు అడ్డులేకుండా పోతోంది.
కృష్ణానదిలో మత్స్యసంపదకు తీరని నష్టం
అధికార పార్టీ నాయకులపై ఆరోపణలు
చేపలను వేటాడుతున్న ప్రాంతమిదే..
మాచవరం, న్యూస్టుడే: పల్నాడు జిల్లాలో మాచవరం మండలం మారుమూల ప్రాంతం. ఇక్కడ అక్రమాలకు అడ్డులేకుండా పోతోంది. తెలంగాణ మద్యం నుంచి జూదం, మట్టి అక్రమ రవాణా, గంజాయి, గుట్కా, రేషన్ బియ్యం తరలింపు వంటి కార్యకలాపాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేరు. లాభం వచ్చే ఏపనైనా అక్రమార్కులు వదలిపెట్టడం లేదు. తాజాగా గోవిందాపురం రేవు సమీపంలోని కృష్ణానదిలో విద్యుత్తు ప్రసరింపజేసి చేపలతోపాటు వాటి పిల్లలను చంపేస్తున్నట్లు వెలుగుచూసింది. ఏడాది నుంచి ఈ తంతు జరుగుతున్నా ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. అధికార పార్టీ నేతలు, స్థానిక యంత్రాంగానికి తెలిసే ఇదంతా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోవిందాపురం పడవల రేవు సమీపంలో విద్యుత్తు ద్వారా చేపలను పట్టుకునే కొత్త పద్ధతికి కొందరు శ్రీకారం చుట్టారు. సంప్రదాయ పద్ధతిలో పట్టుకుంటే చేపలు చిక్కవని, ఈవిధమైన అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. రేవు సమీపంలో నివసించే ఓ వ్యక్తి ఆధ్వర్యంలో ఒడిశా నుంచి వచ్చిన కొందరు ఛార్జింగ్ బ్యాటరీలు, విద్యుత్తు పరికరాలతో రాత్రివేళ నదిలో వేటకు వెళుతున్నారు. విద్యుత్తు పరికరాన్ని నీటిలో వేయగా, ఆ పరిధిలోని పెద్ద చేపలతోపాటు పిల్లలు చనిపోతున్నాయి. నీటిపై తేలాడిన వెంటనే వాటిని పట్టుకుని పడవలో వేస్తున్నారు. అనంతరం ఒడ్డుకు చేర్చి, తెల్లవారాక ప్రత్యేక వాహనంలో మార్కెట్కు తరలిస్తున్నారు. ఈ వ్యవహారం ఏడాది నుంచి జరుగుతున్నా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. స్థానిక జాలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా, చేపలు పట్టేవారు లెక్కచేయడం లేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, నదిలో మత్య్స సంపద ఆవిరి అవుతుందని జాలర్లు వాపోతున్నారు. దీనివెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వైపు రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం చేప పిల్లలను నీటిలో విడుదల చేస్తున్నా ఆశించిన ప్రయోజనం కలగడంలేదు. నదిలో అక్రమంగా చేపల వేట సాగించే వారిపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. దీనిపై మత్స్యశాఖ సహాయ పర్యవేక్షకుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ విషయం తమ దృష్టికి వచ్చిందని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
[ 19-05-2024]
పోలింగ్ రోజు, ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక దాడులు, ఘర్షణలపై పల్నాడు జిల్లాలో సిట్ దర్యాప్తు రెండో రోజు కొనసాగుతోంది. -
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన దాడులు, ప్రతిదాడులకు సంబంధించి పోలీసులు పెద్దఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. అదనపు బలగాలు రావడంతో జిల్లా మొత్తం పోలీసులు అధీనంలోకి తీసుకోవడంతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. -
దేవుడి భూమి.. సమర్పయామి
[ 19-05-2024]
దేవుడికి సేవ చేయాల్సిన అర్చకులు ఆలయ భూమినే అమ్మేశారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని అమ్మేసి నిత్య కైంకర్యాలు నిలిపేశారు. వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు. -
పల్నాడును చూసైనా.. కళ్లు తెరవలేదు..
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్కు ముందు రోజు, ఎన్నిక రోజున పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనల్లో కూటమి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వైకాపా దాడులకు తెగబడటంతో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
క్షణక్షణం ఉత్కంఠ!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన, ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా పలు గ్రామాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. -
మద్యం దుకాణాలకు 144 సెక్షన్ వర్తించదా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన దాడులు, ఘర్షణల కారణంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా అయిదురోజులుగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పట్టణంలోని దుకాణాలను పూర్తిగా మూయిస్తున్నారు. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్
[ 19-05-2024]
పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్ నియమితులయ్యారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చెలరేగిన హింసను నియంత్రించడంలో విఫలమయ్యారన్న కారణంగా జిల్లా కలెక్టర్గా ఉన్న శివశంకర్ను ఎన్నికల కమిషన్ బదిలీ చేయగా ఎస్పీ బిందుమాధవ్పై సస్పెన్షన్ వేటు వేసింది. -
ఎట్టకేలకు కదిలిన అధికారులు
[ 19-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు అధికారులు కదిలారు. అక్రమ తవ్వకాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. -
ఉపాధ్యాయులకు బోధన మెలకువలపై శిక్షణ
[ 19-05-2024]
సీబీఎస్ఈ పాఠశాలల్లో పని చేస్తున్న ఆంగ్లం, సైన్స్(జీవశాస్త్రం), సోషల్ ఉపాధ్యాయులు.. తాము బోధించే పాఠ్యాంశాలపై పూర్తి అవగాహనతో ఉండాలని డీఈవో పి.శైలజ తెలిపారు. -
కరిగిన ఆశలు
[ 19-05-2024]
సాధారణంగా ఉప్పు పంటలకు ఎండలు అనుకూలం. ఉప్పు పంటను ఎండా కాలం పంటగా చెప్పాలి. ఎండల తీవ్రత బాగుంటే ఉప్పు దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం కురిసిన అకాల వర్షాలతో ఉప్పు రైతుకు తీరని నష్టం ఎదురైంది. -
ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులే లక్ష్యం
[ 19-05-2024]
మాతృభూమిపై మమకారంతో ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలు పడి ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులు సొంతూర్లకు వచ్చారు. -
మెట్ట ప్రాంతంలో తీరిన దాహం
[ 19-05-2024]
చుక్క నీటి కోసం విలవిల్లాడిన బొల్లాపల్లి మండలంలోని అయిదు గ్రామాలకు దాహం తీరింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో ఊరచెరువు వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. -
రైతులకు నికర ఆదాయమే లక్ష్యం
[ 19-05-2024]
కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించే కేంద్రాలుగా పని చేయడంతో పాటు నికర ఆదాయం సాధించేలా మార్గదర్శకం చేయాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి అటారి పదో జోన్ సంచాలకుడు డాక్టర్ షేక్ ఎన్.మీరా అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ అసంతృప్తి
-
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్