కలలు.. కల్లలయ్యాయి.. యువకుడి ప్రాణం తోడేసిన చిన్నగాయం
ఉన్నత విద్యావంతుడైన కుమారుడిని అత్యున్నత ఉద్యోగంలో చూడాలని ఆ ఉపాధ్యాయ దంపతులు కన్న కలలు కల్లలయ్యాయి. ఒక్కగానొక్క కుమారుడిని అల్లారుముద్దుగా పెంచుకుంటూ అతడే సర్వస్వంగా జీవిస్తున్న ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది.
బ్రెయిన్ డెడ్తో యువకుడి మృతి
ఉపాధ్యాయ కుటుంబంలో తీరని విషాదం
నిఖిల్ చక్రవర్తి (పాతచిత్రం)
సత్తెనపల్లి, న్యూస్టుడే: ఉన్నత విద్యావంతుడైన కుమారుడిని అత్యున్నత ఉద్యోగంలో చూడాలని ఆ ఉపాధ్యాయ దంపతులు కన్న కలలు కల్లలయ్యాయి. ఒక్కగానొక్క కుమారుడిని అల్లారుముద్దుగా పెంచుకుంటూ అతడే సర్వస్వంగా జీవిస్తున్న ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. సివిల్స్కు సిద్ధమవుతూ తండ్రికి స్వల్ప అనారోగ్య సమస్య రావడంతో దిల్లీ నుంచి వచ్చి ఆయన కోలుకునేలా చేసిన యువకుడు ఊహించని రీతిలో బ్రెయిన్ డెడ్తో మృత్యువాతపడ్డాడు. సేకరించిన వివరాల మేరకు..
సత్తెనపల్లి పట్టణంలోని మూడోవార్డు భీమవరం రోడ్డులో ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు బంకా వాసుబాబు, నాగమణి నివాసముంటున్నారు. వాసుబాబు అచ్చంపేట మండలంలోని వేల్పూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం. నాగమణి సత్తెనపల్లి మండలంలోని అబ్బూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం కాగా ఒక్కగానొక్క కుమారుడైన నిఖిల్ చక్రవర్తి (28) అలియాస్ పండును ఉన్నత స్థాయిలో చూడాలని ఆశపడ్డారు. నిఖిల్ బీటెక్ పూర్తిచేసి సివిల్స్పై దృష్టి సారించాడు. దిల్లీలో ఉంటూ సివిల్స్ శిక్షణ పొందేవాడు. ఒకసారి ప్రిలిమినరీ పరీక్ష కూడా ఉత్తీర్ణుడయ్యాడు. ఈసారి కచ్చితంగా సివిల్స్లో సత్తా చాటుతాననే ధీమాతో ఉన్నాడు. నెల క్రితం తండ్రికి అనారోగ్య సమస్య రావడంతో ఇంటికి వచ్చాడు. ఆసుపత్రిలో తండ్రి వెంట ఉంటూ సపర్యలు చేశాడు. తండ్రి ఆరోగ్యవంతుడు కావడంతో త్వరలోనే దిల్లీ వెళ్లాలని సిద్ధమవుతున్నాడు.
20 రోజుల క్రితం రైల్వేస్టేషన్ రోడ్డులో ద్విచక్ర వాహనం నడుపుతూ నిఖిల్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. చేతులకు, కాలికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లాడు. చిన్న ప్రమాదనుకుని దాన్ని అశ్రద్ధ చేశాడు. ఈ నెల 11న స్నేహితులతో కలసి ఎడ్యుకేట్ ది సొసైటీ సేవాసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వృద్ధులకు పండ్లు, రొట్టెల పంపిణీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. కళ్లు మసకగా కనిపిస్తుండటంతో 12న సత్తెనపల్లి మండలంలోని ధూళిపాళ్ల ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి ఒక్కడే వెళ్లాడు. అక్కడ పరీక్షలు చేయించుకుని బయటకు వస్తుండగా కళ్లు తిరిగి పడిపోయాడు. ఆసుపత్రి బాధ్యులు అంబులెన్సులో అతడిని సత్తెనపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు వెంటనే చేరుకుని మెరుగైన చికిత్స అవసరంగా వైద్యుడు చెప్పగా గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రెండ్రోజులపాటు వైద్యానికి సహకరించిన నిఖిల్ మెదడు తర్వాత పని చేయడం ఆగిపోయింది.
కాలికి అయిన గాయంతో రక్తం గడ్డకట్టి క్రమంగా శరీరంలోని అవయవాలన్నింటినీ దెబ్బతీస్తూ మెదడు పనితీరును ఆగిపోయేలా చేసిందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు ఎలాగైనా తమ కుమారుడిని కాపాడాలని వైద్యుల్ని ప్రాధేయపడ్డారు. నిఖిల్ను సాధారణ మనిషిగా చేయాలని వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో అతడు మృతి చెందినట్లు శనివారం నిర్ధారించారు. దీంతో కన్నవారు ఒక్కసారిగా కూలిపోయారు. మా అబ్బాయి బంగారమయ్యా.. చీమకు కూడా హాని చేయని వాడిని ఇలా చేశావేంటయ్యా.. చేతికంది వచ్చిన కుమారుడు చేజారడయ్యా అంటూ వారు రోదిస్తున్న తీరు చూపరుల హృదయాలను కలచివేసింది. నిఖిల్ సోదరి మేరి ఆమెరికాలో పీజీ చదువుతున్నారు. అన్న మరణవార్తను తెలుసుకుని ఆమె స్వదేశానికి వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. శాసనమండలి సభ్యురాలు కల్పలతారెడ్డి, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఎంఈవో శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సంఘాల నేతలు నిఖిల్ మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
[ 19-05-2024]
పోలింగ్ రోజు, ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక దాడులు, ఘర్షణలపై పల్నాడు జిల్లాలో సిట్ దర్యాప్తు రెండో రోజు కొనసాగుతోంది. -
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన దాడులు, ప్రతిదాడులకు సంబంధించి పోలీసులు పెద్దఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. అదనపు బలగాలు రావడంతో జిల్లా మొత్తం పోలీసులు అధీనంలోకి తీసుకోవడంతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. -
దేవుడి భూమి.. సమర్పయామి
[ 19-05-2024]
దేవుడికి సేవ చేయాల్సిన అర్చకులు ఆలయ భూమినే అమ్మేశారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని అమ్మేసి నిత్య కైంకర్యాలు నిలిపేశారు. వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు. -
పల్నాడును చూసైనా.. కళ్లు తెరవలేదు..
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్కు ముందు రోజు, ఎన్నిక రోజున పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనల్లో కూటమి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వైకాపా దాడులకు తెగబడటంతో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
క్షణక్షణం ఉత్కంఠ!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన, ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా పలు గ్రామాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. -
మద్యం దుకాణాలకు 144 సెక్షన్ వర్తించదా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన దాడులు, ఘర్షణల కారణంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా అయిదురోజులుగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పట్టణంలోని దుకాణాలను పూర్తిగా మూయిస్తున్నారు. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్
[ 19-05-2024]
పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్ నియమితులయ్యారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చెలరేగిన హింసను నియంత్రించడంలో విఫలమయ్యారన్న కారణంగా జిల్లా కలెక్టర్గా ఉన్న శివశంకర్ను ఎన్నికల కమిషన్ బదిలీ చేయగా ఎస్పీ బిందుమాధవ్పై సస్పెన్షన్ వేటు వేసింది. -
ఎట్టకేలకు కదిలిన అధికారులు
[ 19-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు అధికారులు కదిలారు. అక్రమ తవ్వకాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. -
ఉపాధ్యాయులకు బోధన మెలకువలపై శిక్షణ
[ 19-05-2024]
సీబీఎస్ఈ పాఠశాలల్లో పని చేస్తున్న ఆంగ్లం, సైన్స్(జీవశాస్త్రం), సోషల్ ఉపాధ్యాయులు.. తాము బోధించే పాఠ్యాంశాలపై పూర్తి అవగాహనతో ఉండాలని డీఈవో పి.శైలజ తెలిపారు. -
కరిగిన ఆశలు
[ 19-05-2024]
సాధారణంగా ఉప్పు పంటలకు ఎండలు అనుకూలం. ఉప్పు పంటను ఎండా కాలం పంటగా చెప్పాలి. ఎండల తీవ్రత బాగుంటే ఉప్పు దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం కురిసిన అకాల వర్షాలతో ఉప్పు రైతుకు తీరని నష్టం ఎదురైంది. -
ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులే లక్ష్యం
[ 19-05-2024]
మాతృభూమిపై మమకారంతో ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలు పడి ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులు సొంతూర్లకు వచ్చారు. -
మెట్ట ప్రాంతంలో తీరిన దాహం
[ 19-05-2024]
చుక్క నీటి కోసం విలవిల్లాడిన బొల్లాపల్లి మండలంలోని అయిదు గ్రామాలకు దాహం తీరింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో ఊరచెరువు వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. -
రైతులకు నికర ఆదాయమే లక్ష్యం
[ 19-05-2024]
కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించే కేంద్రాలుగా పని చేయడంతో పాటు నికర ఆదాయం సాధించేలా మార్గదర్శకం చేయాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి అటారి పదో జోన్ సంచాలకుడు డాక్టర్ షేక్ ఎన్.మీరా అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు