Kidnap: ప్రేమికుడితో కలిసి స్థిరపడేందుకు డబ్బు కోసం కుట్ర.. అన్నను కిడ్నాప్ చేయించిన చెల్లి
ప్రేమించిన యువకుడితో సంతోషంగా జీవించేందుకు పెద్దమొత్తంలో డబ్బు అవసరమని భావించిన ఓ చెల్లెలు.. అన్నను కిడ్నాప్ చేయించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కరడుగట్టిన కిడ్నాప్ గ్యాంగ్తో చేతులు కలిపి రూ.2కోట్లు డిమాండ్ చేయించింది. తనకేమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదుచేసింది.
కరడుగట్టిన కిడ్నాపర్ల గ్యాంగ్తో కలిసి పథకం
సోదరి, ఆమె ప్రియుడు సహా ముగ్గురి అరెస్టు
ఈనాడు, హైదరాబాద్-రాయదుర్గం, న్యూస్టుడే: ప్రేమించిన యువకుడితో సంతోషంగా జీవించేందుకు పెద్దమొత్తంలో డబ్బు అవసరమని భావించిన ఓ చెల్లెలు.. అన్నను కిడ్నాప్ చేయించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కరడుగట్టిన కిడ్నాప్ గ్యాంగ్తో చేతులు కలిపి రూ.2కోట్లు డిమాండ్ చేయించింది. తనకేమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదుచేసింది. చివరకు కథ అడ్డం తిరిగి కటకటాలపాలైంది. నగరంలో కలకలం రేపిన ప్రైవేటు ఉద్యోగి సురేందర్ కేసును రాయదుర్గం పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ సూత్రధారి.. బాధితుడి సోదరి నిఖిత, ఆమె ప్రియుడు బల్లిపార వెంకటకృష్ణ సహా కిడ్నాపర్లు మరో ముగ్గుర్ని ఆదివారం అరెస్టుచేసి రిమాండుకు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. రాయదుర్గం, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్లు మహేశ్, జేమ్స్బాబు, మాదాపూర్ ఏసీపీ శ్రీనివాస్, అదనపు డీసీపీ నరసింహారెడ్డితో కలిసి డీసీపీ శ్రీనివాస్రావు ఆదివారం గచ్చిబౌలిలో కేసు వివరాలు వెల్లడించారు.
డబ్బు కోసం అన్న పేరు..!
మాచర్లకు చెందిన గుర్రం నిఖిత గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో పనిచేస్తోంది. అక్కడే పనిచేస్తున్న కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన బల్లిపార వెంకటకృష్ణతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గచ్చిబౌలిలో ఉండే వెంకటకృష్ణపై గతంలో వ్యభిచారం, డ్రగ్స్ కేసులున్నాయి. వెంకటకృష్ణ జైల్లో ఉన్న సమయంలో కరడుగట్టిన నేరగాడు, కిడ్నాపర్ అత్తాపూర్కు చెందిన గుంజపోగు సురేశ్ అలియాస్ సూర్య(31)తో పరిచయమేర్పడింది. తమ గ్యాంగ్ కిడ్నాప్లు చేస్తుందని ఎప్పుడైనా అవసరముంటే చెప్పాలని సురేశ్.. వెంకటకృష్ణకు చెప్పాడు. గత అక్టోబరులో వెంకటకృష్ణ.. తాను పనిచేసే సంస్థ ఎండీ శివశంకరబాబును సురేశ్ గ్యాంగ్తో కిడ్నాప్ చేయించాడు. అతని కుటుంబసభ్యుల నుంచి రూ.2లక్షలు వసూలు చేసి వదిలేశారు. డిసెంబరులో సురేశ్ తనకు డబ్బు అవసరముందని కిడ్నాప్ పని ఉంటే చెప్పాలని వెంకటకృష్ణ, నిఖితను సంప్రదించాడు. పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలనే ఆలోచనలో ఉన్న వెంకటకృష్ణ, నిఖిత బాగా డబ్బున్న వ్యక్తిని కిడ్నాప్ చేయిస్తే లాభం ఉంటుందని ఆశపడ్డారు. తన సొంత పెదనాన్న కుమారుడు, ప్రైవేటు సంస్థలో ఇంజినీరుగా పనిచేసే సురేంద్రను కిడ్నాప్ చేయాలని సూచించింది. సురేంద్రకు ఏటా రూ.కోటి జీతం వస్తుందని, ఆయన భార్య ఐటీ ఉద్యోగిని అని చెప్పింది. దీంతో సురేంద్రను కిడ్నాప్ చేయాలని పథకం వేశారు.
వేధిస్తున్నాడని పిలిపించి కిడ్నాప్..
పథకం ప్రకారం నిఖిత తన అన్న సురేంద్ర ఇల్లు, ఇతర వివరాలన్నీ కిడ్నాపర్లకు ఇచ్చింది. సురేశ్ గ్యాంగ్ సురేంద్ర ఇంటి దగ్గర రెక్కీ చేసినా కుదరలేదు. అతన్ని బయటకు తీసుకొస్తే పని తేలికవుతుందని నిఖితకు చెప్పాడు. ఈనెల 4న నిఖిత.. సురేంద్రకు ఫోన్ చేసి ఆఫీసులో ఒకరు వేధిస్తున్నారని ఖాజాగూడ చెరువు దగ్గరకు రావాలని చెప్పింది. సురేంద్ర అక్కడికి వెళ్లి నిఖితతో మాట్లాడుతుండగా అప్పటికే కారులో సురేశ్, మెహిదీపట్నంకు చెందిన రామగల్ల రాజు అలియాస్ లడ్డు, శిందే రోహిత్, చందు, వెంకట్ ఎదురుచూస్తున్నారు. ఒక్కసారిగా సురేంద్రను కారులో ఎక్కించుకుని పరారయ్యారు. ఇది గమనించిన అక్కడున్న ఇద్దరు డయల్ 100కు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకోగా నిఖిత తన కళ్ల ముందే జరిగినట్లు చెప్పారు. అప్పుడు నిఖిత ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేసింది.
ఎప్పటికప్పుడు కిడ్నాపర్లతో టచ్..!
సురేంద్రను తీసుకెళ్లిన నిందితులు ఆయన భార్యకు ఫోన్ చేసి రూ.2కోట్లు డిమాండ్ చేశారు. నిందితులు కడ్తాల్కు చేరుకున్నాక కారు బ్రేక్డౌన్ అయ్యింది. నిందితులు సురేంద్రతో భార్యకు వాయిస్ మెసేజ్ పంపించి ఇంకో కారు పంపాలని చెప్పించారు. పథకం ప్రకారం తెలివిగా వెంకటకృష్ణ, నిఖిత ఇద్దరూ కారు తీసుకెళ్లి కడ్తాల్లో కిడ్నాపర్లకు అప్పగించారు. అనంతరం ఇద్దరూ కోళ్లు తరలించే వాహనంలో అర్ధరాత్రి హైదరాబాద్ తిరిగొచ్చారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు అడ్డుకోవడంతో కిడ్నాపర్లలో ఒకడైన రోహిత్, బాధితుడు సురేంద్ర దొరికారు. మిగిలిన ముగ్గురు సురేశ్, రాజు, వెంకట్ పరారయ్యారు. సురేంద్ర చెప్పిన వివరాలు, సాంకేతిక ఆధారాలతో రాయదుర్గం పోలీసులు సురేశ్, వెంకటకృష్ణ, రాజు, నిఖితను అదుపులోకి తీసుకున్నారు. కారు వదిలిపోయిన తర్వాత నిందితుడు సురేశ్.. తనకు రూ.20లక్షలు పంపాలని బాధితుడి భార్యకు సందేశం పంపినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
[ 19-05-2024]
పోలింగ్ రోజు, ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక దాడులు, ఘర్షణలపై పల్నాడు జిల్లాలో సిట్ దర్యాప్తు రెండో రోజు కొనసాగుతోంది. -
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన దాడులు, ప్రతిదాడులకు సంబంధించి పోలీసులు పెద్దఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. అదనపు బలగాలు రావడంతో జిల్లా మొత్తం పోలీసులు అధీనంలోకి తీసుకోవడంతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. -
దేవుడి భూమి.. సమర్పయామి
[ 19-05-2024]
దేవుడికి సేవ చేయాల్సిన అర్చకులు ఆలయ భూమినే అమ్మేశారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని అమ్మేసి నిత్య కైంకర్యాలు నిలిపేశారు. వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు. -
పల్నాడును చూసైనా.. కళ్లు తెరవలేదు..
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్కు ముందు రోజు, ఎన్నిక రోజున పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనల్లో కూటమి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వైకాపా దాడులకు తెగబడటంతో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
క్షణక్షణం ఉత్కంఠ!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన, ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా పలు గ్రామాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. -
మద్యం దుకాణాలకు 144 సెక్షన్ వర్తించదా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన దాడులు, ఘర్షణల కారణంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా అయిదురోజులుగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పట్టణంలోని దుకాణాలను పూర్తిగా మూయిస్తున్నారు. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్
[ 19-05-2024]
పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్ నియమితులయ్యారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చెలరేగిన హింసను నియంత్రించడంలో విఫలమయ్యారన్న కారణంగా జిల్లా కలెక్టర్గా ఉన్న శివశంకర్ను ఎన్నికల కమిషన్ బదిలీ చేయగా ఎస్పీ బిందుమాధవ్పై సస్పెన్షన్ వేటు వేసింది. -
ఎట్టకేలకు కదిలిన అధికారులు
[ 19-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు అధికారులు కదిలారు. అక్రమ తవ్వకాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. -
ఉపాధ్యాయులకు బోధన మెలకువలపై శిక్షణ
[ 19-05-2024]
సీబీఎస్ఈ పాఠశాలల్లో పని చేస్తున్న ఆంగ్లం, సైన్స్(జీవశాస్త్రం), సోషల్ ఉపాధ్యాయులు.. తాము బోధించే పాఠ్యాంశాలపై పూర్తి అవగాహనతో ఉండాలని డీఈవో పి.శైలజ తెలిపారు. -
కరిగిన ఆశలు
[ 19-05-2024]
సాధారణంగా ఉప్పు పంటలకు ఎండలు అనుకూలం. ఉప్పు పంటను ఎండా కాలం పంటగా చెప్పాలి. ఎండల తీవ్రత బాగుంటే ఉప్పు దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం కురిసిన అకాల వర్షాలతో ఉప్పు రైతుకు తీరని నష్టం ఎదురైంది. -
ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులే లక్ష్యం
[ 19-05-2024]
మాతృభూమిపై మమకారంతో ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలు పడి ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులు సొంతూర్లకు వచ్చారు. -
మెట్ట ప్రాంతంలో తీరిన దాహం
[ 19-05-2024]
చుక్క నీటి కోసం విలవిల్లాడిన బొల్లాపల్లి మండలంలోని అయిదు గ్రామాలకు దాహం తీరింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో ఊరచెరువు వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. -
రైతులకు నికర ఆదాయమే లక్ష్యం
[ 19-05-2024]
కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించే కేంద్రాలుగా పని చేయడంతో పాటు నికర ఆదాయం సాధించేలా మార్గదర్శకం చేయాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి అటారి పదో జోన్ సంచాలకుడు డాక్టర్ షేక్ ఎన్.మీరా అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు