ఎంతపని చేశావు తల్లీ!.. భర్తపై కోపంతో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి..
తనతో భర్త గొడవ పడటాన్ని జీర్జించుకోలేకపోయిన ఆ మహిళ.. టీలో ఎలుకల మందు కలిపి భర్తతోపాటు పిల్లలకు ఇచ్చి, తానూ తాగింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతోపాటు ఆమె మృత్యువాత పడగా.. భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మాచర్లలో మూడు రోజుల వ్యవధిలో నలుగురి మృతి
వసంత (పాత చిత్రం)
మాచర్ల గ్రామీణ, న్యూస్టుడే: తనతో భర్త గొడవ పడటాన్ని జీర్జించుకోలేకపోయిన ఆ మహిళ.. టీలో ఎలుకల మందు కలిపి భర్తతోపాటు పిల్లలకు ఇచ్చి, తానూ తాగింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతోపాటు ఆమె మృత్యువాత పడగా.. భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలం నారాయణరెడ్డిపురంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నారాయణరెడ్డిపురం గ్రామానికి చెందిన రమావత్ రవినాయక్ తన అక్క కూతురైన వసంతను 14 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నారు. వీరికి భానుప్రకాశ్ (12), కార్తీక్ప్రకాశ్ (7), కవలలు ఈశ్వర్, ఉమేశ్వర్ (రెండున్నరేళ్లు) సంతానం. రవినాయక్ హైదరాబాద్లో ఆటో నడుపుతూ వారానికోసారి స్వగ్రామానికి వచ్చి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి అప్పులు అధికమయ్యాయి. దీంతో వసంతకు పుట్టింటివారు ఇచ్చిన ఒకటిన్నర ఎకరాల పొలం అమ్మి అప్పులు తీరుద్దామని భార్యకు రవినాయక్ చెప్పారు. అందుకు ఆమె ససేమిరా అనడంతో తరచూ వారి మధ్య గొడవలు జరిగేవి. ఇదే విషయాన్ని రవినాయక్ తన అక్క సరస్వతికి చెప్పగా స్థలం విక్రయించేందుకు ఆమె కూడా అంగీకరించలేదు.
ఈ క్రమంలోనే ఈ నెల 4న (ఆదివారం) ఉదయం భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన వసంత భర్తతోపాటు ముగ్గురు పిల్లలకు టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది. కొంచెం టీ తాగిన తర్వాత చేదుగా ఉందంటూ భర్త కింద పడేశారు. ఆ సమయంలో రెండో కుమారుడు కార్తీక్ ప్రకాశ్ తాతగారి ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత పిల్లలతో కలిసి పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం తర్వాత పిల్లలకు వాంతులు కావడంతో వెంటనే మాచర్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికీ టీలో విషం కలిపిన విషయం ఆమె చెప్పలేదు. పిల్లల పరిస్థితి విషమంగా మారడంతో ప్రైవేటు వైద్యుడి సూచనతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో తాను టీలో ఎలుకల మందు కలిపి తాగించానని ఆమె చెప్పడంతో అక్కడి సిబ్బంది సంబంధిత చికిత్స ఆరంభించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేట ఆసుపత్రికి పిల్లలను తరలిస్తుండగా.. మార్గమధ్యలో ఈశ్వర్ మృతి చెందాడు. సోమవారం పిల్లలిద్దరినీ హైదరాబాద్ తీసుకెళుతుండగా మార్గమధ్యలో భానుప్రకాశ్ చనిపోయాడు. మంగళవారం గుంటూరు ఆసుపత్రిలో తల్లి వసంత, హైదరాబాద్లో కుమారుడు ఉమేశ్వర్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం రవినాయక్ గుంటూరులో చికిత్స పొందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
[ 19-05-2024]
పోలింగ్ రోజు, ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక దాడులు, ఘర్షణలపై పల్నాడు జిల్లాలో సిట్ దర్యాప్తు రెండో రోజు కొనసాగుతోంది. -
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన దాడులు, ప్రతిదాడులకు సంబంధించి పోలీసులు పెద్దఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. అదనపు బలగాలు రావడంతో జిల్లా మొత్తం పోలీసులు అధీనంలోకి తీసుకోవడంతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. -
దేవుడి భూమి.. సమర్పయామి
[ 19-05-2024]
దేవుడికి సేవ చేయాల్సిన అర్చకులు ఆలయ భూమినే అమ్మేశారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని అమ్మేసి నిత్య కైంకర్యాలు నిలిపేశారు. వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు. -
పల్నాడును చూసైనా.. కళ్లు తెరవలేదు..
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్కు ముందు రోజు, ఎన్నిక రోజున పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనల్లో కూటమి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వైకాపా దాడులకు తెగబడటంతో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
క్షణక్షణం ఉత్కంఠ!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన, ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా పలు గ్రామాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. -
మద్యం దుకాణాలకు 144 సెక్షన్ వర్తించదా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన దాడులు, ఘర్షణల కారణంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా అయిదురోజులుగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పట్టణంలోని దుకాణాలను పూర్తిగా మూయిస్తున్నారు. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్
[ 19-05-2024]
పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్ నియమితులయ్యారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చెలరేగిన హింసను నియంత్రించడంలో విఫలమయ్యారన్న కారణంగా జిల్లా కలెక్టర్గా ఉన్న శివశంకర్ను ఎన్నికల కమిషన్ బదిలీ చేయగా ఎస్పీ బిందుమాధవ్పై సస్పెన్షన్ వేటు వేసింది. -
ఎట్టకేలకు కదిలిన అధికారులు
[ 19-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు అధికారులు కదిలారు. అక్రమ తవ్వకాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. -
ఉపాధ్యాయులకు బోధన మెలకువలపై శిక్షణ
[ 19-05-2024]
సీబీఎస్ఈ పాఠశాలల్లో పని చేస్తున్న ఆంగ్లం, సైన్స్(జీవశాస్త్రం), సోషల్ ఉపాధ్యాయులు.. తాము బోధించే పాఠ్యాంశాలపై పూర్తి అవగాహనతో ఉండాలని డీఈవో పి.శైలజ తెలిపారు. -
కరిగిన ఆశలు
[ 19-05-2024]
సాధారణంగా ఉప్పు పంటలకు ఎండలు అనుకూలం. ఉప్పు పంటను ఎండా కాలం పంటగా చెప్పాలి. ఎండల తీవ్రత బాగుంటే ఉప్పు దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం కురిసిన అకాల వర్షాలతో ఉప్పు రైతుకు తీరని నష్టం ఎదురైంది. -
ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులే లక్ష్యం
[ 19-05-2024]
మాతృభూమిపై మమకారంతో ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలు పడి ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులు సొంతూర్లకు వచ్చారు. -
మెట్ట ప్రాంతంలో తీరిన దాహం
[ 19-05-2024]
చుక్క నీటి కోసం విలవిల్లాడిన బొల్లాపల్లి మండలంలోని అయిదు గ్రామాలకు దాహం తీరింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో ఊరచెరువు వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. -
రైతులకు నికర ఆదాయమే లక్ష్యం
[ 19-05-2024]
కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించే కేంద్రాలుగా పని చేయడంతో పాటు నికర ఆదాయం సాధించేలా మార్గదర్శకం చేయాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి అటారి పదో జోన్ సంచాలకుడు డాక్టర్ షేక్ ఎన్.మీరా అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..