అందని బ్యాలట్లు.. ఉద్యోగుల పాట్లు..
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్లు అందక పడరాని పాట్లు పడుతున్నారు. సరిపడా బ్యాలట్లు అందుబాటులో ఉంచడంలోనూ అధికారులు విఫలమయ్యారని ఉద్యోగులు విమర్శిస్తున్నారు.
4వ రోజూ ఎందుకీ గందరగోళం
గడువు పొడిగించాలని సంఘాల ఆందోళన
ప్రభుత్వ మహిళా కళాశాల వద్ద పోస్టల్్ బ్యాలట్కు సమయమివ్వాలంటూ నినదిస్తున్న ఐకాస నాయకులు
కలెక్టరేట్, పట్టాభిపురం, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్లు అందక పడరాని పాట్లు పడుతున్నారు. సరిపడా బ్యాలట్లు అందుబాటులో ఉంచడంలోనూ అధికారులు విఫలమయ్యారని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. మంత్రి విడదల రజిని పోటీ చేస్తున్న గుంటూరు పశ్చిమలో ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఉద్యోగులు ప్రశ్నిస్తే మీరు మీ జిల్లాలకు వెళ్లి ఓట్లు వేసుకోమని చెప్పడంతో వారు అవాక్కయ్యారు.
ఉరుకులు.. పరుగులు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఫారం-12 ద్వారా పోస్టల్ బ్యాలట్కు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి వారు సాధారణంగా విధులు నిర్వహిస్తున్న నియోజకవర్గంలోనే ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేసి ఓటు వేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాల నుంచి ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నా వారి పేర్లను ఫెసిలిటేషన్ కేంద్రాలకు పంపలేదు. తాము దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎందుకు బ్యాలట్లు అందుబాటులో ఉంచలేదని, ఇది ముమ్మాటికీ అధికారుల నిర్లక్ష్యమేనని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫెసిలిటేషన్ కేంద్రాలకు వచ్చిన ఉద్యోగులు జాబితాలో పేర్లు లేకపోవడంతో ఉరుకులు పరుగులు పెట్టి సొంత నియోజకవర్గానికి వెళ్లి ఓటు వేసి రావాల్సి వచ్చింది. ఆర్వోల తీరుతో వారు మండుటెండలో ఓటు ఉన్న నియోజకవర్గాలకు వెళ్లాల్సి వచ్చింది. పోస్టల్ బ్యాలట్లు సరిపడా అందకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా మరికొన్ని పోస్టల్ బ్యాలట్లు ముద్రించడానికి ఎన్నికల అధికారులు నిర్ణయించారు. బుధవారం రాత్రికి వాటిని ముద్రించి గురువారం ఫెసిలిటేషన్ కేంద్రాలకు పంపనున్నారు.
దూరప్రాంతాల వారు ఎలా వెళ్లొస్తారు?
ముందుగా దరఖాస్తు చేసుకున్నా ఆయా జిల్లాల నుంచి పోస్టల్ బ్యాలట్ జిల్లాకు రాకపోవడంతో వారంతా ఇబ్బందులు పడ్డారు. బుధవారం ఫెసిలిటేషన్ కేంద్రాలకు వెళ్లిన వారు బ్యాలట్లు లేవని చెప్పడంతో ఆందోళన చెందారు. గురువారం కూడా బ్యాలట్ వేసేందుకు అవకాశం ఉన్నందున వారి సొంత నియోజకవర్గానికి వెళ్లి వేసుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. పొరుగు జిల్లాల వారైతే వెంటనే వెళ్లి రావచ్చు. అదే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారని వారు నిలదీస్తున్నారు.
సెల్ఫోన్లతోనే లోపలికి..
పోలింగ్ కేంద్రంలోకి పలువురు సెల్ఫోన్లు యథేచ్ఛగా తీసుకెళ్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం.ఈ క్రమంలో సాయంత్రం వేళ తెదేపా, వైకాపా వీఎల్ఏల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకొంది. వైకాపా బీఎల్ఏ పోలింగ్ కేంద్రంలో ఫొటో తీయడం విమర్శలకు దారి తీసింది. ఇదెక్కడి చోద్యమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఓటర్లకు అనుగుణంగా బూత్లు లేవు
పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునేందుకు సమయం తక్కువగా ఉందని, దీన్ని పొడిగించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. గుంటూరు పశ్చిమలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద సమయం పొడిగించాలని జేఏసీ నాయకులు నినదించారు. ఓటర్లకు అనుగుణంగా బూత్లను అధికారులు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఎవరూ స్పందించడం లేదంటూ వాపోయారు. ఏపీ జేఏసీ జిల్లా ఛైర్మన్ ఘంటసాల శ్రీనివాసరావు, కార్యదర్శి శెట్టిపల్లి సతీష్కుమార్, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.బసవలింగారావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జల్లెడ పడుతున్నారు!
[ 20-05-2024]
ఎన్నికల సంఘం నియమించిన సిట్ బృందం జిల్లాలో విస్తృత పర్యటనలు చేస్తోంది. శనివారం నరసరావుపేట, కారంపూడి వచ్చిన బృందాలు, ఆదివారం దాచేపల్లి, మాచర్లలో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. -
అరాచక శక్తులను అణిచేస్తేనే..
[ 20-05-2024]
జిల్లాకు మూడో ఎస్పీగా వస్తున్న మలికా గార్గ్కు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయంలో జరిగిన హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. -
తెలంగాణ మద్యం స్వాధీనం
[ 20-05-2024]
అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈఘటన ఆదివారం చీరాలలో వెలుగు చూసింది. -
అదును దాటుతున్నా.. విత్తే దారేది?
[ 20-05-2024]
సీజన్లో రైతులకు విత్తనాలు సకాలంలో అందించి ఇబ్బందులు లేకుండా చూస్తామని వ్యవసాయశాఖ ఘనంగా ప్రకటిస్తుంది. -
అడిగినవి ఇవ్వరంట.. పనులు పూర్తి చేయాలంట
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్ష అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు
[ 20-05-2024]
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలోని మహ్మదాపూర్ గ్రామంలో వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. -
ప్రకృతి సొగసు ప్రోత్సహిస్తూ.. పస్తులుంటున్నారు?
[ 20-05-2024]
వారంతా రైతులే. చేస్తోంది వ్యవసాయమే. ఓ అడుగు ముందుకేసి వ్యవసాయం చేస్తూనే.. మరోవైపు మరికొందరిని ఆ విధానంలోకి తీసుకొచ్చేందుకు ప్రోత్సహిస్తుంటారు. -
గంజాయి మత్తు.. ప్రజలకు విపత్తు
[ 20-05-2024]
నగరంలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. గత ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నగరంలో కాలినడకన పర్యటించిన సమయంలో పాతగుంటూరులోని ఓ పాత ఇంటిని అడ్డాగా చేసుకొని గంజాయి తాగుతున్నారని ఫిర్యాదు -
అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొన్న బస్సు
[ 20-05-2024]
ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మంగళగిరి గ్రామీణ పోలీసుల కథనం ప్రకారం. -
‘పైపెచ్చు’ పఠనమూ ప్రమాదమే!
[ 20-05-2024]
గుంటూరులో 1954లో స్థాపించిన ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం పూర్తిగా శిథిలమై ప్రమాదకరంగా మారింది. ఇక్కడ 1.5లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. -
గుంటూరు నుంచి గుజరాత్.. వయా జహీరాబాద్!
[ 20-05-2024]
బస్తాల ప్యాకింగ్ మార్చి గుంటూరు నుంచి గుజరాత్కు జహీరాబాద్ మీదుగా అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్-2 హైదరాబాద్ అధికారులు పట్టుకున్నారు. -
అడిగినవి ఇవ్వకుండా.. పనుల పూర్తి ఎలా?
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్షా అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
ఓట్ల లెక్కింపునకు భద్రత కట్టుదిట్టం
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించి జూన్ 4న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. -
ఓటులో పోటీ.. స్ఫూర్తిలో మేటి
[ 20-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే గీటురాయి. తమకు ప్రసాదించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న కసి ప్రతి ఒక్కరిలో కనిపించింది. గతంతో పోల్చితే ఈసారి ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
-
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
-
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు