ఇంద ఈ డబ్బులు ఉంచుకో..
జిల్లాలో చీరాల నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీకి చెందిన నాయకుడొకరు కొందరికి డబ్బులు ఎరజూపి, ముందస్తుగా కొంత నగదు ముట్టజెప్పి తనకు మద్దతు పలికేలా చేసుకున్నారు.
ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలంటూ కొంత నగదు ఇచ్చి ఒప్పందం
అనుకున్న ప్రకారం చెల్లింపులు చేయకుండా నిర్వాకం
చీరాలలో ఓ రాజకీయ నేత తీరుపై స్థానిక నాయకుల ఆవేదన
ఈనాడు-బాపట్ల: జిల్లాలో చీరాల నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీకి చెందిన నాయకుడొకరు కొందరికి డబ్బులు ఎరజూపి, ముందస్తుగా కొంత నగదు ముట్టజెప్పి తనకు మద్దతు పలికేలా చేసుకున్నారు. ప్రధాన పార్టీని వీడి తన విజయానికి కృషి చేయటానికి వచ్చినందుకు సదరు అభ్యర్థి ఆ నాయకుల స్ధాయిని బట్టి ఒక్కొక్కరికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ముట్టజెబుతానని వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా తొలుత ఒక్కో నాయకుడికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఇచ్చి మిగిలిన మొత్తాన్ని రెండు, మూడు రోజుల్లో సర్దుబాటు చేస్తానని చెప్పి వారికి టోకెన్ అడ్వాన్సులు ఇచ్చి వార్డు, గ్రామాల్లో ప్రచారం చేయాలని సూచించారు. తీరా రోజులు గడుస్తున్నా ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్దేశిత మొత్తం ఇవ్వకుండా ఆ ఊసేఎత్తకుండా కుశల ప్రశ్నలు వేసి పంపుతున్నారని తామిప్పుడు అటుఇటు కాకుండా మధ్యస్తంగా నలిగిపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఈ అభ్యర్థిని కాదని మరో అభ్యర్థి వద్దకు వెళదామంటే కొంత నగదు తీసుకున్నామని ఆ మొహమాటం తమకు అడ్డొస్తుందని అలా అని ఇచ్చిన కొద్దిపాటి మొత్తంతో తమ వర్గానికి ఎలా న్యాయం చేయగలమని ప్రశ్నిస్తున్నారు. సదరు అభ్యర్థి రాజకీయంగా సీనియర్ కావడం అతన్ని కాదని ఇతరుల వైపునకు వెళితే ఆ పర్యవనసానాలు ఎలా ఉంటాయోనని భయపడి అడ్వాన్సులు తీసుకున్నవారు బిక్కుబిక్కుమంటున్నారు. మొత్తంగా తాము ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయామని సన్నిహితులతో చెప్పుకుని బాధపడుతున్నారు. తమ స్థాయికి ఏ అభ్యర్థి అయినా కనీసం రూ.5-6 లక్షలు ఇచ్చి ఓట్లు వేయించాలని కోరేవారని అలాంటిది ఇప్పుడు తమను ఈ అభ్యర్థి తెలివిగా రూ.50 వేల నుంచి ఓ రూ.లక్ష ఇచ్చి చేతులు కట్టిపడేశారని వాపోతున్నారు. వీరిలో చీరాల పట్టణానికి చెందిన వార్డు స్థాయి నాయకులు ఇద్దరు వేటపాలెం మండలానికి చెందిన మరో ఇద్దరు మాజీ సర్పంచులు ఆ అభ్యర్థి నుంచి టోకెన్ అడ్వాన్సు తీసుకున్నవారిలో ఉన్నారు. అడ్వాన్సులు ముట్టజెప్పి వారిని ఇతరుల వైపు కన్నెత్తి చూడకుండా చేశారని ఆ విషయం తెలుసుకుని నియోజకవర్గంలోని పలువురు నాయకులు వారికి భలే శాస్తి జరిగిందిలే అని చర్చించుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జల్లెడ పడుతున్నారు!
[ 20-05-2024]
ఎన్నికల సంఘం నియమించిన సిట్ బృందం జిల్లాలో విస్తృత పర్యటనలు చేస్తోంది. శనివారం నరసరావుపేట, కారంపూడి వచ్చిన బృందాలు, ఆదివారం దాచేపల్లి, మాచర్లలో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. -
అరాచక శక్తులను అణిచేస్తేనే..
[ 20-05-2024]
జిల్లాకు మూడో ఎస్పీగా వస్తున్న మలికా గార్గ్కు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయంలో జరిగిన హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. -
తెలంగాణ మద్యం స్వాధీనం
[ 20-05-2024]
అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈఘటన ఆదివారం చీరాలలో వెలుగు చూసింది. -
అదును దాటుతున్నా.. విత్తే దారేది?
[ 20-05-2024]
సీజన్లో రైతులకు విత్తనాలు సకాలంలో అందించి ఇబ్బందులు లేకుండా చూస్తామని వ్యవసాయశాఖ ఘనంగా ప్రకటిస్తుంది. -
అడిగినవి ఇవ్వరంట.. పనులు పూర్తి చేయాలంట
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్ష అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు
[ 20-05-2024]
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలోని మహ్మదాపూర్ గ్రామంలో వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. -
ప్రకృతి సొగసు ప్రోత్సహిస్తూ.. పస్తులుంటున్నారు?
[ 20-05-2024]
వారంతా రైతులే. చేస్తోంది వ్యవసాయమే. ఓ అడుగు ముందుకేసి వ్యవసాయం చేస్తూనే.. మరోవైపు మరికొందరిని ఆ విధానంలోకి తీసుకొచ్చేందుకు ప్రోత్సహిస్తుంటారు. -
గంజాయి మత్తు.. ప్రజలకు విపత్తు
[ 20-05-2024]
నగరంలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. గత ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నగరంలో కాలినడకన పర్యటించిన సమయంలో పాతగుంటూరులోని ఓ పాత ఇంటిని అడ్డాగా చేసుకొని గంజాయి తాగుతున్నారని ఫిర్యాదు -
అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొన్న బస్సు
[ 20-05-2024]
ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మంగళగిరి గ్రామీణ పోలీసుల కథనం ప్రకారం. -
‘పైపెచ్చు’ పఠనమూ ప్రమాదమే!
[ 20-05-2024]
గుంటూరులో 1954లో స్థాపించిన ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం పూర్తిగా శిథిలమై ప్రమాదకరంగా మారింది. ఇక్కడ 1.5లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. -
గుంటూరు నుంచి గుజరాత్.. వయా జహీరాబాద్!
[ 20-05-2024]
బస్తాల ప్యాకింగ్ మార్చి గుంటూరు నుంచి గుజరాత్కు జహీరాబాద్ మీదుగా అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్-2 హైదరాబాద్ అధికారులు పట్టుకున్నారు. -
అడిగినవి ఇవ్వకుండా.. పనుల పూర్తి ఎలా?
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్షా అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
ఓట్ల లెక్కింపునకు భద్రత కట్టుదిట్టం
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించి జూన్ 4న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. -
ఓటులో పోటీ.. స్ఫూర్తిలో మేటి
[ 20-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే గీటురాయి. తమకు ప్రసాదించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న కసి ప్రతి ఒక్కరిలో కనిపించింది. గతంతో పోల్చితే ఈసారి ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
-
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అందనంత దూరంలో కోడి ధర.. రూ. 300లకు చేరువలో స్కిన్ లెస్