logo

‘వైకాపా అభ్యర్థులను అన్ని చోట్లా ఓడించండి’

దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్‌ దళితుల్ని నిలువునా వంచించారని ప్రభుదా రిపబ్లికన్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ దాసరి చెన్నకేశవులు, పీపుల్స్‌ రిపబ్లికన్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావ్‌,

Published : 10 May 2024 05:08 IST

మంగళగిరిలో ‘జగన్‌ హఠావో.. ఏపీ బచావో’ ముగింపు సభ

దుగ్గిరాల, న్యూస్‌టుడే: దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్‌ దళితుల్ని నిలువునా వంచించారని ప్రభుదా రిపబ్లికన్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ దాసరి చెన్నకేశవులు, పీపుల్స్‌ రిపబ్లికన్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావ్‌, రిపబ్లికన్‌ పార్టీ మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి, మాల మహానాడు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుర్రం రామారావు విమర్శించారు. గురువారం దుగ్గిరాలలో మాట్లాడుతూ రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ‘జగన్‌ హఠావో..ఏపీˆ బచావో’ అని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ వస్తున్న జైత్రయాత్ర ముగింపు సభను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మంగళగిరిలోని కొండపనేని టవర్స్‌ ఎదురుగా ఉన్న భోగి వినోద్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. అన్ని చోట్లా వైకాపా  అభ్యర్థుల్ని ఓడించాలని పిలుపిచ్చారు. దళిత బిడ్డల్ని చంపిన వారికి జగన్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారని ఆరోపించారు.   కార్యక్రమంలో నూకతోటి రవి, పేర్లి వంశీ, రాజారామ్‌, గోపాల్‌, నిక్కీ, సంజీవ్‌కుమార్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు