బరితెగించిన వైకాపా
గుంటూరు నగరంలో వైకాపా తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి బరి తెగించారు. ప్రజల నుంచి మద్దతు లేదని గుర్తించిన సదరు వ్యక్తులు అడ్డదారుల్లోనైనా గెలవాలనే లక్ష్యంతో సామ, దాన, దండోపాయాలు అవలంబిస్తున్నారు.
కుల సంఘాల నేతలకు ప్రలోభాలు
హోటల్ కేంద్రంగా బేరసారాలు
ఈనాడు, అమరావతి
గుంటూరు నగరంలో వైకాపా తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి బరి తెగించారు. ప్రజల నుంచి మద్దతు లేదని గుర్తించిన సదరు వ్యక్తులు అడ్డదారుల్లోనైనా గెలవాలనే లక్ష్యంతో సామ, దాన, దండోపాయాలు అవలంబిస్తున్నారు. వివిధ కుల సంఘాల నేతలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అంతటితో ఆగకుండా వివిధ రూపాల్లో ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అక్కడికీ వారు దారిలోకి రాకపోతే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ చేతుల్లోనే పవర్ ఉంటుందని, అప్పుడు అంతుచూస్తామని హెచ్చరికలు పంపుతున్నారు.
ఉద్యోగులకు బెదిరింపులు..
పోస్టల్ బ్యాలట్ ఓట్లు వేయకుండా ఉద్యోగులు ఉండాలని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తే వారు ఎదురుతిరగడంతో వెనక్కితగ్గారు. కొందరు ఉద్యోగులను పిలిచి పోలింగ్ రోజు తమ ఏజెంట్లకు సహకరించాలని, తామే అధికారంలోకి వస్తున్నామని, కోరుకున్నచోట పోస్టింగ్ ఇప్పిస్తామని నమ్మకబలికారు. అయితే ఉద్యోగులు పోలింగ్ రోజు తాము చేసేదేమీ ఉండదని చెప్పడంతో అందరినీ గుర్తుంచుకుంటామని చెప్పి పంపడం గమనార్హం.
సందిగ్ధంలో పడేసే కుట్ర
నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న ఓ సామాజిక వర్గం ఓట్లను ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తాము ప్రస్తుతానికి వైకాపా నుంచి గెలుపొందినా జనసేన అధికారంలోకి వస్తే అటువైపు వస్తామని చెప్పి సదరు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక వర్గంలో కీలకమైన వ్యక్తులంతా తమతోనే ఉన్నారని, మీరు కూడా కలిసి రావాలని ఆయా నేతలకు చెబుతున్నారు. ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో అన్నీతానై వ్యవహరించిన కుటుంబ సభ్యుడే ఇక్కడ అన్ని వ్యవహారాలు చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. తప్పుడు ప్రచారం చేసి ప్రతిపక్షాలకు చెందినవారిని సందిగ్ధంలో పడేసి లబ్ధి పొందాలన్న కుట్ర చేస్తున్నట్లు గుర్తించిన తెదేపా అప్రమత్తమైంది. వైకాపా తప్పుడు ప్రచారం ఉచ్చులో పడకుండా కార్యకర్తలు, నేతలకు స్పష్టత ఇచ్చింది.
అంతా అక్కడే..
నియోజకవర్గంలో పోటీ ఖరారైన వెంటనే గుంటూరు నగరంలో ఓ ప్రముఖ హోటల్ కేంద్రంగా రాజకీయం ప్రారంభించారు. రెండు నెలల నుంచి అక్కడే మకాం వేసి నేతలను పిలిపించుకుని వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటున్నారు. తెదేపాకి బలమైన నియోజకవర్గంలో ఎలాగైనా పాగా వేయాలన్న లక్ష్యంతో ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడమని సంకేతాలు ఇస్తున్నారు. కూటమిలోని తెదేపా, జనసేన, భాజపా నేతల్లో అసంతృప్తిగా ఉన్నవారిని గుర్తించి మీరు నేరుగా పార్టీలో చేరకపోయినా తమకు పనిచేయాలని కోరుతున్నారు. ఎవరెవరికి ఏయే వ్యాపారాలు ఉన్నాయి? ఎవరిచేత చెప్పిస్తే పని సులభమవుతుందన్న ధోరణిలో వెళుతున్నారు. ఇప్పటికే వివిధ సామాజికవర్గాల వారితో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి బహుమతులు అందించారు. ఎన్ని ఎత్తులు వేసినా విజయంపై భరోసా కలగకపోవడంతో అంతిమంగా పెద్దఎత్తున నగదు పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
[ 19-05-2024]
పోలింగ్ రోజు, ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక దాడులు, ఘర్షణలపై పల్నాడు జిల్లాలో సిట్ దర్యాప్తు రెండో రోజు కొనసాగుతోంది. -
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన దాడులు, ప్రతిదాడులకు సంబంధించి పోలీసులు పెద్దఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. అదనపు బలగాలు రావడంతో జిల్లా మొత్తం పోలీసులు అధీనంలోకి తీసుకోవడంతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. -
దేవుడి భూమి.. సమర్పయామి
[ 19-05-2024]
దేవుడికి సేవ చేయాల్సిన అర్చకులు ఆలయ భూమినే అమ్మేశారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని అమ్మేసి నిత్య కైంకర్యాలు నిలిపేశారు. వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు. -
పల్నాడును చూసైనా.. కళ్లు తెరవలేదు..
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్కు ముందు రోజు, ఎన్నిక రోజున పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనల్లో కూటమి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వైకాపా దాడులకు తెగబడటంతో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
క్షణక్షణం ఉత్కంఠ!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన, ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా పలు గ్రామాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. -
మద్యం దుకాణాలకు 144 సెక్షన్ వర్తించదా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన దాడులు, ఘర్షణల కారణంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా అయిదురోజులుగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పట్టణంలోని దుకాణాలను పూర్తిగా మూయిస్తున్నారు. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్
[ 19-05-2024]
పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్ నియమితులయ్యారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చెలరేగిన హింసను నియంత్రించడంలో విఫలమయ్యారన్న కారణంగా జిల్లా కలెక్టర్గా ఉన్న శివశంకర్ను ఎన్నికల కమిషన్ బదిలీ చేయగా ఎస్పీ బిందుమాధవ్పై సస్పెన్షన్ వేటు వేసింది. -
ఎట్టకేలకు కదిలిన అధికారులు
[ 19-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు అధికారులు కదిలారు. అక్రమ తవ్వకాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. -
ఉపాధ్యాయులకు బోధన మెలకువలపై శిక్షణ
[ 19-05-2024]
సీబీఎస్ఈ పాఠశాలల్లో పని చేస్తున్న ఆంగ్లం, సైన్స్(జీవశాస్త్రం), సోషల్ ఉపాధ్యాయులు.. తాము బోధించే పాఠ్యాంశాలపై పూర్తి అవగాహనతో ఉండాలని డీఈవో పి.శైలజ తెలిపారు. -
కరిగిన ఆశలు
[ 19-05-2024]
సాధారణంగా ఉప్పు పంటలకు ఎండలు అనుకూలం. ఉప్పు పంటను ఎండా కాలం పంటగా చెప్పాలి. ఎండల తీవ్రత బాగుంటే ఉప్పు దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం కురిసిన అకాల వర్షాలతో ఉప్పు రైతుకు తీరని నష్టం ఎదురైంది. -
ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులే లక్ష్యం
[ 19-05-2024]
మాతృభూమిపై మమకారంతో ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలు పడి ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులు సొంతూర్లకు వచ్చారు. -
మెట్ట ప్రాంతంలో తీరిన దాహం
[ 19-05-2024]
చుక్క నీటి కోసం విలవిల్లాడిన బొల్లాపల్లి మండలంలోని అయిదు గ్రామాలకు దాహం తీరింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో ఊరచెరువు వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. -
రైతులకు నికర ఆదాయమే లక్ష్యం
[ 19-05-2024]
కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించే కేంద్రాలుగా పని చేయడంతో పాటు నికర ఆదాయం సాధించేలా మార్గదర్శకం చేయాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి అటారి పదో జోన్ సంచాలకుడు డాక్టర్ షేక్ ఎన్.మీరా అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీపై వ్యతిరేక ప్రచారం.. జైలుపాలైన ఉపాధ్యాయుడు
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు