రైలు పట్టాలపై నవదంపతుల ఆత్మహత్య
ప్రేమించి పెళ్లిచేసుకున్న జంట పెద్దలను ఎదిరించలేక తనువు చాలించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్ రైల్వే ఎస్సై మాజీద్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో
నిఖిల్ సాయి
ఘట్కేసర్, న్యూస్టుడే: ప్రేమించి పెళ్లిచేసుకున్న జంట పెద్దలను ఎదిరించలేక తనువు చాలించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్ రైల్వే ఎస్సై మాజీద్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఘట్కేసర్ రైల్వేస్టేషన్ సమీపంలోని యంనంపేట వద్ద యువతి, యువకుడి మృతదేహాలు పడి ఉన్నట్లు సిబ్బంది ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. యువకుడి ప్యాంటు జేబులో ఉన్న ఓటరు గుర్తింపు కార్డు, వాహన డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా హబ్సిగూడ రోడ్డు నంబరు-8 వీవీనగర్కు చెందిన కుంచెల నిఖిల్సాయి(26)గా గుర్తించారు. యువకుడి కుటుంబీకుల సమాచారం మేరకు.. యువతి మల్లాపూర్ ఎన్టీఆర్నగర్కు చెందిన కె.ప్రియాంక(25)గా గుర్తించారు. యువతి మెడలో రోల్డ్గోల్డ్ గొలుసు, పసుపుకొమ్ము ఉన్నాయి. ప్రేమ పెళ్లి చేసుకుని పెద్దలను ఎదిరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించామని ఎస్సై పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్