logo

తల్లిని చితకబాది.. చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య

మద్యం మత్తులో తల్లిని చితకబాది చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 06 Jul 2022 02:11 IST


శ్రీహరి

మేడ్చల్‌, న్యూస్‌టుడే: మద్యం మత్తులో తల్లిని చితకబాది చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాజబొల్లారానికి చెందిన తొర్రి సుగుణకు కూతురు ప్రమీల, కొడుకు శ్రీహరి(31) ఉన్నారు. శ్రీహరికి ఏడాది క్రితమే పెళ్లి అయ్యింది. మద్యానికి బానిసై తల్లి సంపాదించిన డబ్బుతో తాగేవాడు. ఏడాది కిందట తల్లితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయారు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో చనిపోయాడని అందరూ భావించారు. రెండు నెలల క్రితమే ఇంటికి చేరుకున్నారు. మద్యం తాగడం మానలేదు. సోమవారం రాత్రి మద్యానికి డబ్బులు కావాలని తల్లితో గొడవపడ్డాడు. ఏ పని చేయడం లేదని.. డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని తల్లి మందలించడంతో ఆమెను చితకబాదాడు. ఆత్మహత్య చేసుకుంటానని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఉదయం చెరువు వద్ద యువకుడి చెప్పులు, రూ.30 ఉన్నాయి. తల్లి పోలీసులకు సమాచారం అందించింది. చెరువులో గాలించగా శ్రీహరి మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని