ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి.
ఈనాడు - హైదరాబాద్
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. ఇక ప్రయాణాలను మనం ఊహించగలమా..? అందుకే దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను గణనీయంగా పెంచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దానాపూర్కు 22 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. సికింద్రాబాద్ నుంచి 11 రైళ్లు వెళ్తున్నాయి. ఇవన్నీ ప్రతి గురువారం నగరం నుంచి బయలుదేరుతున్నాయి. అలాగే అటునుంచి ఇంతే సంఖ్యలో ప్రతి శనివారం తిరుగు ప్రయాణమవుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలను కలుపుతూ వెళ్లే ఈ రైళ్లన్నీ అన్రిజర్వ్డ్. ప్రతి రోజూ నడిచే సికింద్రాబాద్ - దానాపూర్ ఎక్స్ప్రెస్లో వెయిటింగ్ లిస్ట్ జాబితా ఉన్నందున క్లోనింగ్ రైళ్లు మాదిరి వీటిని నడుపుతున్నారు. ఇదే రైలులో అయోధ్యకు వెళ్లే భక్తులు కూడా తోడయ్యారు.
అన్ని ప్రాంతాలకు ఇలా..
సికింద్రాబాద్ - సంత్రగాచి - సికింద్రాబాద్ మధ్య 42 రైళ్లు, కాచిగూడ - కోచువెలి - కాచిగూడ మధ్య 4 సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ - ఆరిస్కరా మధ్య 38 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్ మీదుగా కర్ణాటకకు ఈ రైళ్లున్నాయి. ఇలా సికింద్రాబాద్ - దానాపూర్, హైదరాబాద్ - గోరఖ్పూర్, కాచిగూడ - కోచువెలి, సికింద్రాదాద్ - అగర్తల, సికింద్రాబాద్ - సంత్రగాచి, సికింద్రాబాద్ - షాలీమర్, సికింద్రాబాద్ - పాట్నా, తిరుపతి - షిర్డీ, కాచిగూడ - మధురై, సికింద్రాబాద్ - కొళ్లం, హైదరాబాద్ - కటక్, హైదరాబాద్ - రాక్సౌల్.. ఇలా ఇతర రాష్ట్రాలను కలుపుతూ నడిచే రైళ్లకు తోడు.. తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కూడా ప్రత్యేక రైళ్లున్నాయి. సికింద్రాబాద్ - తిరుపతి, లింగంపల్లి - కాకినాడ, హైదరాబాద్ - నర్సాపూర్, సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయి. ఇలా మొత్తం 1079 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
ఎన్నికల రద్దీతో అదనంగా..
మహారాష్ట్రలో ఇప్పటికే రెండు దశల్లో ఎన్నికలు ముగియగా.. మధ్యప్రదేశ్లో రెండు దశలు పూర్తయ్యాయి. మే నెలలో 7, 13 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్లో మొత్తం 7 దశలకుగాను... ఇప్పటివరకు రెండు దశలే అయ్యాయి. మే 7, 13, 20, 25, జూన్ 1 వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది. బిహార్లో కూడా ఇప్పటికే రెండు దశల ఎన్నికలు జరగ్గా.. మే నెల 7, 13, 20, 25, జూన్ నెల 1వ తేదీన ఇంకా 5 దశలు మిగిలి ఉన్నాయి. తెలంగాణలో ఎక్కువ మంది ఉత్తర భారతదేశానికి చెందినవారుండడంతో ఈ నాలుగు రాష్ట్రాలను కలుపుతూ వెళ్లే దానాపూర్, గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్లను ఎక్కువ సంఖ్యలో వేశారు. ఇక ఉత్తరాంధ్ర మీదుగా వెళ్లే విశాఖ, ఫలక్నుమా ఎక్స్ప్రెస్లకు తోడు అదే మార్గంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
ఆంధ్రప్రదేశ్లో మరో ఇద్దరు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వరుణుడు కాస్త ఉపశమనం కలిగించాడు. ఏపీలోని పలు జిల్లాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో భారీ వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. -
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
నాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలుపుతూ నాని పోస్ట్ పెట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!