సంకటంలో స్థానిక ప్రయాణం
కేవలం రూ.5 టిక్కెట్తో 20 కిలోమీటర్ల దూరం.. రూ.10 టిక్కెట్తో 40 కిలోమీటర్ల దూరం.. కాలుష్యం లేని వేగవంతమైన ప్రయాణం ఎంఎంటీఎస్ల సొంతం.
చీటికీమాటికీ ఎంఎంటీఎస్ల రద్దు
లైన్ల పెంపుతోనే సమస్యకు పరిష్కారం
కేవలం రూ.5 టిక్కెట్తో 20 కిలోమీటర్ల దూరం.. రూ.10 టిక్కెట్తో 40 కిలోమీటర్ల దూరం.. కాలుష్యం లేని వేగవంతమైన ప్రయాణం ఎంఎంటీఎస్ల సొంతం. ముంబయిలో నిత్యం 2,250 సర్వీసులు క్షణం ఆలస్యం లేకుండా ప్రయాణాలు సాగించే తీరు ఇతర నగరాలకు ఆదర్శమనే చెప్పాలి. ఒక్కో మార్గంలో కనీసం నాలుగు, ఆరు లైన్లకు తగ్గకుండా ఉండడంతో ఆ మార్గాల్లోనే లోకల్ రైళ్లతో పాటు ఎక్స్ప్రెస్లు, పాసింజర్లు పరుగులు పెడుతుంటాయి. అలాంటి ప్రజారవాణా కాకపోయినా కనీసం నాలుగు లైన్లు నగరంలో ఉండాలని ఇక్కడి ప్రయాణికులు కోరుతున్నారు. అప్పుడే ఎంఎంటీఎస్ రైళ్ల ప్రయాణం ఆటంకం లేకుండా సాగుతందని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వమే చొరవ చూపాలి
నగరంలో ఉన్నవి రెండే లైన్లు. వీటిపైనే వందల సంఖ్యలో రైళ్లు పరుగులు తీయాల్సిన పరిస్థితి. దూరప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్ల మధ్య ఖాళీ దొరికితే ఎంఎంటీఎస్లు నడపాల్సిన పరిస్థితి. దీంతో అరగంట, గంటకో ఎంఎంటీఎస్ నడుపుతున్నారు. కొన్నిసార్లు అవి కూడా రద్దు చేస్తున్నారు. కరోనాకు ముందు ఎంఎంటీఎస్ 121 సర్వీసుల్లో 1.80 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేవారు. కరోనా తర్వాత రెండోదశ ఎంఎంటీఎస్ ప్రారంభించినా 86 సర్వీసులు 60 వేల మంది ప్రయాణికులతో కునారిల్లుతోంది. వీటిలోనూ 22 సర్వీసులను నెలలో నాలుగైదు సార్లు రద్దు చేస్తుండడం చికాకు తెప్పిస్తోంది. ప్రస్తుతం ఉన్న రెండు లైన్లకు అదనంగా మరో రెండు లైన్లు వస్తే ప్రతి 5 నిమిషాలకో ఎంఎంటీఎస్ నడపడానికి అవకాశం ఉంటుంది. అదనపు లైన్లు వేయడానికి పట్టాలకు ఆనుకుని ఉన్న ఆక్రమణలను తొలగించాలి. ఇందు కోసం వారికి ప్రత్యామ్నాయం చూపి తగిన స్థలం కేటాయిస్తే నాలుగు లైన్లు వేయడానికి రైల్వే సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని రవాణారంగ నిపుణుడు ప్రశాంత్ కోరుతున్నారు.
రెండో దశలోనూ...
నగరంలో ఎంఎంటీఎస్ మొదటి దశ లింగంపల్లి- బేగంపేట- సికింద్రాబాద్- కాచిగూడ- ఫలక్నుమా 44 కిలోమీటర్ల మేర అందుబాటులోకి వస్తే, రెండో మార్గం కింద బేగంపేట- నాంపల్లి మరో 4 కిలోమీటర్ల మేర ప్రయాణాలకు సాధ్యపడింది. ఇలా 48 కిలోమీటర్లను మొదటిదశలో అప్పటివరకూ ఉన్న రెండు లైన్లతోనే సర్దుబాటు చేశారు. కొత్తగా స్టేషన్లను మాత్రమే నిర్మించారు. రెండోదశ కింద 95 కిలోమీటర్లు అందుబాటులోకి తీసుకొస్తే మౌలాలి- ఘట్కేసర్ మధ్య మినహా అంతటా రెండు లైన్లే అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేక లైన్లు లేకపోవడంతో చీటికిమాటికి వాటిని రద్దు చేస్తున్నారు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో గంజాయి, ఎంఎండీఏ స్వాధీనం
[ 17-05-2024]
కూకట్పల్లి ఠాణా పరిధిలోని శేషాద్రినగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. -
కుండపోత.. జనం ఎదురీత
[ 17-05-2024]
రాజధానిలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. భారీ వానకు ఈదురుగాలులు తోడవ్వడంతో నగరం అతలా కుతలమైంది. -
కట్టుకున్నోడిని చంపేసి.. గుండెపోటని నమ్మించి
[ 17-05-2024]
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. భర్తను దారుణంగా హతమార్చి గుండెపోటుతో మరణించాడని కట్టుకథ అల్లింది. -
మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు
[ 17-05-2024]
మల్కాజిగిరి భాజపా కార్పొరేటర్ శ్రవణ్కుమార్ సహా మరో ముగ్గుర్ని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
యాసిడ్ కలిపిన నీటితో స్నానం.. విద్యార్థినికి గాయాలు
[ 17-05-2024]
యాసిడ్ కలిపిన బకెట్ను స్నానం నీటికి ఉపయోగించడంతో ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. -
నిధులు మింగేసి.. నాలాలను వదిలేసి
[ 17-05-2024]
రూ.వెయ్యి కోట్లతో నాలాల ఆధునికీకరిస్తామంటూ మూడేళ్ల క్రితం చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ)పై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. -
వందేభారత్ 5 గంటలు ఆలస్యం
[ 17-05-2024]
టైమంటే వందేభారత్.. వందేభారత్ అంటే టైం..అని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ద.మ.రైల్వే వాటి సమాయాలపై సంశయం వచ్చేలా చేస్తోంది. -
హద్దులు చెరిపేసి.. చుట్టూ కంచె వేసి
[ 17-05-2024]
జంట జలాశయాలకు సమీపంలో ప్రభుత్వ, నిషేధిత భూముల వివరాలను సేకరించి కొందరు అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారు. -
వరుణుడి ఆట.. అభిమానుల ఇంటి బాట
[ 17-05-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య గురువారం రాత్రి జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
చినుకు పడితే.. కానరాని సిటీ బస్సులు
[ 17-05-2024]
నగరంలో ఏమాత్రం వర్షం పడినా ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారిపోతోంది. -
350 ఫీడర్లలో ట్రిప్పింగ్
[ 17-05-2024]
బంజారాహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలడం, చెట్ల కొమ్మలు కరెంట్ తీగలపై పడటంతో బ్రేక్డౌన్లు ఏర్పడ్డాయి. -
పోకల్వాడ భూముల కబ్జాపై దర్యాప్తు
[ 17-05-2024]
మణికొండ ఐటీ కారిడార్ సమీపంలోని పోకల్వాడలో ఐదెకరాల భూమి కబ్జా వ్యవహారం కీలకమలుపు తిరిగింది. -
ఐసీఎస్ఎస్ఆర్ జాతీయ సదస్సు 29న
[ 17-05-2024]
ఆర్జీ కేడియా వాణిజ్య కళాశాలలో ఈ నెల 29న ‘వ్యాపార పద్ధతులు- కొత్త పరిశోధనలు’ అనే అంశమై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. -
పెండింగ్ డీఏలు ఇప్పించాలి
[ 17-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించడంతో పాటు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చర్యలు చేపట్టాలని -
అకాల చినుకు..అన్నదాతకు వణుకు
[ 17-05-2024]
రైతన్న అనుకున్నంతా అయింది. అకాల వర్షం పడితే తాము పడిన కష్టం అంతా నీటి పాలవుతుందని నిత్యం ఆకాశంలో మబ్బులు పడితే ఆందోళన చెందుతున్నారు. -
బాహ్య వలయం.. అసంపూర్ణం
[ 17-05-2024]
తాండూరు నియోజకవర్గానికి తొలిసారిగా ‘బాహ్య వలయ రహదారి’ మంజూరైంది. -
సౌకర్యాలు కరవాయె.. రైతన్నకు దిగులాయె
[ 17-05-2024]
ధాన్యం సేకరణ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నటు అధికారులు పేర్కొంటున్నా క్షేత్ర స్థాయిలో అరకొరగానే ఉన్నాయి. -
కులగణన ప్రక్రియ సత్వరం చేపట్టండి
[ 17-05-2024]
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియను వెంటనే చేపట్టి బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కోరారు. -
పురపాలికగా మహేశ్వరం!
[ 17-05-2024]
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం పురపాలికగా ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు 19
[ 17-05-2024]
లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. -
సోమాలియా బాలిక కడుపులో 3.75 కిలోల కణితి తొలగింపు
[ 17-05-2024]
సోమాలియా దేశానికి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలిక కడుపులో ఉన్న భారీ కణితిని సికింద్రాబాద్లోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించి ఆమెకు ఊరట కల్పించారు. -
సుంకిశాల పనుల్లో జాప్యంపై ఆరా
[ 17-05-2024]
నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై జలమండలి దృష్టి సారించింది. -
‘ఉచిత బియ్యం పంపిణీపై అవగాహన కరవు’
[ 17-05-2024]
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
పోలింగ్పై ఎడతెగని సమీక్ష
[ 17-05-2024]
చేవెళ్ల లోక్ సభకు సంబంధించి ఈనెల 13న సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు పూర్తయ్యాయి. -
పోగొట్టుకున్న 300కళ్లద్దాల ఫ్రేమ్ల అప్పగింత
[ 17-05-2024]
రైల్లో పోగొట్టుకున్న 300 కళ్లద్దాల ఫ్రేమ్ల సెట్లను ఆర్పీఎఫ్ పోలీసులు బాధితునికి అప్పగించిన సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్లో గురువారం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
-
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో చెవి కోసేశాడు
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM