logo

AmitShah: అమిత్‌షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మంగళవారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆదిలాబాద్‌లో నిర్వహించనున్న జనగర్జన సభలో ఆయన పాల్గొననున్నారు.

Updated : 10 Oct 2023 08:15 IST

హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మంగళవారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆదిలాబాద్‌లో నిర్వహించనున్న జనగర్జన సభలో ఆయన పాల్గొననున్నారు. అయితే ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. నాగపూర్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఇవాళ మధ్యాహ్నం బేగంపేటకు రానున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌కు వెళ్లనున్నారు. జనగర్జన సభలో పాల్గొన్న అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

సాయంత్రం 6.20 నుంచి 7.20 గంటల వరకు సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో మేధావులతో సమావేశం కానున్నారు. ఇవాళ రాత్రి 7:40 నుంచి 8:40 గంటల వరకు బేగంపేట ఐటీసీ కాకతీయలో భాజపా ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో అసెంబ్లీ ఎన్నికలపై భాజపా నేతలతో చర్చించనున్నారు. ఎన్నికల ప్రచార వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం రాత్రి 8.55 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి అమిత్ షా తిరిగి దిల్లీ పయనమవనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని