పచ్చ బంగారం.. రైతన్నకు వరం
ఏళ్ల తరబడి పసుపు పంటను నమ్ముకుని సాగు చేసి బతుకుతున్న రైతన్నల ఈసారి మంచి శుభ వార్త వినిపిస్తోంది. పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా క్వింటాల్ పసుపు ధర రూ.20,000 పలుకుతోంది.
రూ.15,000 దాటిన గిట్టుబాటు ధర
న్యూస్టుడే, పెద్దేముల్, వికారాబాద్
ఏళ్ల తరబడి పసుపు పంటను నమ్ముకుని సాగు చేసి బతుకుతున్న రైతన్నల ఈసారి మంచి శుభ వార్త వినిపిస్తోంది. పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా క్వింటాల్ పసుపు ధర రూ.20,000 పలుకుతోంది. పెట్టుబడి ఖర్చులు పెనుభారంగా మారినా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందకపోయినా సంప్రదాయ పంటగా పసుపును సాగు చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేకున్నా ఏళ్ల తరబడి సాగును వదల్లేదు. నీటి సౌకర్యం ఉన్న రైతులు ఈ పంటను సాగు చేస్తూ వస్తున్నారు. ఎప్పటికైనా కలిసి వస్తుందన్న ఆశ వీరిని ముందుకు నడిపిస్తే ఈసారి అంచనాలకు మించి గిట్టుబాటు కావడం రైతులకు సంతోషాన్ని నింపింది.
పదేళ్ల తరువాత మళ్లీ వచ్చింది
జిల్లాలో పసుపు గిట్టుబాటు ధర 2011లో క్వింటాలు రూ.13,400 పలికింది. ఆ తర్వాత నాలుగేళ్లకు అంటే 2015లో రూ.10,000 ధర వచ్చింది. పదేళ్ల తర్వాత ఇప్పుడు (2024) రూ.15,000కు పైగా ధర పలుకుతోంది. రైతుల ఊహించని విధంగా ఈ ఏడాది గతం కంటే రెట్టింపు ధర పలుకుతోంది. పంట ధర సగటున రూ.10 వేలకు పైగా పలకడంతో పచ్చ బంగారంపై కొత్తగా ఆశలు చిగురిస్తున్నాయి.
బెడ్ పద్ధతిని అనుసరిస్తున్న రైతులు
పసుపు సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు కొత్తగా బెడ్ పద్ధతిని అనుసరిస్తున్నారు. సాధారణ సాగు విధానంలో రైతులు ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు పంటను తీసే వారు. అయితే బెడ్ పద్ధతి వచ్చిన తర్వాత ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. ఎకరాలకు రూ.లక్ష వరకు పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధర స్థిరంగా కొనసాగితే రైతులకు మంచి లాభాలు వస్తాయి. మార్కెట్ సౌకర్యం, గిట్టుబాటు ధర ప్రభుత్వాలు కల్పించాల్సి ఉంది.
చిగురిస్తున్న ఆశలు
పసుపు ధర పెరగడంతో రైతుల్లో కొత్తగా ఆశలు చిగురిస్తున్నాయి. వచ్చే ఏడాది పంట సాగుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది పొలాలను దుక్కి దున్నారు. కోడి ఎరువులను కొనుగోలు చేయడానికి ఆర్డర్లు ఇస్తున్నారు. జిల్లాలో 3 వేల ఎకరాల్లో పంట సాగు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బావులు, బోర్లు, వాగుల సౌకర్యం ఉన్న రైతులు పెద్ద మొత్తంలో సాగు చేయడానికి సిద్ధం అవుతున్నారు.
ప్రోత్సాహం కరవైనా సాగునువదల్లేదు
వాణిజ్య, సుగంధ పంటగా పేరొందిన పసుపు పంటను జిల్లా రైతులు ఏళ్ల తరబడి సాగు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కరవైనా, గిట్టుబాటు ధర, మార్కెట్ సౌకర్యం లేకున్నా పంట సాగు వదల్లేదు. సాగు విస్తీర్ణం తగ్గినా ఎప్పుడో ఓ రోజు ధర వస్తుందన్న నమ్మకంతో కొంత భూమిలో ఈ పంటను పండిస్తున్నారు. స్వల్పకాలిక పంటలు అందుబాటులో ఉన్నా కొందరు రైతులు దీర్ఘకాలిక రకమైన పసుపును సాగు చేస్తూ వస్తున్నారు.
‘లక్ష్మీ’ పంటగా పిలిచే పసుపును జిల్లాలోని పెద్దేముల్, ధారూర్, బంట్వారం, మర్పల్లి, మోమిన్పేట, పరిగి, వికారాబాద్, నవాబుపేట మండలాల్లో 2 వేల ఎకరాల్లో ఈసారి సాగు చేశారు. ప్రస్తుతం విస్తీర్ణం తగ్గి వేయి ఎకరాలు కూడా సాగు కావడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం