logo

మల్కాజిగిరిలో మళ్లీ కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంపై మరోమారు కాంగ్రెస్‌ జెండా ఎగరాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Published : 30 Mar 2024 02:22 IST

బెలూన్లను ఎగరేస్తున్న సునీతారెడ్డి, మహేందర్‌రెడ్డి, బండి రమేష్‌ తదితరులు

మూసాపేట, న్యూస్‌టుడే: మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంపై మరోమారు కాంగ్రెస్‌ జెండా ఎగరాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ కూకట్‌పల్లి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం శుక్రవారం ఎన్‌కేఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ స్థానం గుండెకాయ లాంటిదన్నారు. రేవంత్‌ను గెలిపించి రాష్ట్ర గతినే మార్చిన ఘనత ఈ ప్రాంతానికి దక్కిందన్నారు. ఈసారి పట్నం సునీతారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి ఆ రికార్డును పునరావృతం చేయాలన్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి మాట్లాడారు. పట్నం సునీతారెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంటులో మహిళల వాణి వినిపించడానికి కాంగ్రెస్‌ తనకు అవకాశం కల్పించిందన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండి రమేష్‌, సత్యం శ్రీరంగం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని