జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపణ
ఈనాడు, నిజామాబాద్: జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. నేరం ఒప్పుకోవాలని తన కొడుకుని ఒత్తిడి చేస్తున్నారని.. ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. పంజాగుట్ట ఠాణా పరిధిలో బారికేడ్లను ఢీకొట్టిన కేసులో వేధించడంతో పాటు ఘటన జరిగినప్పుడు దుబాయిలో ఉన్న తన పేరు కూడా చేర్చారన్నారు. తన కొడుకు తప్పు చేస్తే ఉరితీయాలని.. కానీ ఇప్పటికే ట్రయల్ నడుస్తున్న కేసులో ప్రమేయం లేకున్నా ఇరికించడం సరికాదన్నారు. పారదర్శకంగా విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కేసును సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. తన కుమారుడికి ఏమైనా జరిగితే వెస్ట్జోన్ డీసీపీ, ఇతర పోలీసు అధికారులే బాధ్యులవుతారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర