ఉద్దండుల బరి హైదరాబాద్.. వెంకయ్యనాయుడు ఎప్పుడు పోటీ చేశారంటే?
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మొదటి నుంచి రాజకీయ ఉద్దండులకు వేదికగా ఉంది. తొలిసారిగా 1952లో జరిగిన ఎన్నికల్లో ప్రముఖ ఉర్దూకవి, కమ్యూనిస్టు నేత మగ్దూం మొయినోద్దీన్ పీడీఎఫ్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ మొహియుద్దీన్ చేతిలో సుమారు 7వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
మగ్దూం మొయినోద్దీన్, బద్దం బాల్రెడ్డి, ఎం.వెంకయ్యనాయుడు, జి.ఎస్. మెల్కోటే
న్యూస్టుడే, చాంద్రాయణగుట్ట: హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మొదటి నుంచి రాజకీయ ఉద్దండులకు వేదికగా ఉంది. తొలిసారిగా 1952లో జరిగిన ఎన్నికల్లో ప్రముఖ ఉర్దూకవి, కమ్యూనిస్టు నేత మగ్దూం మొయినోద్దీన్ పీడీఎఫ్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ మొహియుద్దీన్ చేతిలో సుమారు 7వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బూర్గుల రామకృష్ణారావు కేబినెట్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జి.ఎస్.మెల్కోటే 1962, 1967 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అనంతరం ఆయన తెలంగాణ ప్రజాసమితి నుంచి బరిలోకి దిగి గెలుపొందారు.
1984 ఎన్నికల్లో నాటి మజ్లిస్ అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ(సలార్) ఈ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వరుసగా ఆరు పర్యాయాలు సలావుద్దీన్ ఒవైసీ ఇక్కడి నుంచి గెలిచారు. 1984 ఎన్నికల్లో మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మాజీ హోం మంత్రులు ప్రభాకర్రెడ్డి, పి.ఇంద్రారెడ్డిలు సైతం ఇక్కడి నుంచి పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. విజయం వారిని వరించలేదు. 1996 ఎన్నికల్లో ఎం.వెంకయ్యనాయుడు హైదరాబాద్ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగి మజ్లిస్కు గట్టిపోటీ ఇచ్చారు. అప్పటి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రస్తుత భాజపా నేత పొంగులేటి సుధాకర్రెడ్డి కూడా కాంగ్రెస్ తరఫున బరిలో ఉండి ఓట్లు చీల్చడంతో వెంకయ్యనాయుడు ఓటమి పాలయ్యారు. భాజపా సీనియర్ నేత బద్దం బాల్రెడ్డి మూడు సార్లు ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. నాటి హుడా ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సైతం ఇక్కడి నుంచి పోటీ చేసినా గెలవలేకపోయారు. 2009 ఎన్నికల్లో సియాసత్ ఉర్దూ దినపత్రిక ఎడిటర్ జాహెద్అలీఖాన్ తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలో చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పుర, కార్వాన్, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ నియోజకవర్గ పరిధిలో ఉండేవి. దీంతో మజ్లిసేతర పార్టీలు గట్టి పోటీ ఇచ్చేవి. అయితే వివిధ పార్టీల మధ్య ఓట్ల చీలికతో మజ్లిస్ 1984 నుంచి వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో తాండూరు, చేవెళ్ల, వికారాబాద్ను నుంచి తొలగించి, వాటి స్థానంలో మలక్పేట, బహదూర్పుర, గోషామహల్ నియోజకవర్గాలను చేర్చారు. దీంతో గోషామహల్ మినహా మిగతా అన్ని సెగ్మెంట్లలో ముస్లిం మైనార్టీల ఓట్లు గణనీయంగా ఉండడంతో మజ్లిస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. భాజపా హైదరాబాద్ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని విరించి హాస్పిటల్స్ ఛైర్పర్సన్ కొంపెల్ల మాధవీలతను బరిలోకి దింపింది. ఆమె ప్రచారంలో దూసుకుపోతుండడంతో మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ సైతం ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్థానంలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణలో వర్సిటీల ఉపకులపతుల నియామకానికి ఈసీ అనుమతి
[ 15-05-2024]
రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతు(వీసీ)ల నియామకానికి ఎన్నికల కమిషన్ అనుమతిచ్చింది. -
ఘనంగా కళాశాల వార్షికోత్సవం
[ 15-05-2024]
నారాయణగూడలోని జాహ్నవి డిగ్రీ కళాశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. -
బోరబండలో యువకుడి దారుణ హత్య
[ 15-05-2024]
బోరబండ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కార్మికనగర్ ప్రాంతంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నిమ్స్ మే సంస్థకు చెందిన గ్రౌండ్లో యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
యశోదాలో ఉద్యోగుల వేతనాల పేరిట రూ.3.26 కోట్లు స్వాహా
[ 15-05-2024]
యశోద ఆసుపత్రి గ్రూపులో పనిచేసిన ఉద్యోగి రూ.3.26 కోట్లు పక్కదారి పట్టించాడు. ఉద్యోగులకు చెల్లించే జీతాలజాబితాలో తన కుటుంబసభ్యుల పేర్లు చేర్చి, 2021 మే నుంచి 2023 సెప్టెంబరు మధ్య ఈ మొత్తం స్వాహా చేశాడు. -
హైదరాబాద్ జూలో తెల్ల పులి మృత్యువాత
[ 15-05-2024]
హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో అరుదైన రాయల్ బెంగాల్ జాతికి చెందిన మగ తెల్లపులి మంగళవారం మృత్యువాత పడింది. తొమ్మిదేళ్లప్రాయం ఉన్న తెల్లపులి అభిమన్యుకు గతేడాది ఏప్రిల్లో ‘నెఫ్రిటీస్’ కిడ్నీ సంబంధమైన జబ్బు ఉన్నట్లు జూ అధికారులు గుర్తించారు. -
గడప దాటి.. ఘనత చాటి
[ 15-05-2024]
రాజధానిలో ఈసారి ఎక్కువ మంది ఓటేశారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టు జరుగుతుండటంతో.. ఏపీ ప్రజలంతా అక్కడికి వెళ్తారని, నగరంలో ఓటేసే వారి సంఖ్య తగ్గుతుందని అంతా అనుకున్నారు. -
ప్రాణాలు కన్నా.. ఆదాయమే మిన్నా?
[ 15-05-2024]
గాలివాన దుమారంతో సోమవారం ముంబయిలోని అనేక హోర్డింగులు, బోర్డులు, ఫ్లెక్సీలు, రేకుల నిర్మాణాలు గాలికి కొట్టుకుపోయాయి. పాత ముంబయిలోని గొటక్పర్ ప్రాంతంలో 100 అడుగుల అక్రమ హోర్డింగు అక్కడున్న పెట్రోలు బంకుపై కుప్పకూలింది. -
దొంగ ఆలోచనలకు రెక్కలు
[ 15-05-2024]
ఒకే ఒక్కడు.. 110 రోజులు.. దేశవ్యాప్తంగా దాదాపు 200 విమానాల్లో ప్రయాణం.. ఇంత బిజీగా దేశంలోని నగరాలు చుట్టేసే ఇతను ఓ దొంగ అంటే ఎవరైనా నమ్ముతారా..? కేవలం విమాన ప్రయాణికులే లక్ష్యంగా చోరీలు చేస్తున్న ఘరానా దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. -
తొలగిస్తాం.. నియమిస్తాం
[ 15-05-2024]
అనుమతి లేకుండా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, ఇతర పద్ధతుల్లో నియామకాలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 2న అన్ని శాఖలను ఆదేశించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ ఫిబ్రవరి 6న సర్కారు ఆదేశాలను గుర్తు చేస్తూ.. సర్క్యులర్ జారీ చేశారు. -
స్ట్రాంగ్గా భద్రత
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నిర్విరామంగా విధులు నిర్వహించిన ఎన్నికల అధికారులు పోలింగ్ ముగిసిన గంటల వ్యవధిలోనే మళ్లీ అప్రమత్తమయ్యారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4 జరుగనుండడంతో 3 వారాలు ఈవీఎంలను భద్రపరిచేందుకు ప్రణాళిక వేశారు. -
సమయాలు మార్చితే సరిపడా బస్సులు
[ 15-05-2024]
నగర శివార్లలో కోకొల్లలుగా కళాశాలలున్నాయి. అందులోని విద్యార్థులకు చాలా కళాశాలలు ప్రయాణ వసతి కల్పించవు. బస్సులను సర్దుబాటు చేయడం ఆర్టీసీకి కత్తిమీద సామే. దీంతో గంట సమయం తేడాతో మొదలుపెట్టాలని కళాశాలలను కోరుతూ ఆర్టీసీ లేఖలు రాసింది. -
స్మార్ట్గా చదివెయ్
[ 15-05-2024]
వేసవి సెలవుల్లో విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్, సామాజిక మాధ్యమాలకు పరిమితం కాకూడదనే ఉద్దేశంతో.. విద్యాశాఖ వారిలో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టింది. లిటరసీ క్లౌడ్ మాధ్యమం ద్వారా ఇంటి వద్దనే ఆకర్షణీయమైన తెలుగు, ఆంగ్ల పుస్తకాలను రూమ్ టూ రీడ్ ఇండియా ట్రస్ట్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. -
సైబర్ నేరాలపై కన్ను
[ 15-05-2024]
నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి స్టాక్ ట్రేడింగ్ సలహాలిస్తామంటూ ఇటీవల వాట్సప్లో సందేశం వచ్చింది. ఆ నంబరును సంప్రదించగా సైబర్ నేరగాళ్లు అతనిని సుమారు 200 మంది ఉన్న వాట్సాప్ గ్రూపులో చేర్చారు. ఎల్కేపీఎస్ఎల్ అనే యాప్ ద్వారా షేర్ల క్రయవిక్రయాలు చేయాలని సూచించగా.. బాధితుడు అలాగే చేశారు. -
వసతులు అధ్వానం.. బతుకు దుర్భరం
[ 15-05-2024]
బతుకుదెరువు నిమిత్తం తాండూరుకు వచ్చే నాపరాయి కార్మికుల జీవనం రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. రెక్కలు ముక్కలు చేసుకొని రాత్రీ పగలూ పని చేసినా కనీస వసతులూ కరవై బతుకు బరువై చివరకు ప్రాణాలు సైతం పణంగా పెట్టాల్సి వస్తోంది. -
సిబ్బంది సరిపోరు.. పారిశుద్ధ్యం పట్టదు
[ 15-05-2024]
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య లోపం పెరిగిపోతోంది. ఎక్కడి చెత్త అక్కడే నిలిచి గాలికి పైకిలేస్తూ, వర్షం వస్తే నీరు నిలిచి దుర్గంధం వ్యాపిస్తూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తోంది. ‘స్వచ్ఛతా పక్వాడ’ పేరుతో వారోత్సావాలు నిర్వహిస్తున్నా అవి నామమాత్రంగానే మారుతున్నాయి. -
పరిణతి చాటిన ఓటరు
[ 15-05-2024]
జిల్లాలో గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఓటర్లను ఎలాగైనా పోలింగ్ కేంద్రాలకు తెచ్చి ఓటింగ్ శాతాన్ని పెంచాలని అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. -
స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలు
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఓటింగ్ యంత్రా (ఈవీఎం)లను చేవెళ్ల మండలం గొల్లపల్లి శివారులోని బీఎస్ఐటీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. -
లెక్కలు వేస్తూ.. అంచనాకు వస్తూ..!
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తి కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరి లెక్కల్లో వారు మునిగితేలుతున్నారు. వికారాబాద్ జిల్లాలో మొత్తం మీద 68.88 శాతం పోలింగ్ నమోదైంది. -
అభ్యర్థుల ఓటువిడుపు
[ 15-05-2024]
హమ్మయ్య.. ఎన్నికల కసరత్తు దాదాపు ముగిసింది. అసలైన పోలింగ్ తంతు సోమవారం పూర్తయింది. ఇక ఫలితాలే తరువాయి. అందుకు జూన్ 4 వరకు అంటే 20 రోజుల సమయం ఉంది. -
రోడ్డు ప్రమాదంలో అమ్జదుల్లా ఖాన్కు గాయాలు
[ 15-05-2024]
ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్కు తీవ్ర గాయాలయ్యాయి. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువు ఒకరిని మంగళవారం ఉదయం పరామర్శించి, ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నారు. -
ఓటరు నాడి పట్టేందుకు పోస్ట్పోల్ సర్వేలు
[ 15-05-2024]
పోలింగ్ ముగిసింది. సిటీ పరిధిలో ఒక అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటూ నాలుగు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్రూమ్లకు చేరింది. -
అమ్మ ప్రేమ అనిర్వచనీయం
[ 15-05-2024]
మన సంస్కృతిలో అమ్మకే తొలి ప్రాధాన్యమని విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి అన్నారు. అభినందన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. -
ఫెడెక్స్, ఆన్లైన్ పార్సిల్ మోసాలతో జాగ్రత్త
[ 15-05-2024]
ఫెడెక్స్ (ఫెడరల్ ఎక్స్ప్రెస్), కొరియర్, ఆన్లైన్ పార్సిల్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. బాధితులు బుక్ చేయకున్నా కేటుగాళ్లు ఫోన్లో సంప్రదించి సీబీఐ, ముంబయి పోలీసులు, కేంద్ర పోలీసు ఏజెన్సీల అధికారులమంటూ భయపెట్టి బాధితుల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. -
నిజాలు మాట్లాడినందుకే నాపై అక్రమ కేసులు
[ 15-05-2024]
నిజాలు మాట్లాడినందుకే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని హైదరాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి మాధవీలత అన్నారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను పతకాలుగా భావిస్తానన్నారు. -
ధూళీ దుమ్ము.. తీయలేరు దమ్ము
[ 15-05-2024]
పరిమితికి మించి సూక్ష్మ ధూళి కణాల స్థాయి నమోదవుతోంది. వాహనాల పొగ, చెత్తను ఇష్టానుసారం కాల్చడం, భవన, రహదారుల నిర్మాణ కార్యకలాపాల కారణంగా కాలుష్య ఉద్గారాలు గాల్లోకి చేరుతున్నాయి. దీర్ఘకాలంలో శ్వాసకోశ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
రీఫండ్ విషయంలో వివాదం.. ట్రావోలుక్కు మొట్టికాయలు
[ 15-05-2024]
విమాన టిక్కెట్ల బుకింగ్, రీఫండ్ విషయంలో సరైన సేవలు అందించని ట్రావోలుక్ సంస్థకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-2 మొట్టికాయలు వేసింది. విమాన టిక్కెట్ల రుసుము రూ.12,360, 12శాతం వడ్డీతో కలిపి చెల్లించడంతోపాటు రూ.5వేలు పరిహారం, రూ.2వేలు కేసు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. -
మూడో అంతస్తు నుంచి పడి బాలుడు దుర్మరణం
[ 15-05-2024]
బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి కింద పడి దుర్మరణం చెందాడు. పేట్బషీరాబాద్ ఎస్ఐ సురేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కుత్బుల్లాపూర్ డివిజన్ వాజ్పేయీనగర్కు చెందిన బి.రాజు కుటుంబం స్థానిక అపార్టుమెంట్లోని మూడో అంతస్తులో నివాసం ఉంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే
-
టెలికాం టారిఫ్లు మన దగ్గరే తక్కువ: ఎయిర్టెల్ సీఈఓ
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి