logo

‘ఎంపీ రంజిత్‌రెడ్డి పెద్ద స్కాం మాస్టర్‌’

చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి స్కాం మాస్టర్‌ అని భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

Published : 06 May 2024 03:53 IST

మాట్లాడుతున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

రాయదుర్గం, న్యూస్‌టుడే: చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి స్కాం మాస్టర్‌ అని భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. భారీ కుంభకోణాలకు పాల్పడిన అవినీతిపరుడని చెప్పారు. గతంలో పౌల్ట్రీ రంగానికి సంబంధించి పలు అవకతవకలకు పాల్పడిన చరిత్ర ఆయనకు ఉందన్నారు. ఆదివారం ఆయన ఖాజాగూడలోని అపార్ట్‌మెంట్లు, ఐటీ పార్కులలో పర్యటించి ప్రచారం చేశారు. అక్కడ నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ధర తక్కువ ఉండే చిన్న కోడిగుడ్లను అంగన్‌వాడీ సెంటర్లు, పాఠశాలలకు అధిక ధరల్లో పంపిణీ చేసి పెద్ద మొత్తంలో డబ్బు దండుకున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఆయనకు ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ తాను నిస్వార్థ సేవ చేస్తానని, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని, తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. కేంద్రంలో ప్రధాని మోదీ ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి, భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఉన్నతంగా తీర్చిదిద్దారన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని