చివరి ప్రయత్నంగా.. సకుటుంబ సమేతంగా
కష్ట సుఖాల్లో, మంచి చెడుల్లో మన వెంట ముందుండి నడిచేది కుటుంబం మాత్రమే. మన గెలుపోటముల వెంట నిలిచేది వారే. పార్లమెంటు ఎన్నికల పోలింగ్కు గడువు దగ్గరపడడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
నేతల తరఫున రంగంలోకి కుటుంబ సభ్యులు
ప్రజల్లో కలిసిపోతూ తమవారి గెలుపు కోసం కృషి
చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి తరఫున ఆయన సతీమణి డాక్టర్ సంగీతారెడ్డి మొయినాబాద్ మండలంలో ప్రచారంలో పాల్గొన్నారు. చిలుకూరులో స్వయంగా కరపత్రాలు పంచి ఓట్లు అభ్యర్థించారు.
ఈనాడు, హైదరాబాద్: కష్ట సుఖాల్లో, మంచి చెడుల్లో మన వెంట ముందుండి నడిచేది కుటుంబం మాత్రమే. మన గెలుపోటముల వెంట నిలిచేది వారే. పార్లమెంటు ఎన్నికల పోలింగ్కు గడువు దగ్గరపడడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గెలుపే లక్ష్యంగా హోరెత్తిస్తున్నారు. బస్తీలు, కాలనీల్లో తిరుగుతూ అభ్యర్థులకు మద్దతుగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ గెలిపిస్తే తప్పకుండా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీలు ఇస్తున్నారు. భర్తల తరఫున భార్యలు ప్రచారం చేస్తూ మహిళలకు బొట్టు పెట్టి మరీ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తండ్రులకు మద్దతుగా కుమారులు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగ, వ్యాపార బాధ్యతల్లో ఉన్నవారు సైతం తాత్కాలికంగా వాటిని పక్కన పెట్టి తిరుగుతున్నారు. కొందరు నేరుగా అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తుంటే మరికొందరు తెరవెనుక అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రచారానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎవరి తరఫున ఎవరెవరంటే..
చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి తరఫున ఆయన కుటుంబ సభ్యులు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ గెలిపించాలని కోరుతున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి భాజపా నుంచి బరిలో ఉన్న కొండా విశ్వేశ్వర్రెడ్డి వైపు నుంచి ఆయన భార్య డాక్టర్ సంగీతరెడ్డి ప్రచారంలోకి దిగారు. కాలనీలు, గ్రామీణ ప్రాంతాల్లో కలియ తిరుగుతున్నాయి. ఉదయాన్నే మార్నింగ్ వాకర్స్ను కలుస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. విశ్వేశ్వర్రెడ్డి ఇద్దరు కుమారులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. మల్కాజిగిరి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ తరఫున భార్యతోపాటు కోడలు క్షమిత ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో తిరుగుతూ ఈటల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం తరఫున కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానంకు మద్దతుగా నటుడు అల్లుఅర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్రెడ్డి ఓటర్లను కలుస్తున్నారు. మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతకు అండగా ఆమె భర్త మాజీ మంత్రి మహేందర్రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. సికింద్రాబాద్ భాజపా అభ్యర్థి కిషన్రెడ్డికి మద్దతుగా ఆయన భార్య కావ్య, కుమార్తె ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతున్నారు. హైదరాబాద్లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ గెలుపు కోసం ఆయన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అన్నీ తానై శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ప్రచార పర్వం ముగియడానికి మరో 3 రోజులే ఉండడంతో అభ్యర్థుల కుటుంబసభ్యులు పూర్తిగా క్షేత్రస్థాయిలో ప్రచారంలో నిమగ్నమై ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది గంటలకే పార్కులకు తాళం
[ 20-05-2024]
విశ్రాంతి లేని నగరం హైదరాబాద్. ఎప్పుడు రోడ్డుపైకి వెళ్లినా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. రాత్రి వేళల్లోనూ ఐటీకారిడార్, కొన్ని ప్రధాన రహదారులపై కార్యాలయాలు పనిచేస్తుంటాయి. -
కిలోమీటరున్నర పనులు.. నాలుగు నెలలు
[ 20-05-2024]
నగరంలో వానాకాలం ప్రారంభం నాటికే రహదారులు, భూగర్భ తవ్వకాల పనులు పూర్తి చేయాలి. లేదంటే వరదలతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. -
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?
[ 20-05-2024]
హైదరాబాద్ మెట్రోలో సగటున ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారి నుంచి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థకు టికెట్ల ద్వారా రూ.కోటిన్నర ఆదాయం సమకూరుతోంది. -
కంటికి రెప్పలా.. కదిలారు
[ 20-05-2024]
పిల్లల్లో ఏర్పడే కంటి క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం ‘వైటథాన్ రన్’ పేరిట పరుగు నిర్వహించారు.హెచ్సీయూలో జరిగిన ఈ పరుగును మాదాపూర్ డీసీపీ డా.జి.వినీత్ ప్రారంభించారు. -
అసెంబ్లీకి ఓటెత్తి..లోక్ సభకు అనాసక్తి
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో..ప్రధాన పార్టీల అభ్యర్థులు అసెంబ్లీ సెగ్మెంట్లలో నమోదైన పోలింగ్ శాతాన్ని పోల్చుకుంటున్నారు. -
ఉద్యానాలు.. ఆక్రమించేశారు
[ 20-05-2024]
హైదరాబాద్ శివారులోని దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన రూ.వంద కోట్ల విలువైన మూడెకరాల స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించేశారు. -
భూనిర్వాసితులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశ చూపెట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసంచేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని -
ప్రపంచంలోనే అరుదు.. బాంబే బ్లడ్ గ్రూపు
[ 20-05-2024]
బాంబే బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ అని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
స్పందనలో వేగం.. నష్టానికి కళ్లెం
[ 20-05-2024]
అగ్నిప్రమాదాల సమయంలో ‘తక్షణ ప్రతిస్పందన సమయం’ పెరగడంతో ఆస్తి నష్టం తగ్గుతోంది. ఫైరింజన్ వెళ్లడం కాస్త ఆలస్యమైనా కోట్లాది రూపాయల ఆస్తి కాలిబూడిదయ్యే ప్రమాదం ఉంది. -
బెట్టింగ్లతో అప్పులపాలై.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
[ 20-05-2024]
ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఎంఎస్ఎంఈ యూనిట్ల అద్దె కష్టాలకు చెక్
[ 20-05-2024]
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అద్దె కష్టాలు, యూనిట్ విస్తరణ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు యూనిట్ల తరలింపునకు తొలి అడుగు పడింది. -
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
[ 20-05-2024]
పీర్జాదిగూడ నగరంలో అవిశ్వాస తీర్మానంపై ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, భారాసలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పాటు బల నిరూపణకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సమన్వయకర్తగా అంబర్పేట జైస్వాల్ గార్డెన్కు చెందిన మధుసత్యం గౌడ్ నియమితులయ్యారు. -
ఎరువు.. కావాలి ఆదరువు
[ 20-05-2024]
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
పల్లె పోరుకు కసరత్తు
[ 20-05-2024]
స్థానిక సమరానికి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘నేలబిడ్డల’పై.. నిప్పులు చిమ్మిన నింగి
[ 20-05-2024]
ప్రకృతితో మమేకమయ్యే హలధారి.. వానకు తడిసి.. ఎండకు ఎండి పంటే ప్రాణంగా ముందుకు ‘సాగు’తాడు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. -
కలుద్దామని పిలిచి.. గొలుసు చోరీ
[ 20-05-2024]
సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తులు.. ఓ ఐటీ ఉద్యోగిని హింసించి బంగారు గొలుసు అపహరించిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..