కమలం వెంటుంది.. అభివృద్ధి ముందుంది
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటరు అవసరం. ఐటీ కారిడార్ను ఇటువైపు కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది.
విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటరు అవసరం. ఐటీ కారిడార్ను ఇటువైపు కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక కారిడార్ వస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ః సికింద్రాబాద్ - మేడ్చల్, సికింద్రాబాద్ - ఘట్కేసర్, నేరుగా ఐటీ కారిడార్కు ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచేందుకు కృషి చేసి ప్రజారవాణాను పటిష్టం చేస్తాను. ః జీహెచ్ఎంసీలో భాజపాకు పట్టుంది. ఇక్కడి ఓటర్లు చాలా చైతన్యవంతులు. భారాసకు ఓటేసినా ప్రయోజనం లేదు. కాంగ్రెస్ కేంద్రంలో వచ్చేది లేదు. అందుకే భాజపాకు ఓటేస్తారు. ః ఈసారి లక్ నాదే. కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తుంది. ఇక్కడ విజయం సాధించడమే నా ముందున్న లక్ష్యం. తర్వాత పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తాను. మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పని చేస్తాను.
‘‘మల్కాజిగిరిలో ప్రజలే కథానాయకులుగా నిలబడి నన్ను గెలిపిస్తారు. మూడోసారి మోదీ ప్రధాని అవుతున్నారు. అభివృద్ధి ఎవరితో సాధ్యమో ఇక్కడి ఓటర్లకు స్పష్టమైన అవగాహన ఉంది. ఈ ఎన్నికల్లో నాకే విజయం కట్టబెడతారనే నమ్మకం ఉంది. నియోజకవర్గంలో దేశంలోనే అత్యధిక ఓటర్లున్నా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది.’’ అని మల్కాజిగిరి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ తెలిపారు. నియోజకవర్గంలోని సమస్యలు, ప్రాధామ్యాలు, ఇతర అంశాలపై ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు.
దేశంలోనే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గమైనా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. వందల సంఖ్యలో చెరువులు కబ్జాకు గురయ్యాయి. వీటికి పూర్వవైభవం తీసుకురావాల్సి ఉంది. జవహర్నగర్ డంపింగ్ యార్డుతో భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యాయి. ఈ ప్రాంతాన్ని చక్కటి పార్కులు, చెట్లతో సుందరీకరించాలి. మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
మీ విజయానికి దోహదపడే అంశాలు ఏంటి?
మోదీ తిరుగులేని నాయకుడు. మూడోసారి ప్రధాని అవుతున్నారు. ఈ పదేళ్లలో దేశాన్ని సుభిక్షంగా, భద్రంగా ఉంచడంతో పాటు అభివృద్ధి పథంలో తీసుకెళ్లారు. 23 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఉంటున్నాను. నాదంతా ప్రజా జీవితం, నేను తెలియని వారు ఉండరు. ఇవన్నీ నా విజయానికి దోహదపడతాయి. భాజపా విజయం సాధిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలయ్యే అన్ని సంక్షేమ పథకాలు అందేలా చేస్తాం. పేదలకు ఇళ్లు కట్టిస్తాం.
మీ ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు?
కాంగ్రెస్, భారాస అభ్యర్థులు ఎవరూ నా ప్రత్యర్థులు కారు. ఇక్కడి ఓటర్లు ఏకపక్షంగా నన్నే గెలిపిస్తారని పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో భాజపా విజయం సాధించే సీట్లలో మొట్టమొదటి స్థానం మల్కాజిగిరి నియోజకవర్గానిదే.
మిమ్మల్ని స్థానికేతరుడు అంటున్న వారికి మీరిచ్చే సమాధానం?
మల్కాజిగిరి నియోజకవర్గం నడిబొడ్డున నా ఇల్లు ఉంది. 32 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా. పుట్టింది కమలాపూర్లోనైనా హైదరాబాద్లోనే చదువుకున్నా. అందుకే ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నా. ఇక్కడ అన్నివర్గాల ప్రజలతో మమేకమై ఉన్నాను. ఉద్యమ బిడ్డగా, మంత్రిగా, మచ్చలేని వ్యక్తిగా అందరికీ నేను సుపరిచితమే. నేను పక్కా లోకల్. గతంలో ప్రశ్నించే గొంతుకనవుతానని ప్రజలను మభ్యపెట్టి రేవంత్రెడ్డి గెలిచి ఐదేళ్లు ఈ ప్రాంతానికి రాలేదు. ఇప్పుడు మళ్లీ వస్తున్నారు.
ప్రజారవాణా మెరుగుకు ఏం చేస్తారు?
అడుగడుగునా రైల్వే గేట్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో రైల్వే లైన్లున్నా లోకల్ రైళ్ల ప్రయాణం లేదు. మేడ్చల్, ఉప్పల్, ఘట్కేసర్లో పైవంతెనలు కావాలి. మల్కాజిగిరిలో మెట్రో రైలు రావాలి. ఎంఎంటీఎస్ రెండోదశ అందుబాటులోకొచ్చినా రైల్వే వంతెనల్లేక తిప్పలేకపోతున్నారు. ప్రజారవాణాను పటిష్టం చేస్తాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది గంటలకే పార్కులకు తాళం
[ 20-05-2024]
విశ్రాంతి లేని నగరం హైదరాబాద్. ఎప్పుడు రోడ్డుపైకి వెళ్లినా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. రాత్రి వేళల్లోనూ ఐటీకారిడార్, కొన్ని ప్రధాన రహదారులపై కార్యాలయాలు పనిచేస్తుంటాయి. -
కిలోమీటరున్నర పనులు.. నాలుగు నెలలు
[ 20-05-2024]
నగరంలో వానాకాలం ప్రారంభం నాటికే రహదారులు, భూగర్భ తవ్వకాల పనులు పూర్తి చేయాలి. లేదంటే వరదలతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. -
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?
[ 20-05-2024]
హైదరాబాద్ మెట్రోలో సగటున ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారి నుంచి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థకు టికెట్ల ద్వారా రూ.కోటిన్నర ఆదాయం సమకూరుతోంది. -
కంటికి రెప్పలా.. కదిలారు
[ 20-05-2024]
పిల్లల్లో ఏర్పడే కంటి క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం ‘వైటథాన్ రన్’ పేరిట పరుగు నిర్వహించారు.హెచ్సీయూలో జరిగిన ఈ పరుగును మాదాపూర్ డీసీపీ డా.జి.వినీత్ ప్రారంభించారు. -
అసెంబ్లీకి ఓటెత్తి..లోక్ సభకు అనాసక్తి
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో..ప్రధాన పార్టీల అభ్యర్థులు అసెంబ్లీ సెగ్మెంట్లలో నమోదైన పోలింగ్ శాతాన్ని పోల్చుకుంటున్నారు. -
ఉద్యానాలు.. ఆక్రమించేశారు
[ 20-05-2024]
హైదరాబాద్ శివారులోని దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన రూ.వంద కోట్ల విలువైన మూడెకరాల స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించేశారు. -
భూనిర్వాసితులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశ చూపెట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసంచేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని -
ప్రపంచంలోనే అరుదు.. బాంబే బ్లడ్ గ్రూపు
[ 20-05-2024]
బాంబే బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ అని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
స్పందనలో వేగం.. నష్టానికి కళ్లెం
[ 20-05-2024]
అగ్నిప్రమాదాల సమయంలో ‘తక్షణ ప్రతిస్పందన సమయం’ పెరగడంతో ఆస్తి నష్టం తగ్గుతోంది. ఫైరింజన్ వెళ్లడం కాస్త ఆలస్యమైనా కోట్లాది రూపాయల ఆస్తి కాలిబూడిదయ్యే ప్రమాదం ఉంది. -
బెట్టింగ్లతో అప్పులపాలై.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
[ 20-05-2024]
ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఎంఎస్ఎంఈ యూనిట్ల అద్దె కష్టాలకు చెక్
[ 20-05-2024]
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అద్దె కష్టాలు, యూనిట్ విస్తరణ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు యూనిట్ల తరలింపునకు తొలి అడుగు పడింది. -
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
[ 20-05-2024]
పీర్జాదిగూడ నగరంలో అవిశ్వాస తీర్మానంపై ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, భారాసలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పాటు బల నిరూపణకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సమన్వయకర్తగా అంబర్పేట జైస్వాల్ గార్డెన్కు చెందిన మధుసత్యం గౌడ్ నియమితులయ్యారు. -
ఎరువు.. కావాలి ఆదరువు
[ 20-05-2024]
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
పల్లె పోరుకు కసరత్తు
[ 20-05-2024]
స్థానిక సమరానికి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘నేలబిడ్డల’పై.. నిప్పులు చిమ్మిన నింగి
[ 20-05-2024]
ప్రకృతితో మమేకమయ్యే హలధారి.. వానకు తడిసి.. ఎండకు ఎండి పంటే ప్రాణంగా ముందుకు ‘సాగు’తాడు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. -
కలుద్దామని పిలిచి.. గొలుసు చోరీ
[ 20-05-2024]
సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తులు.. ఓ ఐటీ ఉద్యోగిని హింసించి బంగారు గొలుసు అపహరించిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..