నాలాల్లో తేలుతున్న ప్రాణాలు
వానలు మొదలవడంతోనే.. మంగళవారం ఇద్దరు అమాయకులు బేగంపేట వద్ద నాలాలో పడి చనిపోయారు.
బేగంపేటలో ఇద్దరు మృతితో నగరవాసుల్లో ఆందోళన
ఈనాడు, హైదరాబాద్: వానలు మొదలవడంతోనే.. మంగళవారం ఇద్దరు అమాయకులు బేగంపేట వద్ద నాలాలో పడి చనిపోయారు. వర్షాకాలం పూర్తయ్యే నాటికి ఇలాంటి దారుణాలు ఎన్ని చోటుచేసుకుంటాయో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంజినీర్ల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమవుతోందనే విమర్శలొస్తున్నాయి. నాలా నిర్మాణ పనులు, పూడికతీత, నాలా సేఫ్టీ ఆడిట్, భద్రతా చర్యల పేరుతో రూ.కోట్ల ప్రజాధనాన్ని కొందరు అవినీతి ఇంజినీర్లు దారి మళ్లిస్తున్నారు. సద్వినియోగం అవ్వాల్సిన నిధులు.. వ్యక్తుల జేబుల్లోకి వెళ్తున్నాయి. సాఫీగా సాగిపోవాల్సిన వరద.. జనాలను బలి తీసుకుంటోంది. రూ.కోట్లు ఖర్చవుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా.. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావట్లేదు.
ప్రమాదాలకు కారణాలివే.. రూ.985కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్ల కిందట వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ) మొదలైంది. సుమారు రూ.650 కోట్లు ఖర్చయ్యాయి. కానీ.. పూర్తయిన పనులకు, చేసిన వ్యయానికి ఏమాత్రం పొంతన లేదనే విమర్శలొస్తున్నాయి. నాలా తవ్వుతుంటే బండరాళ్లు అడ్డొచ్చాయని, గుట్టలను తొలగించామని, ఎక్కువ ఇనుము వాడామని.. కొందరు ఇంజినీర్లు భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు స్థానికులు గగ్గోలుపెడుతున్నారు. రాంనగర్, సికింద్రాబాద్, బాగ్లింగంపల్లి, తదితర ప్రాంతాల్లో నాలా పనులు.. ఆశించిన ఫలితం ఇవ్వట్లేదని వాపోతున్నారు.
నాలా సేఫ్టీ ఆడిట్ పేరుతోనూ అవినీతి..
కొన్నేళ్ల కిందట మల్కాజిగిరిలోని ఓ వీధిలో ఆడుకుంటున్న చిన్నారి నాలాలో పడి, పక్కనున్న బండ చెరువులో శవమై తేలి ంది. దానిపై నగరవ్యాప్తంగా ఆందోళనలు రేగాయి. పరిస్థితిని అదుపు చేయడంలో భాగంగా నాలాల పొడవునా సేఫ్టీ ఆడిట్ చేపడతామని, ఓపెన్ నాలాలను గుర్తించి పైకప్పు లేదా జాలీలను ఏర్పాటు చేస్తామని, నాలా ప్రమాదాలను నియంత్రిస్తామని జీహెచ్ఎంసీ ప్రకటించింది. అయితే.. సేఫ్టీ ఆడిట్ మొక్కుబడిగా మారింది. ఈ ఏడాదిలో చేపట్టిన సేఫ్టీ ఆడిట్ నత్తనడకన సాగుతోంది. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించడంలో అధికారులు, ప్రైవేటు కన్సల్టెన్సీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. బేగంపేట నాలా మీదుగా వెళ్లే రైల్వే ట్రాకు వద్ద జీహెచ్ఎంసీ భద్రత చర్యలు తీసుకోకపోవడం వల్లనే మంగళవారం రాత్రి నాలా ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు వాపోయారు.
నాలాల పూడికతీత మే మొదటి వారానికి పూర్తవ్వాలి. పనులు అయ్యింది మాత్రం 54శాతమే. 952.71కి.మీ నాలాల్లో 3.8లక్షల క్యూబిక్ మీటర్ల వ్యర్థాలను రూ.56.38కోట్లతో వెలికి తీయాలని జోన్లవారీగా పనులు చేపట్టగా, ఇప్పటి వరకు 2.09క్యూబిక్ మీటర్ల పూడికతీత మాత్రమే జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది గంటలకే పార్కులకు తాళం
[ 20-05-2024]
విశ్రాంతి లేని నగరం హైదరాబాద్. ఎప్పుడు రోడ్డుపైకి వెళ్లినా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. రాత్రి వేళల్లోనూ ఐటీకారిడార్, కొన్ని ప్రధాన రహదారులపై కార్యాలయాలు పనిచేస్తుంటాయి. -
కిలోమీటరున్నర పనులు.. నాలుగు నెలలు
[ 20-05-2024]
నగరంలో వానాకాలం ప్రారంభం నాటికే రహదారులు, భూగర్భ తవ్వకాల పనులు పూర్తి చేయాలి. లేదంటే వరదలతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. -
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?
[ 20-05-2024]
హైదరాబాద్ మెట్రోలో సగటున ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారి నుంచి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థకు టికెట్ల ద్వారా రూ.కోటిన్నర ఆదాయం సమకూరుతోంది. -
కంటికి రెప్పలా.. కదిలారు
[ 20-05-2024]
పిల్లల్లో ఏర్పడే కంటి క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం ‘వైటథాన్ రన్’ పేరిట పరుగు నిర్వహించారు.హెచ్సీయూలో జరిగిన ఈ పరుగును మాదాపూర్ డీసీపీ డా.జి.వినీత్ ప్రారంభించారు. -
అసెంబ్లీకి ఓటెత్తి..లోక్ సభకు అనాసక్తి
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో..ప్రధాన పార్టీల అభ్యర్థులు అసెంబ్లీ సెగ్మెంట్లలో నమోదైన పోలింగ్ శాతాన్ని పోల్చుకుంటున్నారు. -
ఉద్యానాలు.. ఆక్రమించేశారు
[ 20-05-2024]
హైదరాబాద్ శివారులోని దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన రూ.వంద కోట్ల విలువైన మూడెకరాల స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించేశారు. -
భూనిర్వాసితులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశ చూపెట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసంచేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని -
ప్రపంచంలోనే అరుదు.. బాంబే బ్లడ్ గ్రూపు
[ 20-05-2024]
బాంబే బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ అని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
స్పందనలో వేగం.. నష్టానికి కళ్లెం
[ 20-05-2024]
అగ్నిప్రమాదాల సమయంలో ‘తక్షణ ప్రతిస్పందన సమయం’ పెరగడంతో ఆస్తి నష్టం తగ్గుతోంది. ఫైరింజన్ వెళ్లడం కాస్త ఆలస్యమైనా కోట్లాది రూపాయల ఆస్తి కాలిబూడిదయ్యే ప్రమాదం ఉంది. -
బెట్టింగ్లతో అప్పులపాలై.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
[ 20-05-2024]
ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఎంఎస్ఎంఈ యూనిట్ల అద్దె కష్టాలకు చెక్
[ 20-05-2024]
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అద్దె కష్టాలు, యూనిట్ విస్తరణ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు యూనిట్ల తరలింపునకు తొలి అడుగు పడింది. -
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
[ 20-05-2024]
పీర్జాదిగూడ నగరంలో అవిశ్వాస తీర్మానంపై ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, భారాసలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పాటు బల నిరూపణకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సమన్వయకర్తగా అంబర్పేట జైస్వాల్ గార్డెన్కు చెందిన మధుసత్యం గౌడ్ నియమితులయ్యారు. -
ఎరువు.. కావాలి ఆదరువు
[ 20-05-2024]
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
పల్లె పోరుకు కసరత్తు
[ 20-05-2024]
స్థానిక సమరానికి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘నేలబిడ్డల’పై.. నిప్పులు చిమ్మిన నింగి
[ 20-05-2024]
ప్రకృతితో మమేకమయ్యే హలధారి.. వానకు తడిసి.. ఎండకు ఎండి పంటే ప్రాణంగా ముందుకు ‘సాగు’తాడు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. -
కలుద్దామని పిలిచి.. గొలుసు చోరీ
[ 20-05-2024]
సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తులు.. ఓ ఐటీ ఉద్యోగిని హింసించి బంగారు గొలుసు అపహరించిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..