సన్నద్ధత కరవై.. గాలిలో దీపమై
ప్రకృతి ప్రకోపం.. ప్రభుత్వ శాఖల సన్నద్ధత లోపంతో నగరంలో కొన్ని వేల మందికి మంగళవారం కాళరాత్రిగా మారింది.
1500 విద్యుత్తు ఫీడర్లలో అంతరాయాలు..
చెట్లు కూలిన చోట పునరుద్ధరణకు కొన్ని ప్రాంతాల్లో 26 గంటలు
హుడాకాలనీలో విద్యుత్తు అధికారులకు ఫిర్యాదు చేస్తున్న కాలనీలవాసులు
ఈనాడు, హైదరాబాద్: ప్రకృతి ప్రకోపం.. ప్రభుత్వ శాఖల సన్నద్ధత లోపంతో నగరంలో కొన్ని వేల మందికి మంగళవారం కాళరాత్రిగా మారింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో పోయిన కరెంట్.. కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉదయం, మరికొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత కానీ పునరుద్ధరించలేకపోయారు. మియాపూర్ బాలాజీనగర్లో మధ్యాహ్నం 3 గంటలకు కరెంట్ వచ్చింది. నగరంలోని పలు ప్రాంతాల్లో 26గంటల పాటు కరెంట్ లేకపోవడంతో నరకం చవిచూశారు.
అకాల వర్షాలను విస్మరించారు.. వేసవిలో కురిసే అకాల వర్షం, ఈదురుగాలులతో తలెత్తే సమస్యలను డిస్కం విస్మరించింది. భారీ గాలులకు చెట్లు, కొమ్మలు, ఫ్లెక్సీలు పెద్దఎత్తున 11కేవీ, 33కేవీ లైన్లపై పడటంతో సరఫరాకు అంతరాయం కలిగింది. 100 వరకు ఉపకేంద్రాల్లో అంధకారం నెలకొంది. దాదాపు 1500 ఫీడర్ల వరకు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్తు డిమాండ్ 3900 మెగావాట్ల నుంచి ఒక్కసారిగా వెయ్యి మెగావాట్లకు పడిపోయింది. అర్ధరాత్రి వరకు 1371 ఫీడర్లను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.
విద్యుత్తు కార్యాలయం ముట్టడి..
చందానగర్: చందానగర్ హుడాకాలనీ విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బుధవారం మధ్యాహ్నం వరకూ చాలా కాలనీల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేక పోయారు. కరెంట్ లేక బోర్లు పనిచేయక తాగునీటికి బస్తీలవాసులు అవస్థలు పడ్డారు. దీంతో సాయంత్రం కార్యాలయానికి కాలనీవాసులు భారీగా చేరుకొని ఆందోళన వ్యక్తంచేశారు.
వర్షం సమయంలో తగ్గిన సిటీ బస్సులు
మంగళవారం కురిసిన వర్షం సమయంలో కొన్ని మార్గాల్లో సిటీ బస్సులు తిరగలేదని ప్రయాణికులు వాపోయారు. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ జామ్లతో కొన్ని ఇరుక్కోగా.. మరికొన్ని చోట్ల చెట్లు కొమ్మలు విరిగిపడినందున మరికొన్ని సర్వీసులు రద్దు చేశారు. వర్షం ఆరంభంలో ఉన్న సర్వీసులన్నీ.. గమ్యస్థానానికి వెళ్లి అక్కడే ఆగిపోయాయి.
ఆగిన తాగునీటి సరఫరా
ఈనాడు, హైదరాబాద్: ఈదురు గాలులు, వర్షానికి విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగడంతో గ్రేటర్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా మంజీరా పంపింగ్ స్టేషన్ల వద్ద గాలులకు చెట్లు విరిగి విద్యుత్తు తీగలపై పడడంతో సరఫరా నిలిచిపోయింది.దీంతో 40 ఎంజీడీల నీటి సరఫరా ఆగిపోయింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించడంతో నీటి పంపింగ్ను ప్రారంభించారు. సాయంత్రం నుంచి గ్రేటర్లోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాను అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది గంటలకే పార్కులకు తాళం
[ 20-05-2024]
విశ్రాంతి లేని నగరం హైదరాబాద్. ఎప్పుడు రోడ్డుపైకి వెళ్లినా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. రాత్రి వేళల్లోనూ ఐటీకారిడార్, కొన్ని ప్రధాన రహదారులపై కార్యాలయాలు పనిచేస్తుంటాయి. -
కిలోమీటరున్నర పనులు.. నాలుగు నెలలు
[ 20-05-2024]
నగరంలో వానాకాలం ప్రారంభం నాటికే రహదారులు, భూగర్భ తవ్వకాల పనులు పూర్తి చేయాలి. లేదంటే వరదలతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. -
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?
[ 20-05-2024]
హైదరాబాద్ మెట్రోలో సగటున ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారి నుంచి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థకు టికెట్ల ద్వారా రూ.కోటిన్నర ఆదాయం సమకూరుతోంది. -
కంటికి రెప్పలా.. కదిలారు
[ 20-05-2024]
పిల్లల్లో ఏర్పడే కంటి క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం ‘వైటథాన్ రన్’ పేరిట పరుగు నిర్వహించారు.హెచ్సీయూలో జరిగిన ఈ పరుగును మాదాపూర్ డీసీపీ డా.జి.వినీత్ ప్రారంభించారు. -
అసెంబ్లీకి ఓటెత్తి..లోక్ సభకు అనాసక్తి
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో..ప్రధాన పార్టీల అభ్యర్థులు అసెంబ్లీ సెగ్మెంట్లలో నమోదైన పోలింగ్ శాతాన్ని పోల్చుకుంటున్నారు. -
ఉద్యానాలు.. ఆక్రమించేశారు
[ 20-05-2024]
హైదరాబాద్ శివారులోని దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన రూ.వంద కోట్ల విలువైన మూడెకరాల స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించేశారు. -
భూనిర్వాసితులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశ చూపెట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసంచేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని -
ప్రపంచంలోనే అరుదు.. బాంబే బ్లడ్ గ్రూపు
[ 20-05-2024]
బాంబే బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ అని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
స్పందనలో వేగం.. నష్టానికి కళ్లెం
[ 20-05-2024]
అగ్నిప్రమాదాల సమయంలో ‘తక్షణ ప్రతిస్పందన సమయం’ పెరగడంతో ఆస్తి నష్టం తగ్గుతోంది. ఫైరింజన్ వెళ్లడం కాస్త ఆలస్యమైనా కోట్లాది రూపాయల ఆస్తి కాలిబూడిదయ్యే ప్రమాదం ఉంది. -
బెట్టింగ్లతో అప్పులపాలై.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
[ 20-05-2024]
ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఎంఎస్ఎంఈ యూనిట్ల అద్దె కష్టాలకు చెక్
[ 20-05-2024]
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అద్దె కష్టాలు, యూనిట్ విస్తరణ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు యూనిట్ల తరలింపునకు తొలి అడుగు పడింది. -
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
[ 20-05-2024]
పీర్జాదిగూడ నగరంలో అవిశ్వాస తీర్మానంపై ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, భారాసలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పాటు బల నిరూపణకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సమన్వయకర్తగా అంబర్పేట జైస్వాల్ గార్డెన్కు చెందిన మధుసత్యం గౌడ్ నియమితులయ్యారు. -
ఎరువు.. కావాలి ఆదరువు
[ 20-05-2024]
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
పల్లె పోరుకు కసరత్తు
[ 20-05-2024]
స్థానిక సమరానికి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘నేలబిడ్డల’పై.. నిప్పులు చిమ్మిన నింగి
[ 20-05-2024]
ప్రకృతితో మమేకమయ్యే హలధారి.. వానకు తడిసి.. ఎండకు ఎండి పంటే ప్రాణంగా ముందుకు ‘సాగు’తాడు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. -
కలుద్దామని పిలిచి.. గొలుసు చోరీ
[ 20-05-2024]
సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తులు.. ఓ ఐటీ ఉద్యోగిని హింసించి బంగారు గొలుసు అపహరించిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..