Kadapa: కడప రిమ్స్‌లో కరోనా కలకలం.. 50 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్‌

కడప రిమ్స్‌లో కరోనా కలకలం రేగింది. కడప రిమ్స్‌ వైద్య కళాశాలలో 50 మంది వైద్య విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది.

Published : 17 Jan 2022 13:41 IST

కడప: కడప రిమ్స్‌లో కరోనా కలకలం రేగింది. కడప రిమ్స్‌ వైద్య కళాశాలలో 50 మంది వైద్య విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. ఎన్టీఆర్‌ వర్సిటీ ఆధ్వర్యంలో రేపు ఎంబీబీఎస్‌ ఫైనల్‌ పరీక్షలు జరగనున్నాయి. కళాశాలలో రేపు 150 మంది వైద్య విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 50 మంది వైద్య విద్యార్థులు కొవిడ్ బారినపడగా.. మరికొంత మంది విద్యార్థుల నివేదికలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రేపటి పరీక్షలు వాయిదా వేయాలని వైద్య కళాశాల యాజమాన్యం ఎన్టీఆర్‌ వర్సిటీని కోరింది. రేపు ఫైనల్‌ పరీక్షలు జరగనుండగా.. కొవిడ్‌ కలకలం రేగడంతో వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని