పొలాల్లోకి దూసుకెళ్లిన లారీ... డ్రైవరు మృతి
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో గురువారం అనంతపురం-తాడిపత్రి ప్రధాన రహదారిపై లారీ పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ రవితేజ(33) మృతిచెందాడు. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు..
మృతిచెందిన రవితేజ
పెద్దపప్పూరు, న్యూస్టుడే: అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో గురువారం అనంతపురం-తాడిపత్రి ప్రధాన రహదారిపై లారీ పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ రవితేజ(33) మృతిచెందాడు. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. కడపజిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రవితేజ అనంతపురం నుంచి తాడిపత్రికి లారీని తరలిస్తుండగా ముచ్చుకోట అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారి నుంచి పొలాల్లోకి దూసుకువెళ్లి నిలిచిపోయింది. స్థానికుల సమాచారం మేరకు.. సీఐ మల్లికార్జునగుప్తా, ఎస్సై వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లారీ క్యాబిన్లో అప్పటికే మృతిచెందిన రవితేజ మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రవితేజ తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు.