logo

అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు

ప్రొద్దుటూరు ఆటోనగర్‌లో మంగళవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సుల మరమ్మతుల కోసం వాహన యజమానులు ఆటోనగర్‌లోని షెడ్డుకు వాహనాలను తీసుకెళ్లారు.

Published : 27 Jan 2022 01:45 IST

ప్రొద్దుటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు ఆటోనగర్‌లో మంగళవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సుల మరమ్మతుల కోసం వాహన యజమానులు ఆటోనగర్‌లోని షెడ్డుకు వాహనాలను తీసుకెళ్లారు. మంగళవారం రాత్రి ఉన్నట్టుండి నిలిపి ఉంచిన ఒక బస్సులో మంటలు చెలరేగి పక్కనే ఉన్న మిగిలిన వాహనాలకూ మంటలు వ్యాపించాయి. ఇందులో రెండు బస్సులు పూర్తిగా దగ్ధం కాగా.. మరో నాలుగు ఆర్టీసీ అద్దె బస్సులు స్పల్పంగా కాలిపోయాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంజీవరెడ్డి తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని