logo

30న పీలేరు, మైదుకూరులలో సీఎం జగన్‌ బహిరంగ సభలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు, పీలేరులో ఈ నెల 30న నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం జగన్‌ పాల్గొననున్నారు.

Published : 27 Apr 2024 05:58 IST

ఈనాడు, కడప: ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు, పీలేరులో ఈ నెల 30న నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం జగన్‌ పాల్గొననున్నారు. రోజుకు మూడు సభల్లో పాల్గొనడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు కొండపి నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మైదుకూరులో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పీలేరులో సభకు హాజరుకానున్నారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని